logo

ఎంత పనాయె!.. కుమారుడి హత్యతో రోదిస్తూనే కుప్పకూలి మృతి చెందిన తండ్రి

ఇటీవల హత్యకు గురైన కుమారుడిని తలుచుకుంటూ.. బంధువుల వద్ద రోదిస్తూనే తండ్రి కుప్పకూలిపోయి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో బుధవారం జరిగింది.

Updated : 22 Feb 2024 06:30 IST

నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు

నంగునూరు: ఇటీవల హత్యకు గురైన కుమారుడిని తలుచుకుంటూ.. బంధువుల వద్ద రోదిస్తూనే తండ్రి కుప్పకూలిపోయి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో బుధవారం జరిగింది. ఘనపూర్‌ మాజీ ఎంపీటీసీ సభ్యుడు బండి వెంకటయ్య ఇటీవల హత్యకు గురయ్యాడు. బుధవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తారనే సమాచారం తెలిసింది. ఇంటి ముందు వెంకటయ్య తండ్రి బాలమల్లు (90), కుటుంబ సభ్యులు, బంధువులు కూర్చొని హరీశ్‌రావు వస్తారని ఎదురుచూస్తున్నారు. బాలమల్లు తన కొడుకు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రోదిస్తూ కిందపడి పోయి చనిపోయాడు. పదిహేను నిమిషాల తర్వాత హరీశ్‌రావు చేరుకొన్నారు. విషయం తెలిసి బాధపడ్డారు. తండ్రి, కుమారులకు నివాళి అర్పించి, కుటుంబాన్ని ఓదార్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని