logo

53 ఏళ్ల ప్రాయం.. 21 కి.మీ. పరుగు

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి అందరు పాటుపడాలంటూ హుస్నాబాద్‌కు చెందిన 53 ఏళ్ల ఫిజికల్‌ డైరెక్టర్‌ బూట్ల రాజమల్లయ్య గురువారం తన జన్మదినం సందర్భంగా 21 కి.మీ.(హాఫ్‌ మారథాన్‌) పరుగెత్తారు.

Updated : 23 Feb 2024 06:38 IST

బూట్ల రాజమల్లయ్య

హుస్నాబాద్‌, న్యూస్‌టుడే: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి అందరు పాటుపడాలంటూ హుస్నాబాద్‌కు చెందిన 53 ఏళ్ల ఫిజికల్‌ డైరెక్టర్‌ బూట్ల రాజమల్లయ్య గురువారం తన జన్మదినం సందర్భంగా 21 కి.మీ.(హాఫ్‌ మారథాన్‌) పరుగెత్తారు. ఈ మేరకు ఆయన్ను పలువురు అభినందించారు. మూడేళ్లుగా హాఫ్‌ మారథాన్‌ చేపడుతున్నారు. ఆయన్ను పురాధ్యక్షురాలు ఆకుల రజిత, రన్నర్స్‌, బ్యాడ్మింటన్‌ అసోసియేషన్ల అధ్యక్షులు వెంకట్‌, కేడం లింగమూర్తి, స్ఫూర్తి సంస్థ అధ్యక్షుడు శంకర్‌, కౌన్సిలర్‌ శ్రీనివాస్‌ తదితరులు సత్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని