ఇక రహదారులకు మహర్దశ
తెలంగాణ దక్షిణ ప్రాంత ప్రగతికి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇందుకు నిదర్శనంగా ముఖ్యమంత్రి రేంవత్రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మంగళవారం దిల్లీలో కలిసి పలు విషయాలపై విజ్ఞప్తి చేయడాన్ని పేర్కొనవచ్చు.
విస్తరణకు నోచుకోనున్న మన్నెగూడ-వికారాబాద్-తాండూరు-జహీరాబాద్-బీదర్ మార్గాలు
న్యూస్టుడే, తాండూరు, జహీరాబాద్: తెలంగాణ దక్షిణ ప్రాంత ప్రగతికి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇందుకు నిదర్శనంగా ముఖ్యమంత్రి రేంవత్రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మంగళవారం దిల్లీలో కలిసి పలు విషయాలపై విజ్ఞప్తి చేయడాన్ని పేర్కొనవచ్చు. దీన్లో దక్షిణ భాగం పరిధిలోకి వచ్చే రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)లతో పాటు రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు అనుమతుల మంజూరు కోరారు. అలాగే ముఖ్యమైన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయడం గురించి చర్చించారు. దీనివల్ల వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు కలిగే ప్రయోజనాలపై ‘న్యూస్టుడే’ కథనం.
134 కి.మీ. పొడవు: జాతీయ రహదారులుగా విస్తరించాల్సిన రాష్ట్ర రహదారుల జాబితాలో 134 కి.మీ. పొడవు కలిగి జిల్లా పరిధిలోకి వచ్చే మన్నెగూడ-వికారాబాద్-తాండూరు, సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే జహీరాబాద్-బీదర్ రహదారులున్నాయి. ప్రస్తుతం రెండు వరుసలుగా ఉన్న ప్రతిపాదిత రోడ్లు నాలుగు వరుసలతో జాతీయ రహదారులుగా మారితే జిల్లా రవాణా అనూహ్యంగా అభివృద్ధి సాధిస్తుంది.
ముంబయి జాతీయ రహదారికి అనుసంధానం: రాష్ట్ర రహదారి తాండూరు నుంచి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వరకు ఉన్న 50 కి.మీ.రోడ్డు కూడా రెండు వరుసలదే. ఇది జహీరాబాద్లో ముంబయి-హైదరాబాద్ జాతీయ రహదారికి అనుసంధానమౌతుంది. వాహనాల రాకపోకలు ఎక్కువే. చాలా చోట్ల ప్రస్తుతం ఉన్న రోడ్డు గుంతల మయంగా మారింది. ఇందూరు వద్ద ప్రయాణం నరకంగా ఉంటోంది.
జహీరాబాద్-బీదర్ మార్గ విస్తరణకు 2017లోనే నిర్ణయం: జహీరాబాద్ నుంచి కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా కేంద్రం వరకు 30 కి.మీ. పొడవుతో ఉన్న మార్గాన్ని జాతీయ రహదారిగా విస్తరించాలని 2017లోనే నిర్ణయించారు. ఈ రోడ్డును ముంబయి-హైదరాబాద్ రహదారికి అనుసంధానం చేయాలన్నది ఉద్దేశం. అప్పట్లో హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ రహదారి కాంగ్రెస్ సదస్సులో ప్రస్తుత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. జహీరాబాద్-బీదర్ రహదారిని నాలుగు వరుసల రహదారిగా మార్చాలని ఆయనే ప్రకటించారు. కొన్ని రోజులకు ఈ విషయమై అప్పటి రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్షించారు. 2018లో రహదారి విస్తరణ జరుగుతుందని భావించారు. కాని కుదరలేదు. తాజాగా ముఖ్యమంత్రి విస్తరణపై చొరవ చూపారు.
జిల్లా కేంద్రంగా ఉన్న కర్ణాటక రాష్ట్ర బీదర్ పెద్ద పట్టణమే. వచ్చి పోయే వాహనాలు ఎక్కువే. బీదర్ నుంచి జహీరాబాద్కు రహదారి విస్తరణ జరిగితే వాహనదారులకు మరింత సౌకర్యంగా మారుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!