సెలయేరులా సాగుతూ..
హల్దీవాగు రైతులకు ఎంతో మేలు చేస్తోంది. మండుటెండల్లోనూ పొలాలు పచ్చగా ఉండేందుకు దోహదం చేస్తోంది. ఈ వాగు నుంచి గోదావరి జలాలను వదులుతుండటంతో సిద్దిపేట, మెదక్ జిల్లాల పరిధిలో 15 వేలకు పైగా ఎకరాలు సాగవుతోంది.
హల్దీవాగుతో 15వేల ఎకరాల్లో రెండు పంటలు
కిష్టాపూర్ వద్ద చెక్డ్యాం పై నుంచి పారుతున్న నీరు
న్యూస్టుడే, తూప్రాన్: హల్దీవాగు రైతులకు ఎంతో మేలు చేస్తోంది. మండుటెండల్లోనూ పొలాలు పచ్చగా ఉండేందుకు దోహదం చేస్తోంది. ఈ వాగు నుంచి గోదావరి జలాలను వదులుతుండటంతో సిద్దిపేట, మెదక్ జిల్లాల పరిధిలో 15 వేలకు పైగా ఎకరాలు సాగవుతోంది. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం తున్కిఖల్సా సమీపంలో తపాస్ఖాన్ చెరువు వద్ద పుడుతున్న హల్దీవాగు చౌదర్పల్లి, గుంటిపల్లి, శాకారం, అంబర్పేట, సీతారాంపల్లి, అనంతగిరిపల్లి, వేలూరు, నాచారం మీదుగా తూప్రాన్ మండలం యావాపూర్, కిష్టాపూర్, గుండ్రెడ్డిపల్లి, వెంకటరత్నాపూర్, నాగులపల్లి, వెలుర్తి మండలం కొప్పులపల్లి, మెల్లుర్ ఉప్పులింగాపూర్, రామాయపల్లి, కుకునూర్, శెట్పల్లికలాన్, చిన్నశంకరంపేట మండలం ధరిపల్లి, మెదక్ మండలం బాలనగర్, కొల్చారం మండలం కొంగోడు గ్రామాల పొలాలకు నీరందిస్తోంది. రైతులు ఈ నీటిపై ఆధారపడి సాగు చేసుకుంటున్నారు. వాగుకు ఇరువైపుల ఉండే పొలాలకు మోటార్లను బిగించి నీటిని మళ్లిస్తున్నారు. దీంతో పాటు వాగు పరివాహక ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరిగి గతంలో వేసిన బోరు బావులు సైతం ఎక్కువగా నీరు పోస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తూప్రాన్ శివారులో పచ్చగా వరి పంట
రెండు పంటల విధానం..
హల్దీవాగు పరివాహక ప్రాంతంలోని రైతులకు ద్విపంటల విధానంతో అధిక లాభం చేకూరుతోంది. మెదక్, సిద్దిపేట జిల్లాలోని సుమారు 50 గ్రామాల రైతులకు హల్దీవాగు ఎంతో లాభాలను చేకూర్చుతోంది. రాష్ట్ర ప్రభుత్వం హల్దీవాగులోకి గోదావరి జలాలను విడుదల చేయడంతో గత రెండేళ్లుగా రైతులు రెండు పంటలను సాగు చేస్తున్నారు. గతంలో వర్షాకాలంలో మాత్రమే వరి పంటలను సాగు చేసే రైతులు ప్రస్తుతం రబీలోనూ పండిస్తున్నారు. ఈ వాగు వెంట సమృద్ధిగా నీరు ఉండడంతో చాలా మంది రైతులు భారీగా రకరకాలైన వరి పంటలను సాగు చేస్తున్నారు. ఇలా నీరు ఎప్పుడూ ఉంటే భవిష్యత్లోనూ ఇలాగే పంటలు సాగు చేస్తామని రైతులు చెబుతున్నారు. రెండేళ్లతో పోల్చితే గత ఏడాది రెండింతల దిగుబడి వచ్చిందని రైతులు పేర్కొన్నారు.
నీరు ఆగితే కష్టమే..
హల్దీవాగు పరివాహక ప్రాంతంలో ఏటా ఎండా కాలంలోనూ నీరు విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ కొన్ని నెలల తర్వాత నీట విడుదల ఆగిపోవడంతో అవస్థలు పడుతున్నారు. మోటార్లు, హల్దీవాగుపై ఆధారపడే రైతులు నీరు లేక అల్లాడే పరిస్థితి ఉంది. గత ఏడాది సైతం ఇదే పరిస్థితి నెలకొనడంతో ఇబ్బందులుపడ్డారు. అధికారులు, నాయకులు ప్రత్యేక చొరవ తీసుకొని నిరంతరం నీరుండేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
నిరంతరం నీరుండాలి - మల్లయ్య, రైతు తూప్రాన్
హల్దీవాగు పక్కనే రెండెకరాల పొలం ఉంది. గతంలో ఒకే పంటను సాగు చేశాను. ప్రస్తుతం వాగులో నీరు ఎక్కువ ఉండడంతో రెండు పంటలను పండిస్తున్నాను. గతంతో పోల్చితే అధిక దిగుబడి వచ్చింది. ఇలానే ఉంటే భవిష్యత్లోనూ హల్దీవాగుతో మంచి జరుగుతుంది. నీటి సరఫరా నిరంతరం ఉండేలా అధికారులు, నాయకులు చర్యలు తీసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?