చేనుకు జలం.. కర్షకులకు ఫలం
భూమి దుక్కులు దున్నే సమయం నుంచే అన్నదాతకు కష్టాలు మొదలవుతాయి. విత్తు నాటినప్పటి నుంచి వరుణుడి కటాక్షం కోసం ఆకాశంవైపు చూడాల్సిన పరిస్థితి. వర్షపు చుక్క నేలపై పడితేనే విత్తనాలు మొలకెత్తేది. వర్షాభావ పరిస్థితులు తలెత్తుతే ఆరుగాలం శ్రమకు ప్రతిఫలం ఉండదు.
ఎస్సీ, ఎస్టీలకు బోరు బావుల పథకానికి కొనసాగుతున్న సర్వే
క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తున్న అధికారులు
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్, కంది(ఇంద్రకరణ్): భూమి దుక్కులు దున్నే సమయం నుంచే అన్నదాతకు కష్టాలు మొదలవుతాయి. విత్తు నాటినప్పటి నుంచి వరుణుడి కటాక్షం కోసం ఆకాశంవైపు చూడాల్సిన పరిస్థితి. వర్షపు చుక్క నేలపై పడితేనే విత్తనాలు మొలకెత్తేది. వర్షాభావ పరిస్థితులు తలెత్తుతే ఆరుగాలం శ్రమకు ప్రతిఫలం ఉండదు. కష్టాలు.. నష్టాలు ఎదురైనా వ్యవసాయాన్ని కొనసాగిస్తున్న వారే ఎక్కువ. వీరి ఇబ్బందులను కొంతైనా దూరం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఎస్సీ, ఎస్టీలకు చెందిన పొల్లాలో బోరుబావుల తవ్వకాన్ని చేపట్టనున్నారు.
అర్హులను గుర్తించేందుకు..: జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఎస్సీ, ఎస్టీల నుంచి బోరుబావుల తవ్వకం పథకానికి ఇప్పటికే మండల స్థాయిలో దరఖాస్తులు స్వీకరించారు. 811 దరఖాస్తులు అందగా ఇందులో అత్యధికంగా ఎస్సీలకు సంబంధించినవి 736 ఉన్నాయి. ఎస్టీ రైతులు 75 మంది మాత్రమే అర్జీలు కలెక్టరేట్లోని భూగర్భ జలశాఖ కార్యాలయంలో అందజేశారు. దరఖాస్తుల ఆధారంగా అధికారులు సర్వే ప్రక్రియ చేపట్టారు. అర్జీదారుల భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఒకే చోట ఎక్కువ మంది లబ్ధిదారులు ఉంటే అక్కడ ఎన్ని బోర్లు వేయాల్సి ఉంటుంది. నీటి వనరులు ఎక్కడ ఉన్నాయని పరిశీలించి పాయింట్ను గుర్తించనున్నారు. మొదటగా మంత్రి దామోదర్ రాజనర్సింహ సొంత నియోజకవర్గం అందోలు నుంచే సర్వేను ప్రారంభించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక బోరుబావుల తవ్వకానికి కలెక్టర్ నుంచి పరిపాలన అనుమతులు తీసుకోనున్నారు. ఆ తర్వాత నిధుల మంజూరు కోసం రాష్ట్ర కార్యాలయానికి ప్రతినిపాదనలు పంపుతారు.
ఉప ప్రణాళిక నిధుల కేటాయింపు: అయిదు ఎకరాలకు ఒకటి చొప్పున బోరు వేయనున్నారు. ఇద్దరు ముగ్గురు రైతులకు కొద్దిపాటి భూమి ఉన్నా అందరికీ కలిపి 5 ఎకరాలు ఉంటే వారందరు సమ్మతించిన చోట బోరు వేస్తారు. నీటి వసతి సమకూర్చడం ద్వారా రైతులు కూరగాయలు, పండ్ల తోటలు వేసుకునేలా ప్రోత్సహించనున్నారు. ఉద్యాన శాఖ, ఉపాధి హామీ పథకాలు, ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా పంట సాగుకు రాయితీ రుణాలు అందించి ప్రోత్సహిస్తారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల్ని వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.
నిధులు రాగానే పనులు ప్రారంభిస్తాం: వెంకటేశ్వర్రావు, భూగర్భ జలశాఖ డిప్యూటీ డైరెక్టర్
ఎస్సీ, ఎస్టీల పొలాల్లో బోర్లు వేసేందుకు దరఖాస్తుల స్వీకరణ పూర్తి కావడంతో క్షేత్ర స్థాయిలో సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. నీరు ఉండే స్థలాలను గుర్తించి పాయింట్లను ఏర్పాటు చేయనున్నాం. ప్రభుత్వం నిధులు విడుదల కాగానే బోర్లు వేసే పనులు ప్రారంభించనున్నాం. బోర్లు వేయడం ద్వారా లబ్ధిదారుల భూములు సస్యశ్యామలం కానున్నాయి. ఆర్థిక పరిస్థితుల మెరుగుకు మార్గం సుగమం కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి