సరకులెక్కడ పెట్టాలి
అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు కరవయ్యాయి. చిన్న అద్దె గదుల్లో నిర్వహించడంతో చిన్నారులు, బాలింతలు, గర్భిణులు, టీచర్లు, ఆయాలు నానా అవస్థలు పడుతున్నారు.
అద్దె గదుల్లో అవస్థలు
నర్సాపూర్లో భవన నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలం
నర్సాపూర్, న్యూస్టుడే: అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు కరవయ్యాయి. చిన్న అద్దె గదుల్లో నిర్వహించడంతో చిన్నారులు, బాలింతలు, గర్భిణులు, టీచర్లు, ఆయాలు నానా అవస్థలు పడుతున్నారు.
నర్సాపూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 15 వార్డులున్నాయి. 4, 5 వార్డులో నిర్వహించాల్సిన ఒక అంగన్వాడీ కేంద్రాన్ని పురపాలిక ఎదురుగా ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో సొంత భవనంలో నిర్వహిస్తున్నారు. ఇరుకైన గదిలో ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు. పురపాలిక పరిధిలోకి వచ్చే తుకారాంతండాలో మినీ కేంద్రం నిర్వహిస్తున్నారు. ప్రతి కేంద్రంలో 25-30 మంది చిన్నారులున్నారు. 15-20 మంది గర్భిణులు, 30 మంది వరకు బాలింతలు ఉన్నారు. వీరంతా పౌష్టికాహారం తీసుకోవడానికి కేంద్రానికి వస్తే సరిపడా స్థలం లేక అవస్థలు పడుతున్నారు.
అద్దె తక్కువగా ఉండటంతో.. అద్దె చాలా తక్కువగా ఉండటంతో ఆ మొత్తానికి విశాలమైన గదులు లభించడం లేదు. దీంతో శిథిలావస్థకు చేరిన పెంకుటిళ్లు, రేకుల ఇళ్లు, ఇరుకు గదుల్లోనే కొనసాగిస్తున్నారు. సొంత భవనాలు లేక ప్రభుత్వ పాఠశాలలో నెట్టుకు వస్తున్నారు.
అక్రమాలకు అవకాశం.. ప్రభుత్వం పంపిణీ చేసే సరకులు, సామగ్రి, నిల్వ చేసుకునేందుకు స్థలం చాలక టీచర్లు వారి ఇళ్లలో భద్రపరుస్తున్నారు. దీంతో అక్రమాలకు అవకాశం ఏర్పడుతుంది. పురాతన భవనాల్లో సరకులు ఉంచితే ఎలుకలు, పందికొక్కుల కారణంగా పాడవుతున్నాయి.
వెనక్కి మళ్లిన నిధులు.. అద్దె ఇళ్లల్లో నిర్వహిస్తున్న వాటికి నీటి సదుపాయం, ప్రహరీ, శౌచాలయాల వంటి వసతులు లేవు. పదేళ్ల క్రితం భవనాల నిర్మాణానికి శిలాఫలకాలు సైతం వేశారు. కాని నేటికీ అతీగతీ లేదు. అప్పట్లో ఒక్కోదానికి రూ.6.5 లక్షలు చొప్పున కేటాయించినా ఒక్కటీ ప్రారంభం కాలేదు. దీంతో నిధులు వెనక్కి పోయాయి.
రెండింటికి స్థలాల ప్రతిపాదన
సరళాకుమారి, పర్యవేక్షకురాలు నర్సాపూర్
పట్టణంలోని రెండు కేంద్రాలకు పురపాలిక ఆవరణలో, సునీతారెడ్డి కాలనీలో స్థలాలను గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదించాం. ఏళ్లు గడుస్తున్నా వాటికి ఆమోదం రాలేదు. పట్టణం కావడంతో ప్రభుత్వ స్థలాలు సైతం అందుబాటులో ఉండటం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు