ఎస్ఎంసీ ఎన్నికలు వాయిదాతో సరి
పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికల వాయిదాతో సర్కారు బడుల ప్రగతి, పర్యవేక్షణపై ప్రభావం చూపుతోంది. పీఎంశ్రీ (ప్రధాన్ మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకం కింద పలు పాఠశాలలకు నిధులు విడుదలైనా వెచ్చించలేని పరిస్థితి నెలకొంది.
పాఠశాలల ప్రగతిపై ప్రభావం
న్యూస్టుడే, సిద్దిపేట: పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికల వాయిదాతో సర్కారు బడుల ప్రగతి, పర్యవేక్షణపై ప్రభావం చూపుతోంది. పీఎంశ్రీ (ప్రధాన్ మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకం కింద పలు పాఠశాలలకు నిధులు విడుదలైనా వెచ్చించలేని పరిస్థితి నెలకొంది. రెండేళ్ల విరామం తరువాత గత నెలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినా వాయిదా వేయడంతో మొదటికి వచ్చింది. ఎప్పుడు నిర్వహిస్తారనే ప్రశ్న తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. తుదిగా 2019 డిసెంబరులో ఎన్నికలు జరిగాయి. రెండేళ్లకు కమిటీల గడువు ముగిసినా.. పొడిగిస్తూ వచ్చారు. అంతిమంగా కమిటీల ఎన్నికలకు షెడ్యూల్, మార్గదర్శకాలు గత నెలలో జారీ చేశారు. సభ్యులు, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికను జిల్లాలోని 1018 పాఠశాలల్లో చేపట్టేందుకు సిద్ధమైనా ఫలితం లేకపోయింది.
ప్రకటించి.. వెనకడుగు వేసి.. జిల్లాలో వివిధ ప్రభుత్వ యాజమాన్యాలు - 980, గురుకులాలు - 36, ఎయిడెడ్ - 2 పాఠశాలలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో గత జనవరి 20న పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. అదే నెల 29న ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కమిటీ తొలి సమావేశం కూడా అదే రోజు చేపట్టాలని నిర్ణయించారు. సమగ్ర శిక్షా, విద్యాశాఖ అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు. మరోవైపు గత నెల 23న ప్రభుత్వం అనూహ్యంగా పాత కమిటీలను రద్దు చేయడంతో పాటు ఎన్నికలు వాయిదా వేసింది. జిల్లాలో పీఎం శ్రీ పథకం కింద మొదటి విడతగా 27 పాఠశాలలను ఎంపిక చేశారు. వివిధ విభాగాల కింద నిధులు విడుదలయ్యాయి. 16 పాఠశాలలకు సైన్స్ ల్యాబ్లను మంజూరు చేశారు.
ఖర్చులు.. రూపకల్పన ఎలా.. ఎస్ఎంసీలు.. అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తాయి. ఖాతాలో నిధులు ఖర్చు చేయాలంటే ప్రధానోపాధ్యాయుడితో పాటు ఎస్ఎంసీ ఛైర్మన్ సంతకం తప్పనిసరి. మన ఊరు- మన బడి, మధ్యాహ్న భోజనం, విద్యార్థుల హాజరు, ఏకరూప దుస్తులు, పుస్తకాల పంపిణీ, శౌచాలయాలు, తాగునీరు, మైదానాలు, క్రీడా సామగ్రిని పర్యవేక్షించాల్సి ఉంటుంది. అదనపు నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేయాలి. ఇకపై రూపకల్పన ఎలా అనే సందేహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని.. బడుల ప్రగతిపై ప్రభావం పడకుండా జాగ్రత్త వహిస్తామని డీఈవో శ్రీనివాస్రెడ్డి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్