దామోదర తీన్మార్
మాజీ మంత్రి, అందోలు ఎమ్మెల్యే దామోదర రాజనర్సింహకు అనుభవం కలిసొచ్చింది. తాజాగా రాష్ట్ర మంత్రిగా అవకాశం దక్కగా.. గురువారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు.
కలిసొచ్చిన అనుభవం.. వరించిన మంత్రి పదవి
అన్ని రంగాల అభివృద్ధిపై జిల్లా ప్రజల ఆశలు
న్యూస్టుడే, సంగారెడ్డి అర్బన్, జోగిపేట
మాజీ మంత్రి, అందోలు ఎమ్మెల్యే దామోదర రాజనర్సింహకు అనుభవం కలిసొచ్చింది. తాజాగా రాష్ట్ర మంత్రిగా అవకాశం దక్కగా.. గురువారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి పదవి దక్కించుకున్న తొలి నేత దామోదర కావడం గమనార్హం. ఆయన విద్యావేత్త. ఉమ్మడి జిల్లాపై మంచి పట్టుంది. గతంలో ఉప ముఖ్యమంత్రి, రెండుసార్లు మంత్రి పదవులు చేపట్టిన అనుభవం ఉంది. తాజాగా మరోమారు అమాత్య యోగం దక్కడంతో జిల్లా మరింత అభివృద్ధి చెందేలా దామోదర కృషి చేయాలని ప్రజలు ఆశిస్తున్న నేపథ్యంలో కథనం.
విజయానికి బాటలిలా..
అందోలు నుంచి గత రెండు పర్యాయాలు ఓటమి చెందడంతో ఈసారి గెలుపును సవాలుగా తీసుకున్నారు దామోదర. కుమార్తె త్రిష గడప గడపకు త్రిషమ్మ పేరుతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. భారాస ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపడంతో పాటు.. ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. యువ గర్జన, విద్యార్థి-నిరుద్యోగ గర్జన, సభలు నిర్వహించారు. తనకు ఇవే చివరి ఎన్నికలని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కీలక పదవి వస్తుందని, ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని దామోదర రాజనర్సింహ ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచార సభకు రాహుల్ గాంధీ సైతం రావడం ఆయన విజయానికి దోహదపడింది.
ఉమ్మడి జిల్లాకు పెద్దన్న పాత్ర
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా.. ఉమ్మడి మెదక్ జిల్లాలో అందోలు నియోజకవర్గానికి చెందిన దామోదర పెద్దన్న పాత్ర పోషించే అవకాశం ఉంది. ఉమ్మడి మెదక్లో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా 7 చోట్ల భారాస విజయం సాధించింది. అందోలు, నారాయణఖేడ్, మెదక్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుందరూ ఓటమి పాలయ్యారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం బాధ్యతలు దామోదరపైనే ఉంటాయని చెప్పవచ్చు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆయా వాటిల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి ఈయనే కృషి చేయాల్సి ఉంటుంది.
కుమార్తె త్రిషతో కలిసి ప్రచారం చేస్తూ..
ఐఏఎస్ అవుదామనుకొని.. రాజకీయాల్లోకి..
అందోలు ఎమ్మెల్యేగా నాలుగుసార్లు గెలుపొంది మంత్రి బాధ్యతలు నిర్వహించిన సి.రాజనర్సింహ 1988లో పదవిలో కొనసాగుతూనే అనారోగ్యంతో మరణించారు. ఆయన తనయుడు దామోదర రాజనర్సింహ అప్పట్లో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం 1989లో దామోదరకే టికెట్ ఖరారు చేసి అందోలు బరిలో నిలుపగా ఆయన విజయం సాధించారు. 1994, 1998, 1999లో జరిగిన ఎన్నికల్లో దామోదర ఓటమి పాలవ్వగా.. 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి, రోశయ్య, కిరణ్కుమార్రెడ్డిల మంత్రి వర్గంలో ఉపముఖ్యమంత్రిగా, మార్కెటింగ్ శాఖ, విద్యాశాఖ మంత్రిగా పదవులు నిర్వహించారు. ఆ తర్వాత 2014, 2018 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఆయన తాజాగా జరిగిన శాసనసభ పోరులో 28 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో భారాస అభ్యర్థి క్రాంతికిరణ్పై విజయం సాధించారు.
గతంలో తనమైన ముద్ర
అందోలు నియోజకవర్గంలోని సింగూరు ప్రాజెక్టు నుంచి 40వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే డిమాండ్తో 2003లో 102 రోజులు దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సింగూరు కాలువలకు రూ.89.98 కోట్లు మంజూరు చేయించారు. పనులు పూర్తయ్యేలా చొరవచూపారు. విద్యాభివృద్ధికి చౌటకూరు మండలం సుల్తాన్పూర్ వద్ద 165 ఎకరాల్లో జేఎన్టీయూ కళాశాల ఏర్పాటులో దామోదర కీలకపాత్ర పోషించారు. జోగిపేటలో మహిళా డిగ్రీకళాశాల, పీజీ కళాశాల, జనరల్, మహిళా పాలిటెక్నిక్లు, అందోలు మండలంలోని సంగుపేటకు మహిళా వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలను మంజూరు చేయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు