తనిఖీ హుళక్కి
ప్రభుత్వ ఆదాయంలో రవాణా శాఖది కీలక పాత్ర. ఈ శాఖ నుంచి ప్రతి నెల రూ.కోట్లలో ఖజానాకు ఆదాయం సమకూరుతోంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రాష్ట్ర సరిహద్దులోని అంతర్రాష్ట్ర చెక్పోస్టుల్లో ఉద్యోగులు, సిబ్బంది ఖాళీలు, సర్కారు ఆదాయానికి భారీగా గండి పడేలా చేస్తున్నాయి.
తెలంగాణ-సరిహద్దులోని మాడ్గి అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్పోస్టు
న్యూస్టుడే, జహీరాబాద్ అర్బన్: ప్రభుత్వ ఆదాయంలో రవాణా శాఖది కీలక పాత్ర. ఈ శాఖ నుంచి ప్రతి నెల రూ.కోట్లలో ఖజానాకు ఆదాయం సమకూరుతోంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రాష్ట్ర సరిహద్దులోని అంతర్రాష్ట్ర చెక్పోస్టుల్లో ఉద్యోగులు, సిబ్బంది ఖాళీలు, సర్కారు ఆదాయానికి భారీగా గండి పడేలా చేస్తున్నాయి. తెలంగాణ-కర్ణాటక సరిహద్దు సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడ్గి శివారులో హైదరాబాద్-ముంబయి 65వ నంబరు జాతీయ రహదారిపై అంతర్రాష్ట్ర రవాణా శాఖ చెక్పోస్టు ఉద్యోగుల ఖాళీలతో కొట్టుమిట్టాడుతోంది. వాహన తనిఖీల్లో ప్రధానమైన ఎంవీఐ, ఏఎంవీఐ పోస్టులను లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా బదిలీ చేయడంతో, కానిస్టేబుల్, హోంగార్డులే ఈ ప్రక్రియ చేపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ ద్వారంగా పేరొందిన మాడ్గి అంతర్రాష్ట్ర చెక్పోస్టు రవాణా పన్ను వసూళ్లలో రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రతి నెలా నిర్దేశించిన రూ.4 కోట్ల ఆదాయానికి మించి రూ.5 కోట్లకు పైచిలుకు వసూళ్లతో ఖజానాకు వెన్నుదన్నుగా నిలిచేది.
ప్రస్తుతం ఒకే ఒక్కడు..: మాడ్గి అంతర్రాష్ట్ర చెక్పోస్టులో ముగ్గురు ఎంవీఐలు, తొమ్మిది మంది ఏఎంవీఐలు విధులు నిర్వహిస్తుంటారు. ప్రతిరోజు రాత్రి, పగలు వంతుల వారీగా కానిస్టేబుల్, హోంగార్డుల సహకారంతో విధులు నిర్వహిస్తున్నారు. వీరు రాష్ట్రంలోకి రాకపోకలు సాగించే వాహనాల నుంచి రవాణా పన్ను, వాహన ప్రవేశానికి అనుమతులు, రవాణా చేస్తున్న సరుకుకు సంబంధించిన వివరాలను నమోదు చేస్తుంటారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఇటీవల మూడేళ్లు పైబడిన ఉద్యోగులకు స్థాన చలనం కలిగించడంతో కేంద్రం ఖాళీ అయ్యింది. చెక్పోస్టుకు బదిలీ చేసిన ఉద్యోగులు పూర్తి స్థాయిలో విధుల్లో చేరకపోవడం, మరోప్రాంతానికి పైరవీలు సాగిస్తున్నారు. దీంతో ఒకే ఒక ఎంవీఐ మాత్రమే విధుల్లో చేరారు.
ఆదాయానికి గండి..: హైదరాబాద్-ముంబయి 65వ నంబరు జాతీయ రహదారిపై నిమిషం వ్యవధి ఖాళీ లేకుండా వాహన రాకపోకలు సాగుతుంటాయి. ఏఎంవీఐలు లేకపోవడంతో కానిస్టేబుళ్లు, హోంగార్డులు చేయాల్సి వస్తోంది. ఫలితంగా వాహనాలు పూర్తి స్థాయిలో నిలపకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. గత జనవరి నుంచి ఉద్యోగులు బదిలీ అవుతున్నా నిర్దేశించిన ఆదాయం సమకూరింది. ప్రస్తుతం పూర్తిస్థాయిలో ఉద్యోగులు, సిబ్బంది లేకపోవడంతో ఆదాయం కోల్పోయే అవకాశం ఉంది. బదిలీల్లో కేటాయించిన ఎంవీఐలు, ఏఎంవీఐలు త్వరతగతిన ఉద్యోగాల్లో చేరేలా ఉన్నతాధికారులు చూడాల్సిన అవసరముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట