ఇలా చేశావేంటి చదువుల తల్లి..
ప్రభుత్వ పాఠశాలలో చదివి పదో తరగతిలో 10 జీపీఏ సాధించి, బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశం పొందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. వివరాలు.. సంగారెడ్డి జిల్లా మనూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు కుమార్తె (17), కుమారుడు (14) ఉన్నారు. వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
మనూరు, న్యూస్టుడే: ప్రభుత్వ పాఠశాలలో చదివి పదో తరగతిలో 10 జీపీఏ సాధించి, బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశం పొందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. వివరాలు.. సంగారెడ్డి జిల్లా మనూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు కుమార్తె (17), కుమారుడు (14) ఉన్నారు. వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పిల్లలిద్దరూ స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత కుమార్తె పదో తరగతి వరకు మండల కేంద్రం మనూరులో చదివింది. 10 జీపీఏతో ఉత్తీర్ణురాలైంది. బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించగా, పీయూసీ మొదటి సంవత్సరం చదువుతోంది. వ్యక్తిగత కారణాలతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది.
ఉద్యోగం సాధిస్తానని..
ఉద్యోగం సాధించి అమ్మానాన్నలకు అండగా ఉంటానని ఊర్లో చెప్పి బాసరకు వెళ్లిన అమ్మాయి అదే రోజు రాత్రి వసతిగృహంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం గ్రామస్థులను కలచివేసింది. వ్యకిగత కారణాలతోనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు క్యాంపస్ వర్గాలు చెబుతున్నాయి. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి అక్కడ లభ్యమైన సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకొని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆ లేఖను చూసి వాళ్లు గుండెలవిసేలా విలపించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి. ఆ అమ్మాయి మృతదేహాన్ని శుక్రవారం గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు తరలివచ్చారు.
కష్టపడేతత్వం: భీమ్రావు, ఉపాధ్యాయుడు
ఆ విద్యార్థిని పాఠశాలకు డుమ్మా కొట్టేది కాదు. అందరితో కలిసిమెలిసి ఉండేది. కష్టపడే తత్వం. శ్రమించి ట్రిపుల్ ఐటీలో సీటు సాధించుకుంది. ఆమె చనిపోయిందన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాం.
కన్నీరు తెప్పించిన లేఖ
ముథోల్ (బాసర), న్యూస్టుడే: ఘటనాస్థలిలో దొరికిన లేఖలోని విషయాలు కన్నీరు తెప్పిస్తున్నాయి. ‘నేను ఇలా చేయడం తప్పని తెలిసినా తప్పడం లేదు. ఆకాష్ లేని జీవితం నాకు వద్దు.. నేను ఉండలేక ఇలా చేయాల్సి వచ్చింది. కానీ నాకు ఒకటి తెలియాలి ఆకాష్ ఎందుకిలా చేశాడో. కానీ అది మార్చి 1న తెలుస్తుంది. వాడి చావుకు కారణమైన వారిని వదలకండి. చనిపోయే రోజు రాత్రి 2 గంటలకు వాడికి ఎవరో ఫోన్ చేశాడు.. వివరాలు కనుక్కోôడి. ఫోన్ చేసినోడే బావ చావుకి కారణం. వాటిని శివ అన్న ద్వారా తెలుసుకోండి. బావ చనిపోయినప్పుడు నేను చూడలేదు. అందుకే బావను కాల్చిన స్థలంలోనే నన్నూ కాల్చండి. మేము బతికి ఉండగా కలిసి ఉండలేకపోయాం. చనిపోయిన తర్వాత కలిసి ఉంటాం. నేను ఎవరికి భయపడి చనిపోవడం లేదు. వాడి ప్రేమకావాలి. వాడిని వదిలి ఉండలేక ఇలా చేశాను’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.