అమ్మలను స్మరిస్తూ.. తరిస్తూ..
మేడారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.. భక్తిభావంతో పులకించిపోతోంది. జయజయ ధ్వానాలతో మారుమోగుతోంది.. అటు జంపన్నవాగులో స్నానాలు, ఇటు అమ్మల దర్శనానికి బారులు.. తొలిరోజు బుధవారం ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.
మేడారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.. భక్తిభావంతో పులకించిపోతోంది. జయజయ ధ్వానాలతో మారుమోగుతోంది.. అటు జంపన్నవాగులో స్నానాలు, ఇటు అమ్మల దర్శనానికి బారులు.. తొలిరోజు బుధవారం ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. గద్దెలపై కొలువుదీరిన సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్నలు భక్తులకు ఆశీస్సులు అందిస్తున్నారు.
సంక్షిప్తంగా..
- అమ్మవార్ల దర్శనానికి లక్షలాదిగా తరలివస్తున్నారు. రేయింబవళ్లు దర్శనాలు కొనసాగుతున్నాయి.
- ఇండియన్ అగ్రిటెక్ సంస్థ లక్ష నీటి సీసాలు స్వచ్ఛందంగా భక్తులకు అందజేసింది. మేడారంలో మంత్రి దనసరి అనసూయ (సీతక్క) చేతుల మీదుగా పంపిణీ ప్రారంభించారు.
- మేడారంలో పర్యావరణం దెబ్బతినకుండా కాలుష్య నియంత్రణ మండలి వ్యర్థాలు, చెత్త నిర్వహణ, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టింది.
- కేంద్ర జౌళీశాఖ హరిత హోటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గిరిజన కళలు, చేతి వృత్తుల ప్రదర్శనను మంత్రి సీతక్క ప్రారంభించారు.
- పెద్ద సంఖ్యలో చిన్నారులు, పెద్దలు తప్పిపోతున్నారు. వీరిని గుర్తించేందుకు తప్పిపోయిన వ్యక్తుల గుర్తింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మేడారానికి ఆర్టీసీ బస్సుల్లో భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ నెల 18 నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 2,17,315 మంది ప్రయాణం చేశారు. బుధవారం ఒక్కరోజే 2400 బస్సుల్లో 1,08,266 మంది తరలివచ్చారు.
ఇంటిల్లిపాది కలిసి వచ్చినా ఎక్కడ తప్పిపోతారో తెలియని పరిస్థితి. దీంతో స్వీయ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కర్రకు జెండాలు, ఇతరత్రా గుర్తులను ఏర్పాటు చేసుకుని తిరుగుతున్నారు. ఈ సంకేతాల ఆధారంగా తమ వారివద్దకు చేరుకుంటున్నారు.
మేడారం (డోర్నకల్)
అంకెల్లో వివరాలు..
బుధవారం జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించినవారు : 20 లక్షలు
అమ్మవార్లను దర్శనం చేసుకున్న వారు : దాదాపు 25 లక్షలు
తరలివచ్చిన వాహనాలు : దాదాపు 2 లక్షలు.. 40 పార్కింగ్ ప్రాంతాలు పూర్తిగా నిండిపోయాయి.
గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హుండీలు: 100కు పైగా
పారిశుద్ధ్య నిర్వహణ సిబ్బంది : 4 వేలు
జాతరలో జాలీగా తిరిగేద్దాం
అమ్మవార్ల దర్శనం అనంతరం జాతరలో సరదాగా చూడడానికి దర్శనీయ స్థలాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని మీకోసం..
- రెడ్డిగూడెం సమీపంలో గిరిజన మ్యూజియం ఉంది. ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలతో కూడిన చిత్రాలు, వినియోగించిన వస్తువులు చూడొచ్చు. సమ్మక్క జీవిత చరిత్రను బొమ్మల్లో తీర్చిదిద్దారు.
- గిరిజన మ్యూజియం ఆవరణలో ఆంపీ థియేటర్ ఉంది. ఆదివాసీ నృత్యాలు, నాటకాలు ప్రదర్శిస్తారు. అనేక రాష్ట్రాలకు చెందిన గిరిజన కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అబ్బురపరుస్తాయి.
- హరిత హోటల్లో రుచికరమైన వంటలు సిద్ధంగా ఉంటాయి. ఇక్కడ వసతి కోసం 24 గదులు, 25 ఆధునిక టెంట్లున్నాయి. ప్రముఖుల బస కోసం స్విస్ కాటేజీలు, గుజరాత్ దర్బార్ గుడారాలు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
- మేడారం పరిసరాల్లోని సమ్మక్క గుడి గురించి చాలా మందికి తెలియదు. గద్దెలకు కాస్త దూరంలో పూజారుల నివాసాల మధ్య ఈ ఆలయం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.
- సమ్మక్కను చిలకలగుట్టపై నుంచే గద్దెలకు తీసుకొస్తారు. ఈ గుట్ట ప్రకృతి రమణీయంగా ఉంటుంది. సమీపంలో సమ్మక్క జలపాతం ఉంటుంది. గుట్ట చుట్టూ ప్రహరీకి అందమైన బొమ్మలు చూడముచ్చటగా ఉంటాయి.
- అమ్మవార్ల గద్దెలకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లిలో సారలమ్మ ఆలయం కొలువై ఉంది. పచ్చని పొలాల మధ్య ప్రకృతి రమణీయతతో అలరారుతోంది.
ఈనాడు వరంగల్, ఈనాడు డిజిటల్, భూపాలపల్లి, న్యూస్టుడే, హనుమకొండ చౌరస్తా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి