ఆరేళ్లుగా ఆగుతూ.. సాగుతూ..
వర్గల్ మండలం నాచగిరి లక్ష్మీనృసింహస్వామి క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ సహజంగానే వెలసిన కొండలు, ప్రకృతి అందాలు, వాగులు వంకలున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం చొరవ చూపి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు 2018లో నాటి ప్రభుత్వం నాచగిరి హల్దీవాగు సుందరీకరణ పనులకు రూ.7.48 కోట్ల నిధులు విడుదల చేశారు.
హల్దీ సుందరీకరణపై నిర్లక్ష్యం
సుందరీకరించాల్సిన మూల వాగు ప్రాంతం
న్యూస్టుడే, వర్గల్: వర్గల్ మండలం నాచగిరి లక్ష్మీనృసింహస్వామి క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ సహజంగానే వెలసిన కొండలు, ప్రకృతి అందాలు, వాగులు వంకలున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం చొరవ చూపి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు 2018లో నాటి ప్రభుత్వం నాచగిరి హల్దీవాగు సుందరీకరణ పనులకు రూ.7.48 కోట్ల నిధులు విడుదల చేశారు. ఏడాదిలోనే పనులు పూర్తి చేసి భక్తులకు సరైన వసతులు కల్పించాలనుకున్నారు.కానీ ఆరేళ్లుగా పనులు ఆగుతూ.. సాగుతుండటం గమనార్హం.
ప్రణాళిక ఇదీ.. హల్దీ మూలవాగు నుంచి 600 మీటర్ల దూరం వరకు కరకట్టలు, స్నాన ఘట్టాలు, నీటి నిల్వకు చెక్డ్యాంల నిర్మాణం, మురుగు నీరు చెక్ డ్యాంలోకి చేరకుండా మూలవాగు ఆవలకు మళ్లించేలా కాలువ నిర్మాణం చేపట్టాలి. ఈ పరివాహక ప్రాంతం మొత్తం ఆకర్షణీయంగా ఉండేలా పూల మొక్కలు, పార్కును తలపించేలా అందంగా తీర్చిదిద్దాలి.
జరుగుతోందిలా.. ఇప్పటి వరకు స్నాన ఘట్టాల పనులు నడుస్తున్నాయి. మురుగు కాలువ నిర్మాణం కొనసాగుతోంది. ఏడాది క్రితం కొంత నిర్మాణం చేపట్టి మధ్యలోనే వదిలేశారు. చెక్డ్యాం వరకు వాగులోని రాళ్లను తొలగించి నీరు నిల్వ ఉండేలా ఏర్పాటు చేయాలి. కానీ అధికారుల పర్యవేక్షణ లోపంతో గుత్తేదారు తనకు నచ్చినట్లుగా పనులు చేసుకుంటూ ఆపేస్తూ వెళ్తున్నా అడిగేవారు లేరు.
మరో నెలలో బ్రహ్మోత్సవాలు.. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో పనులు ప్రారంభిస్తారు. సంగారెడ్డి కాలువ గుండా హల్దీలోకి జలాలను విడుదల చేయగానే నీరు వచ్చిందని పనులు నిలిపేస్తారు. ఇదే తంతు ఆరేళ్లుగా కొనసాగుతోంది. మరో నెల రోజుల్లో నాచగిరి క్షేత్రం వద్ద బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రెండ్రోజుల్లో హల్దీ జలాలు ఇక్కడికి చేరుకోనున్నాయి. ఈ సారైనా పనులను ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేసి ఆలయానికి వచ్చే భక్తులకు వసతులు కల్పించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది.
చివరి దశకు చేరుకున్నాయి..
సుందరీకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లోపు పనులు పూర్తి చేయాలని గుత్తేదారుకు సూచించాం. సీసీ రోడ్డు, మురుగు కాలువ, ఆలయం ముందు గోడ నిర్మాణ పనులు మాత్రమే మిగిలాయి. త్వరలోనే పూర్తి చేయించి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తాం.
పవన్కుమార్, గజ్వేల్ డివిజన్ నీటిపారుదల డీఈఈ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!