విద్యుత్తు ఉపకేంద్రంలో భారీ అగ్నిప్రమాదం
సిద్దిపేట పట్టణంలోని 220 కేవీ విద్యుత్తు ఉపకేంద్రంలో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వివరాలివీ.. సిద్దిపేటలోని ముస్తాబాద్ చౌరస్తాలో 220కేవీ విద్యుత్తు ఉప కేంద్రంలో 100ఎంఈఏ సామర్థ్యం కలిగిన పవర్ ట్రాన్స్ఫార్మర్లో ఒక్కసారిగా అగ్గి రాజుకుంది.
రూ.2 కోట్లకు పైనే నష్టం
మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
సిద్దిపేట అర్బన్, సిద్దిపేట టౌన్, న్యూస్టుడే: సిద్దిపేట పట్టణంలోని 220 కేవీ విద్యుత్తు ఉపకేంద్రంలో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వివరాలివీ.. సిద్దిపేటలోని ముస్తాబాద్ చౌరస్తాలో 220కేవీ విద్యుత్తు ఉప కేంద్రంలో 100ఎంఈఏ సామర్థ్యం కలిగిన పవర్ ట్రాన్స్ఫార్మర్లో ఒక్కసారిగా అగ్గి రాజుకుంది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడి పొగ వ్యాపించింది. గమనించిన విద్యుత్తు సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సిబ్బంది హుటాహుటిన చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ట్రాన్స్ఫార్మర్లో అయిల్ ఉండటంతో మంటలు ఎంతకూ అదుపులోకి రాలేదు. దీంతో దుబ్బాకకు చెందిన మరో అగ్నిమాపక శకటాన్ని రప్పించారు. మూడు గంటలకు పైనే శ్రమించగా మంటలను ఆర్పివేశారు. విద్యుత్తు శాఖ ఎస్ఈ మహేష్కుమార్, ట్రాన్స్కో డీఈ శ్రీనివాస్ పర్యవేక్షించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, పోలీసు కమిషనర్ అనూరాధ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. కారణాలపై ఆరా తీశారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ట్రాన్స్కో డీఈ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సాయంత్రం 6.55 గంటలకు ఉపకేంద్రంలో విద్యుత్తు ట్రిప్ అయిందని, సిబ్బంది గమనిస్తుండగానే మంటలు చేలరేగాయన్నారు. సిబ్బంది అప్రమత్తమై మిగతా విభాగాలకు విద్యుత్తు సరఫరా నిలిపివేశారన్నారు. సుమారు రూ.2 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ఆయన వెల్లడించారు. ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.
నిలిచిపోయిన విద్యుత్తు సరఫరా..
జిల్లాకేంద్రంలో అగ్నిప్రమాదం కారణంగా సిద్దిపేటతో పాటు అర్బన్, గ్రామీణం, నారాయణరావుపేట, లక్ష్మీదేవిపల్లి ఉపకేంద్రాల పరిధిలోని గ్రామాలు, చిన్నకోడూరులోని 5 గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు చీకట్లో ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఘటనా స్థలిని చూసేందుకు ప్రజలు తరలివచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు