టీ ఫైబర్ సేవలెప్పుడు?
ప్రతీ పంచాయతీకి అంతర్జాల సౌకర్యం కల్పించేందుకు గత ప్రభుత్వం చేపట్టిన టీఫైబర్ కార్యక్రమం ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. కేబుల్ వైర్లు వేసి పరికరాలు బిగించినెలలు గడుస్తున్నా అంతర్జాల కనెక్షన్ మాత్రం ఇవ్వలేదు.
పరికరాలు అలంకారప్రాయం
పంచాయతీలో ఏర్పాటు చేసిన పరికరం
న్యూస్టుడే, అక్కన్నపేట(హుస్నాబాద్ గ్రామీణం): ప్రతీ పంచాయతీకి అంతర్జాల సౌకర్యం కల్పించేందుకు గత ప్రభుత్వం చేపట్టిన టీఫైబర్ కార్యక్రమం ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. కేబుల్ వైర్లు వేసి పరికరాలు బిగించినెలలు గడుస్తున్నా అంతర్జాల కనెక్షన్ మాత్రం ఇవ్వలేదు. దీంతో పరికరాలన్నీ అలంకారప్రాయంగా మారాయి.
టీ ఫైబర్ ద్వారా పంచాయతీలకు, ఆ తర్వాత ఇంటింటికీ కనెక్షన్లు ఇచ్చి అంతర్జాల సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలనుకున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా అన్ని రోడ్లను తవ్వి ఫైబర్ కేబుల్ వైర్లు వేశారు. కార్యాలయాల్లో అంతర్జాలానికి సంబంధించిన పరికరాలు బిగించారు. విద్యుత్తు సదుపాయం కోసం సౌరఫలకాలు ఏర్పాటు చేసి పరికరాలు నడిచేలా అనుసంధానించారు. ఆ తర్వాత ఎంపీడీవో ఆఫీసులో పరికరాలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి గ్రామ పంచాయతీలకు అనుసంధానించారు. వీటి ద్వారా ఇంటర్నెట్ వస్తుందా లేదా అనే విషయం తెలుసుకునేందుకు టెస్టింగ్ సైతం నిర్వహించారు. ఆ తర్వాత వదిలేశారు. ఇప్పటివరకు కనెక్షన్లు ఇవ్వకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా జిల్లాలోని చాలా మండలాల్లో అంతర్జాల సేవలు అందడం లేదు.
చరవాణి నుంచి.. నెట్ సౌకర్యం లేక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. చరవాణుల ద్వారా వైఫై కనెక్ట్ చేసుకుని అంతర్జాల సేవలు పొందుతున్నారు. దీని ద్వారా వచ్చే నెట్ వేగం తక్కువగా ఉంటోందని, సిగ్నల్స్ సరిగా అందడం లేదని వాపోతున్నారు. ఫైల్స్ డౌన్లోడ్ కావడం లేదని కంప్యూటర్ ఆపరేటర్లు తెలిపారు.
పనులు పూర్తి కాలేదు
-రాజేందర్, ఫైబర్నెట్ ప్రతినిధి
టీ ఫైబర్ పనులు ఇంకా పూర్తి కాలేదు. రౌటర్లు బిగించాల్సి ఉంది. రోడ్డు పనులతో అక్కడక్కడ కేబుల్వైర్లు ధ్వంసమయ్యాయి.
ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు
-దేవకీదేవి, డీపీవో
జిల్లాలోని దాదాపు అన్నీ పంచాయతీల్లో టీఫైబర్ కార్యక్రమం కింద వ్యవస్థ ఏర్పాటు చేశారు. అనేక చోట్ల అంతర్జాల సేవలు అనుసంధానం అయినట్లు తెలుస్తోంది. గతంలో కావాల్సిన స్థలం కావాలంటే కేటాయించాం. ఇంకా మాకు అప్పగించలేదు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం