విపణి వీధిలో.. సృజనాత్మక బాటలో..
తరగతి గదులు.. పుస్తకాలు ఇవే వారి లోకం. పాఠాలు వినడం.. అధ్యాపకుల సూచనలు పాటించడం తప్ప బయటి ప్రపంచంతో పరిచయం అంతంతే. ఇలా విద్యార్థినులకు మార్కెటింగ్పై అవగాహన కల్పించేందుకు సంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో విపణి పేరిట వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.
వినియోగదారుల నాడి పట్టి
ఫ్యాన్సీ స్టాల్ వద్ద రమ్య
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్: తరగతి గదులు.. పుస్తకాలు ఇవే వారి లోకం. పాఠాలు వినడం.. అధ్యాపకుల సూచనలు పాటించడం తప్ప బయటి ప్రపంచంతో పరిచయం అంతంతే. ఇలా విద్యార్థినులకు మార్కెటింగ్పై అవగాహన కల్పించేందుకు సంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో విపణి పేరిట వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థినులు తమ సృజనాత్మకతను చాటేలా హస్తకళలతో ఔరా అనిపించారు. కామర్స్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విద్యార్థినుల ఉజ్వల భవితకు బాటలు వేయడం ఖాయం.
బీకాం తృతీయ సంవత్సరం విద్యార్థిని రమ్య వినియోగదారుల నాడిని గుర్తించారు. అందుకు తగ్గట్టుగా ఫ్యాన్సీ స్టాల్ను ఏర్పాటుచేశారు. కొత్త వస్తువులు అందుబాటులో ఉంచడంతో అందరూ వాటిని కొనేందుకు ఉత్సుకత చూపారు. వివిధ చోట్ల నుంచి వాటిని తెచ్చి ఉంచారు. మార్కెట్ రేట్ కంటే తక్కువకే విక్రయాలు సాగించారు.
వ్యర్థానికి రూపమిచ్చి..
చిత్తు కాగితాలు, పాడైన ఫర్నిచర్.. పనికి రానివి అనుకుంటే వ్యర్థాల జాబితాలో చేరిపోతాయి. వాటికి అందమైన రూపం ఇస్తే ఆకట్టుకుంటాయి. బీఏ ప్రథమ సంవత్సరం విద్యార్థినులు అఫీర మహీన్, షాహిస్తా అప్రా అదే చేశారు. తమ ఇంట్లో వృథా వస్తువులు సేకరించి వాటిని అలంకరణ సామగ్రిగా తీర్చిదిద్ది ప్రదర్శించారు. రూ.50 నుంచి రూ.200 వరకు అమ్మారు. ఖాళీ సమయాల్లో యూట్యూబ్లో చూసి వ్యర్థాలకు కొత్త రూపమివ్వడం నేర్చుకున్నామని వారు చెప్పారు.
అఫీర మహీన్, షాహిస్తా అప్రా
రూ.800కు రూ.1800
ఇక్కడ ఏది కొన్నా రూ.10 మాత్రమే. విపణిలో ఇలాంటివి చూస్తుంటాం. ఇలాంటి ప్రకటనలు చూసి కొనుగోలుదారులు ఆసక్తి చూపుతారు. బీఏ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు భవానీ, ప్రియాంకలు ఇదే సూత్రాన్ని పాటించారు. రవ్వ లడ్డు, నిమ్మకాయ పులిహోర, గులాబ్ జామ్ను తాము తీసుకున్న స్టాల్లో అమ్మకాలు సాగించారు. ఏది కొన్నా రూ.పదే అని బోర్డు తగిలించడంతో గిరాకీ పెరిగింది. రూ.800 పెట్టుబడి పెట్టి రూ.1,800 ఆదాయం సంపాదించారు.
విక్రయిస్తున్న భవానీ, ప్రియాంక
ఆకట్టుకునేలా తీర్చిదిద్ది
కళాశాలకు చెందిన సల్మాసాదియా బీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. మరోవైపు తనకిష్టమైన మెహిందీలో రాణిస్తున్నారు. విపణిలో భాగంగా మెహిందీ డిజైనింగ్ స్టాల్ ఏర్పాటుచేశారు. విద్యార్థినులతో పాటు అధ్యాపకులూ స్టాల్ వద్ద బారులు తీరారు. ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో మెహిందీ డిజైనింగ్లో మెలకువలను నేర్చుకోవడం ఇలా పనికొచ్చిందని సల్మాసాదియా తెలిపారు.
మెహిందీ వేస్తున్న సల్మా సాధియా
తేనీటి విక్రయం.. ఆదాయం
నవనీత, అనూరాధ, మధులతలు కళాశాల ఆవరణలోని వసతిగృహంలో ఉంటూ బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. విపణిలో వీరు టీ స్టాల్ను ఎంచుకున్నారు. అల్లం ఛాయ్ రూ.10, గ్రీన్ టీ రూ.15గా ధర నిర్ణయించి విక్రయించారు. పెట్టిన పెట్టుబడికి రెండితల ఆదాయాన్ని సంపాదించారు. సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి తేనీరు రుచి చూసి బాగుందని కితాబునిచ్చారు.
విద్యార్థినులు నవనీత, అనూరాధ, మధులత
పండగలకు వేదికగా..
దేశం భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయం. పండగలు వీటన్నింటినీ సజీవంగా ఉంచుతున్నాయి. మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణం ఈ పండగలన్నింటికీ వేదికైంది. సంక్రాంతి, దీపావళి, ఉగాది, వినాయక చవితి తదితర హిందూ పండగలతో పాటు క్రైస్తవ, మైనార్టీల పండగల ప్రత్యేకతలు కళ్లకు కట్టేలా ప్రదర్శన ఏర్పాటుచేశారు. ఆయా పండగల సమయంలో ప్రత్యేక వంటకాలను అందుబాటులో ఉంచగా.. సందర్శకులు కొనుగోలుకు పోటీ పడ్డారు.
వంటలు వండుతూ..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?