గడువు లోపు గగనమే!
సంగారెడ్డి వైద్య కళాశాల భవనాల పనుల్లో తాత్సారం కొనసాగుతోంది. ఇప్పటికే గడువు పొడిగించుతూ అధికారులు అనుమతించారు. పెంచిన గడువులోగా పనులు పూర్తిచేసేలా కనిపించడం లేదు. ఇటీవల నిర్వహించిన సమీక్షలో నిధుల కొరత సమస్యను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మంత్రి దామోదర్ రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లారు.
నిధులు లేక నెమ్మదించినవైద్య కళాశాల పనులు
అసంపూర్తిగా భవన నిర్మాణం
న్యూస్టుడే, సంగారెడ్డి అర్బన్: సంగారెడ్డి వైద్య కళాశాల భవనాల పనుల్లో తాత్సారం కొనసాగుతోంది. ఇప్పటికే గడువు పొడిగించుతూ అధికారులు అనుమతించారు. పెంచిన గడువులోగా పనులు పూర్తిచేసేలా కనిపించడం లేదు. ఇటీవల నిర్వహించిన సమీక్షలో నిధుల కొరత సమస్యను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మంత్రి దామోదర్ రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లారు.
వివిధ దశల్లో..
- జిల్లా ఆసుపత్రి ఆవరణలో వైద్య కళాశాల భవనాల నిర్మాణాలకు గత ప్రభుత్వం రూ.142 కోట్లు కేటాయించింది. కళాశాల ఆడ్మినిస్ట్రేషన్ బ్లాక్ రెండంతస్తుల భవనాన్ని నిర్మించాలి. ప్రస్తుతం ఫ్లోరింగ్, విద్యుత్తు, సీలింగ్ తదితర పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.
- బాలుర వసతి గృహం ఏడంతస్తుల భవనం స్లాబ్ పనులు పూర్తయ్యాయి. పెయింటింగ్, విద్యుత్తు, తలుపులు తదితర పనులు చేపట్టాలి. డైనింగ్హాల్ పనులు అసంపూర్తిగా ఉన్నాయి.
- మార్చురీ, ప్రిన్సిపల్, కళాశాల పర్యవేక్షకుల కోసం చేపట్టిన భవనాల పనులకు రూ.40 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది.
- కళాశాల ఆవరణలో అంతర్గత తారు రహదారులు, విద్యుత్తు సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది.
జూన్ వరకు అవకాశం
గత ఏడాది నవంబరు 28 వరకు వైద్య కళాశాల భవనాల పనులు పూర్తి చేసి అప్పగించాలని తొలుత అధికారులు గుత్తేదారుకు నిర్దేశించారు. ఆ దిశగా పనులు కొనసాగక పోవడంతో రానున్న జూన్ వరకు గడువు పొడిగించారు. ఈ మేరకు గుత్తేదారు సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. జూన్ వరకూ వైద్య కళాశాల పనులు పూర్తివడం గగనంగానే కనిపిస్తోంది. బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడమూ పనుల జాప్యానికి కారణమే.
వేగవంతం చేస్తాం: రాంబాబు, ఈఈ, ఆర్అండ్బీ
వైద్య కళాశాల భవనాల పనులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే గడువు మించిపోవడంతో.. జూన్ వరకు పొడిగించాం. అప్పటిలోగా నిర్దేశించిన పనులన్నీ పూర్తి చేస్తాం. వైద్య కళాశాలకు భవనాలను అప్పగిస్తాం. బిల్లులు వచ్చినా.. జాప్యమైనా.. పనులు ఆపవద్దని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. గుత్తేదారు సంస్థకు తెలియజేస్తాం. వైద్య విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం.
అద్దె గదుల్లో ఇబ్బందులు
- 2021 జూన్లో గత ప్రభుత్వం జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేసింది. భవన నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేసింది. ఎంబీబీఎస్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల తరగతులు జరుగుతున్నాయి. భవనాలు మాత్రం ఇంకా వినియోగంలోకి రాలేదు. అద్దె భవనాల్లో వసతి గృహం ఏర్పాటు చేయడంతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. తరగతుల నిర్వహణకు గతంలో నిర్మించిన రెండంతస్తుల భవనంలోనే నెట్టుకు రావాల్సి వస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్