అన్నదాతల హైరానా
పాడి పశువులపై అడవి జంతువులు దాడి చేసి చంపేస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట మూగజీవులు బలవుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ బావులు, పొలాల వద్ద కట్టేసిన దూడలను చంపుతుండడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
పాడి పశువులపై అడవిజంతువుల దాడి
నెల రోజుల్లో 11 దూడల మృత్యువాత
న్యూస్టుడే- చిన్నకోడూర్, నంగునూరు, హుస్నాబాద్ గ్రామీణం
పెద్ద కోడూర్లో అమర్చిన ట్రాప్ కెమెరా
పాడి పశువులపై అడవి జంతువులు దాడి చేసి చంపేస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట మూగజీవులు బలవుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ బావులు, పొలాల వద్ద కట్టేసిన దూడలను చంపుతుండడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. నెల రోజుల వ్యవధిలో అడవి జంతువుల దాడిలో 11 దూడలు మృత్యువాత పడటం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది.
ఇదీ పరిస్థితి..
చిన్నకోడూర్ మండలంలో వ్యవసాయ బావులు, పొలాల వద్ద కట్టేసిన పాడిపశువులపై అడవి జంతువులు దాడి చేస్తున్నాయి. పొలాల వద్ద పశుగ్రాసం, తాగునీరు ఉండడంతో పగలంతా మేత మేపి సాయంత్రం అక్కడే కట్టేస్తున్నారు. యజమానులు రాత్రిపూట అక్కడ ఉండకపోవడంతో గుర్తుతెలియని అడవిజంతువులు దాడికి పాల్పడుతున్నాయి. మండలంలోని పెద్దకోడూర్లో ఈనెల 3న వ్యవసాయ బావివద్ద రెండు దూడలను అడవి జంతువులు చంపేశాయి. ఆ మరుసటి రోజు మాచాపూర్లో 4 దూడలు మృతిచెందాయి. అంతకుముందు మండలంలోని పెద్ద కోడూర్లో 5 దూడలు బలయ్యాయి.
గుర్తించని అటవీశాఖ అధికారులు
పాడిపశువులపై దాడి చేస్తున్న అడవిజంతువులను అటవీశాఖ అధికారులు ఇప్పటివరకు గుర్తించలేదు. నెల రోజుల్లో 11 దూడలు మృతి చెందాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. దాడులు జరిగిన గ్రామాల్లో రైతుల పొలాల వద్ద ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. జంతువుల పాదముద్రలు సేకరించినా ఇప్పటివరకు గుర్తించలేదు. కుక్కలే దాడి చేసి చంపుతున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. కుక్కలు రాత్రిపూట దూడలపై దాడి చేయవని అన్నదాతలు అంటున్నారు. నాలుగేళ్ల కిందట అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లో అడవిజంతువులు దూడలను హతమార్చాయి. అధికారులు వాటి పాదముద్రల ఆధారంగా హైనాలుగా గుర్తించారు. వాటిని పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేసినా చిక్కలేదు. ఇక్కడా హైనాలే దాడులు చేస్తున్నాయేమోనని రైతులు భావిస్తున్నారు. హైనాలు సమీపంలోని అటవీప్రాంతం, గుట్టలను ఆవాసంగా చేసుకుని రాత్రిపూట దాడులకు పాల్పడుతుంటాయి. పెద్దకోడూరు, మాచాపూర్ పరిసరాలు, శివారులో అటవీప్రాంతంతోపాటు గుట్టలు ఉన్నాయి. దాడుల్లో మృతిచెందిన దూడలకు ప్రభుత్వం అటవీశాఖ ద్వారా పరిహారం ఇప్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
- సుంచు నర్సయ్య, మాచాపూర్
ఇటీవల పొలం వద్ద దూడ మృతిచెందింది. దీంతో ఆవు పాలు ఇవ్వడం లేదు. మా ఊళ్లో ఇప్పటికే మూడు దూడలపై అటవీ జంతువులు దాడి చేసి హతమార్చాయి. ప్రభుత్వం అటవీశాఖ ద్వారా పరిహారం ఇప్పించాలి.
అడవి జంతువులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాం
- ఇక్రమొద్దీన్, ఎఫ్ఆర్వో
దూడలపై దాడులకు పాల్పడుతున్న జంతువులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. దాడులు జరిగిన ప్రదేశాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు వాటిలో నమోదు కాలేదు. ఒక చోట కుక్క సంచరించినట్లు నమోదైంది. దాడులకు పాల్పడుతోంది కుక్కలా లేదా వేరే ఇతర జంతువులా అనేది గుర్తించే పనిలో ఉన్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం