రహదారుల చెంత మృత్యుకుహరాల చింత
రహదారుల పక్కన బావులు, చెరువులు ప్రమాదకరంగా మారాయి. ఏళ్లుగా ఉన్న వాటిని పూడ్చకపోవడం.. చుట్టూ రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో తరచుగా ప్రమాదాలు చోటుచేసుంటున్నాయి. దీంతో జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ఆయా మండలాల్లో నెలకొన్న పరిస్థితిపై ‘న్యూస్టుడే’ పరిశీలన కథనం.
పాపన్నపేట మండలం నర్సింగరావు తండా వద్ద బావి
న్యూస్టుడే-మెదక్, మెదక్ రూరల్, రామాయంపేట, చేగుంట, పాపన్నపేట, వెల్దుర్తి, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, నర్సాపూర్ రూరల్, రేగోడ్, తూప్రాన్, హవేలిఘనపూర్
రహదారుల పక్కన బావులు, చెరువులు ప్రమాదకరంగా మారాయి. ఏళ్లుగా ఉన్న వాటిని పూడ్చకపోవడం.. చుట్టూ రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో తరచుగా ప్రమాదాలు చోటుచేసుంటున్నాయి. దీంతో జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ఆయా మండలాల్లో నెలకొన్న పరిస్థితిపై ‘న్యూస్టుడే’ పరిశీలన కథనం.
అజాగ్రత్తగా నడిపితే..
నార్సింగి మీదుగా వెళ్తున్న 44వ జాతీయ రహదారి పక్కనే క్యాసంపల్లి చెరువు ఉంది. ముందే జాతీయ రహదారి.. వాహనాలు వేగంగా వెళ్తుంటాయి. నాగ్పూర్, నిజామాబాద్ వైపు నుంచి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా నడిపినా నీటి వనరులో పడిపోవాల్సిందే. గతంలో ఎరువుల లారీ పడిపోయింది. రెయిలింగ్ ఉన్నా వాహనాలు వేగంగా వెళ్లి ఢీకొని చెరువులో పడిపోయే ప్రమాదం ఉంది.
వంపులు తిరిగి.. రామాయంపేట నుంచి సిద్దిపేట వెళ్లే మార్గంలో మల్లెల చెరువు చెంత ప్రమాదం పొంచి ఉంది. దీనిపై నుంచి వెళ్లే రోడ్డు వంపులు తిరిగి ఉంది. ఈ కారణంగా భయం గుప్పెట్లో వెళ్లాల్సి వస్తుంది. గతేడాది ఓ ఆటో ప్రయాణికులతో వెళ్తుండగా నేరుగా చెరువులోకి దూసుకెళ్లింది. స్థానికులు స్పందించడంతో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. మరో ఘటనలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదవశాత్తు చెరువులో పడి ప్రాణాలో కోల్పోయాడు.
రెండేళ్లలో ఐదుగురు..
తూప్రాన్ నుంచి కిష్టాపూర్ మార్గానికి ఆనుకొని బావి ఉంది. గుండ్రెడ్డిపల్లి వెళ్లే దారిలో లోయ మాదిరిగా ఉండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రెండేళ్ల వ్యవధిలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. అల్లాదుర్గం మండలం అకోలా-నాందేడ్ జాతీయరహదారి నుంచి రాంపూర్ వెళ్లే చెరువు కట్ట మీద ఉన్న రోడ్డుపై కంకర తేలి గుంతలు పడి ప్రమాదకరంగా ఉన్నాయి. ద్విచక్ర వాహనదారులు పలుమార్లు ప్రమాదాల బారిన పడ్డారు.
- మెదక్ మండలం పాతూర్ నుంచి రాయిన్పల్లి మార్గంలో దారి పక్కనే పాడుబడ్డ బావి ఉంది. అధికారులు స్పందించి పూడ్చి వేయించాలని చోదకులు కోరుతున్నారు. మెదక్ నుంచి రామాయంపేటకు పోయే మార్గంలో అవుసులపల్లి శివారులో రోడ్డు పక్కన బావిని పూడ్చాల్సిన అవసరం ఉంది. అధికారులు స్పందించాలి.
ప్రమాదం పొంచి ఉంది..
- పాపన్నపేట మండలం నర్సింగరావు తండా వద్ద ఓ పాడుబడ్డ బావి ఉంది. ఇక్కడ వాహనాలు అదుపు తప్పితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
- మాసాయిపేట మండలంలోని బొమ్మారం, నాగ్సాన్పల్లి గ్రామాల మధ్యన ఎర్ర కుంట, మరో చిన్న కుంటల కట్టల మీదుగా రహదారి గుంతలమయంగా ఉంది.
- హవేలిఘనపూర్ మండలం నాగ్పూర్కు వెళ్లే మార్గంలో సుల్తాన్పూర్ సమీపంలో చెరువు కట్ట మీదుగా భయభయంగా ప్రయాణం సాగించాల్సిందే.
- నర్సాపూర్ మండలం నాగులపల్లిలోని చెరువు కట్ట సరిగ్గా లేదు. ఇక్కడ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అందులో పడిపోవడం ఖాయం.
- పెద్దశంకరంపేట మండలంలోని టెంకటి గ్రామానికి వెళ్లే వంతెనకు ఇరువైపులా రెయిలింగ్ లేదు. వర్షాకాలంలో వాగు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు వంతెనపై నుంచి వెళ్లడానికి ఆచితూచి ప్రయాణించాల్సి ఉంటుంది.
- రేగోడ్, చౌదర్పల్లి శివారులో రోడ్డు పక్కనే బావులు, గుంతలు ఉండటంతో ప్రయాణికులు భయాందోళనల మధ్య రాకపోకలు సాగిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి