హడావుడిగా చేపట్టి.. అర్ధాంతరంగా ఆపేసి
ఎనిమిది గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిని విస్తరించాలని నిర్ణయించారు. ఇందుకు నిధులు మంజూరు కావడంతో గతేడాది శంకుస్థాపన చేశారు. ఎన్నికల అనంతరం పనులను మొదలుపెట్టారు.
మెదక్లోని దాయర రహదారి విస్తరణ పనుల తీరిది
ఓ ఇంటి ముందు తవ్వడంతో లోపలికి వెళ్లేందుకు దారి లేక
న్యూస్టుడే-మెదక్: ఎనిమిది గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిని విస్తరించాలని నిర్ణయించారు. ఇందుకు నిధులు మంజూరు కావడంతో గతేడాది శంకుస్థాపన చేశారు. ఎన్నికల అనంతరం పనులను మొదలుపెట్టారు. హడావుడిగా చేపట్టి.. అసంపూర్తిగా వదిలేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయ జోక్యం కారణంగానే అర్ధాంతరంగా పనులను నిలిపివేసినట్లు సమాచారం. ఈ అంశంపై ‘న్యూస్టుడే’ పరిశీలన కథనం...
ఇరుకైన దారి.. మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా నుంచి దాయర శివారులో ఉన్న గోసంద్రం, పిట్లం చెరువుల వరకు ఉన్న రహదారిని విస్తరించాలని నిర్ణయించారు. హవేలిఘనపూర్ మండలంలోని ముత్తాయికోట, కూచన్పల్లి, దేవునికూచన్పల్లి, తొగిట, ముత్తాయిపల్లి, ఫరీద్పూర్, సర్ధన, జక్కన్నపేట గ్రామాలకు ఈ మార్గం నుంచే వెళ్లాలి. ఆయా గ్రామాల ప్రజలు ఎక్కువగా చమాన్ చౌరస్తా మీదుగా రాకపోకలు కొనసాగిస్తారు. సర్ధనకు వెళ్లే ఆర్టీసీ బస్సు సైతం ఈ దారి నుంచే వెళ్తుంది. రాందాస్ చౌరస్తా నుంచి చమాన్ మీదుగా ఆవారబస్తీ వరకు ఉన్న రహదారి చాలా ఇరుకుగా ఉంది. ఈ క్రమంలో రహదారి విస్తరణకు గత ప్రభుత్వ హయాంలో రూ.7.80 కోట్లు మంజూరయ్యాయి. అక్టోబర్లో పనులకు శంకుస్థాపన చేపట్టారు.
ఇష్టారీతిన పనులు... టెండర్ దక్కించుకున్న గుత్తేదారు పనులను ఇష్టారీతిగా చేపడుతున్నారు. రహదారి విస్తరణతో పాటు ఇరువైపుల మురుగుకాలువ, మధ్యలో విభాగిని, వీధి దీపాల బిగింపు పనులు చేపట్టాలి. ముందుగా సినీమ్యాక్స్ థియేటర్ వద్ద నుంచి దాయర వెళ్లే శ్మశానవాటిక సమీపం వరకు ఇరువైపుల మురుగుకాలువ పనులను చేపట్టారు. కొన్నిచోట్లనే పైపులు వేసి మ్యాన్హోల్ బిగించారు. ఇళ్ల ముందు గోతులు తవ్వి వదిలేశారు. మ్యాన్హోల్ను సరిగా బిగించలేదు. హడావుడిగా పనులు ప్రారంభించిన గుత్తేదారు ప్రస్తుతం నిలిపివేయడం గమనార్హం. రాజకీయ జోక్యం వల్లే ఆగిపోయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సినీమ్యాక్స్ థియేటర్ సమీపంలో గోతులను తవ్వి ఒకచోట పైపులు వేయగా, మరోచోట అలాగే వదిలేశారు. ప్రధాన రహదారి కావడంతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది.
విస్తరించకుండానే... రాందాస్ చౌరస్తా నుంచి గోసంద్రం, పిట్లం చెరువుల వరకు ఉన్న రహదారిని 50 అడుగులు విస్తరించాలి. 16,17,20,22,23 వార్డుల పరిధిలో విస్తరణ కోసం ఆయా దుకాణాలు, గృహాలకు మార్కింగ్ వేశారు. రాందాస్ చౌరస్తా వద్ద దుకాణాల మెట్లను, చమాన్లో ఉన్న హోటళ్లను, ఆయా దుకాణాల డబ్బాలను బల్దియా అధికారులు తొలగించారు. చమాన్ నుంచి ఆవారబస్తీ వరకు రహదారి చాలా ఇరుకుగా ఉంటుంది. విస్తరణకు అడ్డుగా ఉన్న కట్టడాలను కూల్చివేయక ముందే మురుగుకాలువ పనులను చేపడుతుండటం గమనార్హం. మురుగుకాలువ పనులు పూర్తయ్యాక విస్తరణ కోసం కట్టడాలను కూల్చివేస్తామని మున్సిపల్ టీపీవో భూపతి తెలిపారు.
కూల్చివేయాలని లేఖ రాశాం
రియాజ్, ర.భ శాఖ ఏఈ
రహదారి విస్తరణ విస్తరణ చేపట్టి, కట్టడాలను కూల్చివేయాలని మున్సిపల్ అధికారులకు లేఖ రాశాం. గుత్తేదారు అర్ధాంతరంగా పనులు నిలిపివేశారు. ఈ విషయమై సంప్రదిస్తే వచ్చి పనులు చేస్తానని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట