logo

తూప్రాన్‌లో దొంగల బీభత్సం

తూప్రాన్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. గురువారం తెల్లవారుజామున 5, ఉదయం ఒక ఇంటి తాళాలు పగులగొట్టి బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని ఒకటో వార్డుకు చెందిన నాగరాజు, రాజు, అన్నీస్‌బేగం ఇళ్ల తాళాలు పగులగొట్టినా ఎలాంటి వస్తువులు పోలేవు.

Updated : 23 Feb 2024 06:34 IST

నగదు, బంగారం అపహరణ

చోరీ తీరును పరిశీలిస్తున్నసీఐ కృష్ణ, ఎస్సై శివానందం

తూప్రాన్‌, న్యూస్‌టుడే: తూప్రాన్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. గురువారం తెల్లవారుజామున 5, ఉదయం ఒక ఇంటి తాళాలు పగులగొట్టి బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని ఒకటో వార్డుకు చెందిన నాగరాజు, రాజు, అన్నీస్‌బేగం ఇళ్ల తాళాలు పగులగొట్టినా ఎలాంటి వస్తువులు పోలేవు. సమ్యా సుల్తానా ఇంట్లో 3 తులాల బంగారం, రూ.20 వేల నగదు, అహ్మద్‌ బీ ఇంట్లో రూ.50 వేల నగదు, అర తులం బంగారం అపహరించారు. ఐదో వార్డులో నివాసముంటున్న తిరుమల రాజు, ఉమారాణి దంపతులు ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నారు. ఉమారాణి ఓ ప్రైవేట్‌ స్కూల్లో పనిచేస్తున్నారు. ఇంటికి తాళం వేసి వెళ్లగా ఉదయం 11 గంటల సమయంలో గుర్తుతెలియని దుండగుడు తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న పది తులాల బంగారం చోరీ చేశారు. వెండి వస్తువులు తీసుకెళ్లలేదు. ఉమారాణి సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ కృష్ణ, ఎస్సై శివానందం సంఘటనా స్థలాలకు చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఒకేరోజు ఆరు ఇళ్లలో దొంగలు చొరబడటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మూడు నెలల వ్యవధిలో సుమారు 15 ఇళ్లల్లో చోరీలు జరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని