సర్కారు బడులకు కంప్యూటర్లు
మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక విద్యను విద్యార్థులకు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ ఏడాది ప్రారంభంలో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయగా.. తాజాగా ఉన్నత పాఠశాలలు, కస్తూర్బాలకు కంప్యూటర్లను కేటాయించారు.
బోధకులను నియమిస్తేనే ప్రయోజనం
సంగారెడ్డి ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన కంప్యూటర్లు
న్యూస్టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ: మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక విద్యను విద్యార్థులకు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ ఏడాది ప్రారంభంలో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయగా.. తాజాగా ఉన్నత పాఠశాలలు, కస్తూర్బాలకు కంప్యూటర్లను కేటాయించారు. గతంలోనూ ప్రభుత్వ బడులకు కంప్యూటర్లు ఇచ్చినా.. బోధకులు లేకపోవడంతో నిరుపయోగంగా మారి పాడయ్యాయి. ఈ సారి అలా కాకుండా బోధకులను ప్రత్యేకంగా నియమిస్తే విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అందే అవకాశం ఉంటుంది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి..
జిల్లాలో 105 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 17 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలకు ఇటీవలే కంప్యూటర్లు సరఫరా చేశారు. ఎంపిక చేసిన బడులకు కంప్యూటర్లతో పాటుగా ప్రింటర్లు, 2కేవీ యూపీఎస్, ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్, స్వీచ్ బోర్డులు, కేబుల్ వైర్లు, జాక్ ప్యానెల్ అందించారు. పాఠశాలలకు ఇప్పటికే ఇవన్నీ చేరుకున్నాయి. మార్చి మొదటి వారంలోపు కంప్యూటర్లను బిగించాలి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో వినియోగించాలి. 15 సంవత్సరాల తర్వాత ప్రభుత్వ పాఠశాలకు మళ్లీ కంప్యూటర్లు సరఫరా చేశారు. వంద లోపు విద్యార్థులుంటే ఐదు, 101-200 వరకు 8, 201 కంటే ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలకు పది కంప్యూటర్లు కేటాయించారు. పాఠశాలల్లో వీటిని అమర్చిన తరువాత డిజిటల్ బోధనతో పాటు విద్యార్థుల వివరాలు అంతర్జాలం చేసేందుకు ఉపాధ్యాయులు వినియోగిస్తారు.
గతంలో ఇబ్బందులు: పాఠశాలలకు కంప్యూటర్లు చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీటిని బోధించేందుకు ప్రత్యేకంగా బోధకులను నియమించాలని కోరుతున్నారు. 2016లో పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందించేందుకు ఎంపిక చేసిన వాటికి కంప్యూటర్లు సరఫరా చేశారు. కొన్ని సంవత్సరాలు పార్ట్టైం బోధకులను నియమించారు. ఆ తర్వాత వారిని తొలగించడంతో బడుల్లో నిరుపయోగంగా మారాయి. కొన్ని చోట్ల ప్రధానోపాధ్యాయులు చొరవ తీసుకొని బోధకులను నియమించుకొని విద్యార్థులకు కంప్యూటర్ పాఠాలు చెబుతున్నారు. ఈ సారైనా అన్ని చోట్ల సాంకేతిక బోధకులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సాంకేతిక విద్య బోధించే వారిని నియమించాలని ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!