పథకాల అమలులో పారదర్శకత
విద్యార్థులకు ప్రభుత్వం వివిధ రూపాల్లో సహకారం అందిస్తోంది. మధ్యాహ్న భోజనం.. అల్పాహారం.. విద్యార్థులకు ఏకరూప దుస్తులు.. పుస్తకాలు.. ఉపకార వేతనాలు.. రవాణా భత్యం ఇలా పలు రకాల పథకాలు అమలవుతున్నాయి.
యూడైస్లో పక్కాగా వివరాల నమోదు
తరగతి గదిలో విద్యార్థులు
న్యూస్టుడే, మెదక్: విద్యార్థులకు ప్రభుత్వం వివిధ రూపాల్లో సహకారం అందిస్తోంది. మధ్యాహ్న భోజనం.. అల్పాహారం.. విద్యార్థులకు ఏకరూప దుస్తులు.. పుస్తకాలు.. ఉపకార వేతనాలు.. రవాణా భత్యం ఇలా పలు రకాల పథకాలు అమలవుతున్నాయి. ఆయా వాటి అమలుకు యూ డైస్ దోహదపడుతుంది. ఇందులోని సమాచారం ఆధారంగానే బడ్జెట్ కేటాయిస్తున్నారు. అయితే పలు అవకతవకల వల్ల కచ్చితమైన సమాచారం లేక నిధులు పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో యూడైస్+ వెబ్సైట్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో నమోదయ్యే వివరాల ఆధారంగానే నిధులు మంజూరు చేయనున్నారు.
పాఠశాలల నిర్వహణకు నిధుల మంజూరులో పారదర్శకత పాటించేందుకు యూడైస్+ వెబ్సైట్ దోహదపడుతుంది. ఎప్పటికప్పుడు ఇందులో జరిగే మార్పులు, చేర్పులపై పాఠశాలల నిర్వాహకులకు విద్యాశాఖ మార్గనిర్దేశనం చేస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఇటీవల ఎంఈవోలు, హెచ్ఎంలకు శిక్షణ మొదలైంది. వెబ్సైట్లో పొందుపర్చే సమాచారం ఆధారంగా మన ఊరు - మనబడి, పీఎం శ్రీ పథకం కింద ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేస్తున్న నేపథ్యంలో ప్రాధాన్యం నెలకొంది.
14వ తేదీలోపు..
సదరు వెబ్సైట్లో వివరాలను ఈ నెల 14వ తేదీలోపు నమోదు పూర్తిచేయాలని విద్యాశాఖ నిర్దేశిచింది. ఇందుకు అనుగుణంగా ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు తర్ఫీదు ఇచ్చారు. ప్రస్తుతం వివరాల నమోదుకు కసరత్తు జరుగుతోంది. యూడైస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్)లో పాఠశాల, కళాశాల (జూనియర్) స్థాయి సర్వ సమాచారాన్ని నిక్షిప్తం చేస్తుంటారు.
కూచన్పల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో వివరాలు నమోదు చేస్తున్న సిబ్బంది
అదనపు సమాచారంతో..
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, గురుకులాలు, కస్తూర్బాలు, ఆదర్శ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలను గతంలోనే ఆన్లైన్లో నమోదు చేశారు. దీనికి మరిన్ని వివరాలు జోడించి కొన్ని మార్పులు చేయనున్నారు. తరగతి గదులు, శౌచాలయాలు, తాగునీరు, మౌలిక వసతుల సమాచార వివరాలు నమోదు చేయనుండటంతో నిధుల విడుదలకు ఉపయుక్తంగా ఉండనుంది. ఆయా కొత్త అంశాలపై ఎంఈవోలు, సముదాయ ప్రధానోపాధ్యాయులు, ఇతర ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు.
మూడంచెల విధానంలో..
యూడైస్+లో నమోదైన వివరాలను మూడంచెల విధానంలో పరిశీలిస్తారు. ఈనెల 14లోపు ప్రధానోపాధ్యాయులు పాఠశాలల వివరాలు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి. ఆయా వివరాలు సక్రమంగా ఉన్నాయా, లేవా అనే విషయాలను స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పరిశీలించి ఎంఈవోలకు నివేదిక అందిస్తారు. అనంతరం 25 శాతం పాఠశాలలను మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారి 10 శాతం పాఠశాలలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తారు.
కొత్తగా ‘పెన్’ కేటాయింపు
ఈసారి కొత్తగా ఏక్ భారత్ -శ్రేష్ఠ భారత్ కార్యక్రమ ఉద్దేశం వివరించనున్నారు. పూర్వ ప్రాథమిక స్థాయి విద్యార్థులకు మరింత నాణ్యమన విద్యను అమలు చేయనున్నారు. కోర్సుల విశేషాలను, అనుబంధ వివరాలపై అవగాహన కల్పిస్తున్నారు. వెబ్సైట్లో నమోదైన ప్రతి విద్యార్థికి పెన్(పర్మినెంట్ ఎడ్యుకేష్ నంబరు) కేటాయిస్తారు. అన్ని రకాల పాఠశాల, జూనియర్ కళాశాలల్లో ప్రవేశం మొదలు, ఉన్నత విద్యను పూర్తి చేసే వరకు ఈ నంబరే విద్యార్థికి కీలకం. ఇప్పటికే జిల్లాలో 1.20 లక్షల మందికి నంబరును కేటాయించారు.ఈ విద్యా సంవత్సరం నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది.
పకడ్బందీగా వివరాలు నమోదు
రాధాకిషన్, జిల్లా విద్యాధికారి
యూడైస్+లో పాఠశాలలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలు పకడ్బందీగా నమోదు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. మండలాల వారీగా శిక్షణలు పూర్తి చేశాం. నిర్ణీత గడువులోగా వివరాలను నమోదు పూర్తి చేస్తాం. ఈ విధానంలో ఒకే దగ్గర అన్ని వివరాలు ఉంటాయి. తద్వారా సులభంగా నిధులు విడుదలయ్యే అవకాశం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్