మెదక్ రైల్వేస్టేషన్కు అమృత్ కాలం
కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్ల స్థితిగతులను మార్చి ఆధునికీకరణకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకం అమృత్ భారత్ స్టేషన్. ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా సౌకర్యాల కల్పనకు నిధులు మంజూరు చేయనుంది.
కేంద్ర పథకానికి ఎంపిక
26న వర్చువల్ పద్ధతిలో ప్రధాని శంకుస్థాపన
న్యూస్టుడే, మెదక్: కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్ల స్థితిగతులను మార్చి ఆధునికీకరణకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకం అమృత్ భారత్ స్టేషన్. ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా సౌకర్యాల కల్పనకు నిధులు మంజూరు చేయనుంది. ఇప్పటికే ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో జహీరాబాద్, తాండూరు, వికారాబాద్ రైల్వేస్టేషన్లు ఎంపికైన విషయం విదితమే. ఆయా చోట్ల స్లేషన్లలో ప్రగతి పనులు చేపట్టారు. ఎస్కలేటర్లు, అదనంగా లైన్, పార్కింగ్ తదితర వసతులు కల్పించేందుకు పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మరో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 40 స్టేషన్లను ఎంపిక చేయగా, ఈ జాబితాలో మెదక్కు చోటు దక్కడం విశేషం.
రూ.210 కోట్లతో.. మెదక్ జిల్లాలో మాసాయిపేట, వడియారం (చేగుంట), మనోహరాబాద్, అక్కన్నపేట, రామాయంపేటల్లో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఆయా మార్గాల్లో పలు రైళ్లు నడుస్తున్నాయి. 2012-13లో అప్పటి కేంద్ర ప్రభుత్వం రామాయంపేట మండలం అక్కన్నపేట నుంచి మెదక్ పట్టణం వరకు 17.2 కి.మీ. మేర రైల్వేలైన్ నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. 2014 జనవరిలో శంకుస్థాపన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయగా.. రూ.210 కోట్లతో పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. 2022 సెప్టెంబరు 23న కేంద్ర మంత్రి కిషన్రెడ్డి జాతికి అంకితం చేశారు. ప్రస్తుతం ఉదయం, సాయంత్రం వేళల్లో కాచిగూడ వరకు ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నాయి.
ఏడాదిన్నరకే.. రైల్వేస్టేషన్ అందుబాటులోకి వచ్చి ఏడాదిన్నర కావస్తుండగా, అమృత్ భారత్ స్టేషన్ పథకానికి ఎంపికవడం గమనార్హం. రూ.15.29 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. సోమవారం (ఈనెల 26న) ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేయనున్నారని రైల్వే వర్గాలు తెలిపాయి. కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కలెక్టర్, అదనపు కలెక్టర్లకు ఆహ్వానాలను సంబంధిత అధికారులు అందించారు. ఏర్పాట్లను పరిశీలించేందుకు శుక్రవారం రైల్వేశాఖ అధికారులు ఇక్కడికి రానున్నారని సమాచారం.
చేపట్టనున్న పనులు
- పార్కింగ్ షెడ్డు ఏర్పాటు
- సెల్ఫీపాయింట్
- ముఖ్యమైన సమాచార బోర్డుల ఏర్పాటు
- ప్రవేశ మార్గాల ఆధునికీకరణ
- లిఫ్ట్ సౌకర్యం
- ప్లాట్ఫాం ఉపరితలాన్ని తీర్చిదిద్దడం
- దివ్యాంగులకు ప్రత్యేక శౌచాలయాలు, ర్యాంపులు, టెక్టైల్ ఫ్లోరింగ్
- జనరేటర్ సౌకర్యం
- ల్యాండ్ స్కేపింగ్
- విద్యుత్తు దీపాల బిగింపు
- సంకేతాల ఏర్పాటు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు