రక్తమోడిన దారులు
సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో జరిగిన రహదారి ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. కన్నతల్లి కళ్లెదుటే చిన్నారి.. పుస్తకాలు, నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్తూ ఇద్దరు యువకులు.. వాహనాన్ని దాటే క్రమంలో మరొకరు మృత్యువాత పడ్డారు.
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో జరిగిన రహదారి ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. కన్నతల్లి కళ్లెదుటే చిన్నారి.. పుస్తకాలు, నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్తూ ఇద్దరు యువకులు.. వాహనాన్ని దాటే క్రమంలో మరొకరు మృత్యువాత పడ్డారు.
వాహనంపై ఎక్కించుకొని..
అరుణ్, అయాన్
గజ్వేల్ గ్రామీణ: సిద్దిపేట జిల్లా గజ్వేల్-సంగాపూర్ దారిపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి విభాగినికి ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు బుధవారం మృతి చెందారు. సీఐ సైదా తెలిపిన వివరాలు.. గజ్వేల్కు చెందిన అయాన్ (20) పట్టణంలోని వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. ఉదయం విధుల్లోకి వచ్చిన అయాన్.. వాహనంపై డబ్బాలో మంచినీళ్లు తెచ్చేందుకు బయలుదేరాడు. దౌల్తాబాద్ మండలం శేరిపల్లి బందారం గ్రామానికి చెందిన గడ్డమీది అరుణ్ (20).. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారానికి చెందిన నక్కని దిలీప్లు గజ్వేల్ వసతి గృహంలో ఉంటూ బాలుర డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీరికి నోటు పుస్తకాలు అవసరం ఉండటంతో రహదారిపైకి వచ్చి అయాన్ను లిఫ్ట్ అడుగగా ఎక్కించుకొని వస్తుండగా బాలికల విద్యా సౌధం సమీపంలో విభాగినికి ఢీకొట్టింది. అరుణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా అయాన్ చనిపోయాడు. దిలీప్ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గడ్డమీది శ్రీనివాస్ దంపతుల ఇద్దరు కుమారుల్లో అరుణ్ చిన్నవాడు. తల్లిదండ్రులు, పెద్దకుమారుడు హైదరాబాద్కు జీవనోపాధికి వలస వెళ్లారు.
తల్లి కళ్ల ముందే..
తలపాక రిత్విక్
కొండపాక గ్రామీణం: సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ ముందు రాజీవ్ రహదారిపై అమ్మ చూస్తుండగానే బాలుడిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఎస్సై పి.శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తలపాక లావణ్య ఇద్దరు పిల్లలు రిత్విక్, దాసులతో కలసి కుకునూరుపల్లి మండలం మాత్పల్లిలో బంధువుల ఇంటికి ప్రతిష్ఠోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలేదేరింది. రహదారిని దాటుతుండగా ఒక్కసారిగా పెద్దకుమారుడు తలపాక రిత్విక్(6) ముందుకు పరుగెత్తాడు. వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో శరీరం నుజ్జునుజ్జుయి చనిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
లారీని దాటే క్రమంలో..
జహీరాబాద్ అర్బన్: ముందుగా వెళ్తున్న లారీని దాటే క్రమంలో కారుతో ఢీకొట్టడంతో బీదర్ పట్టణానికి చెందిన వ్యక్తి మృతి చెందినట్లు జహీరాబాద్ పట్టణ ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపారు. బైపాస్ రోడ్డులోని అల్గోల్ చౌరస్తాలో మంగళవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. బీదర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బీదర్ పట్టణంలోని నౌబాద్కు చెందిన శివకుమార్(37) మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత