ప్రయాణానికి ప్రయాస
ఏ బస్సు చూసినా జనం కిక్కిరిసి కనిపిస్తున్నారు. సీటు మాట దేవుడెరుగు నిల్చోనైనా వెళ్లాలని ప్రయాణికులు భావిస్తున్నారు. మేడారం జాతరకు జిల్లాకు చెందిన బస్సుల తరలింపుతో ఇక్కడ కొరత ఏర్పడింది. ప్రధాన రూట్లలోనూ ప్రయాణికులకు ఇబ్బందులకు ఎదురవుతున్నాయి.
పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద ప్రయాణికుల నిరీక్షణ
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్: ఏ బస్సు చూసినా జనం కిక్కిరిసి కనిపిస్తున్నారు. సీటు మాట దేవుడెరుగు నిల్చోనైనా వెళ్లాలని ప్రయాణికులు భావిస్తున్నారు. మేడారం జాతరకు జిల్లాకు చెందిన బస్సుల తరలింపుతో ఇక్కడ కొరత ఏర్పడింది. ప్రధాన రూట్లలోనూ ప్రయాణికులకు ఇబ్బందులకు ఎదురవుతున్నాయి.
జిల్లాలో తిరుగుతున్నవి సగమే..: జిల్లాలో మూడు ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. వాటి పరిధిలో 246 బస్సులు ఉండగా.. ఇందులో 124 బస్సుల్ని మేడారం జాతర కోసం కరీంనగర్, వరంగల్ డిపోలకు తరలించారు. రీజియన్ పరిధిలో 8 ఆర్టీసీ డిపోలు ఉండగా సంగారెడ్డి డిపో నుంచే అత్యధికంగా 51 బస్సుల్ని పంపారు. మహాలక్ష్మి పథకం అమలులోకి రావడంతో బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఇప్పటికే అరకొర బస్సులతో నిత్యం అవస్థలు తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో బస్సులు మేడారానికి కేటాయించడంతో సమస్య మరింత పెరిగింది.
విద్యార్థుల కోసం..: గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువగా విద్యా సంస్థల సమయానికి అనుగుణంగానే బస్సుల్ని నడుపుతున్నారు. ఉదయం, సాయంత్రం ఒక్కో ట్రిప్పు మాత్రమే ఉండటంతో అవి విద్యార్థులతోనే నిండిపోతున్నాయి. విద్యా సంస్థలకు సెలవులు ఉంటే ఆయా రూట్లలో సర్వీసులు రద్దు చేస్తున్నారు. జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్లో కలిపి పల్లె వెలుగు బస్సులు 115 ఉన్నా వీటిలో ఎక్కువ శాతం పట్టణాలకే తిప్పుతున్నారు.
ఎండలో నిరీక్షణ
సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి, మల్కాపూర్ చౌరస్తా తదితర చోట్ల ప్రయాణ ప్రాంగణాలు లేకపోవడంతో ఎండలోనే నిరీక్షించాల్సి వస్తోంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇక్కడ బస్సు వచ్చే వరకు నిరీక్షించడం ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. సదాశివపేట మండలం పెద్దాపూర్ వద్ద కూడా ఇదే పరిస్థితి. ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలోనైనా ప్రయాణికులకు నీడ వసతి కల్పించాల్సిన అవసరముంది. సౌకర్యాల కల్పన కోసం సెస్ పేరుతో ప్రయాణఛార్జిపై అదనంగా రూపాయి చొప్పున వసూలు చేస్తున్న ఆర్టీసీ అధికారులకు తమ సమస్యలు పట్టడంలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం: ప్రభులత, ఆర్టీసీ ఆర్ఎం
మేడారానికి బస్సుల తరలింపుతో కొన్ని రూట్లలో సర్వీసులు తగ్గించాం. ప్రధాన రూట్లలో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ఆర్టీసీ సిబ్బందికి ప్రయాణికులు సహకరించాలి. రద్దీ ఉన్న రూట్లలో బస్సుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులకు సంబంధించిన సర్వీసులకు సమస్య ఉండదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి