నగదు రహితం.. ఆరోగ్య భరితం
మనం నిత్యం వాడే కరెన్సీ నోట్లు.. కొన్ని సందర్భాల్లో అనారోగ్యానికి కారణం అవుతాయి. జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సిందేనని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) విద్యార్థులు పరిశోధన ద్వారా నిరూపించారు.
పరిశోధనల్లో వెల్లడించిన విద్యార్థులు
ప్రయోగశాలలో విద్యార్థులు
న్యూస్టుడే, సిద్దిపేట: మనం నిత్యం వాడే కరెన్సీ నోట్లు.. కొన్ని సందర్భాల్లో అనారోగ్యానికి కారణం అవుతాయి. జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సిందేనని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) విద్యార్థులు పరిశోధన ద్వారా నిరూపించారు. ద్వితీయ, తృతీయ సంవత్సరం చదివే జీవసాంకేతిక (బయోటెక్నాలజీ) శాస్త్ర విద్యార్థులు ఎ.రమ్య, కె.గాయత్రి, డి.శ్రీనిఖిత, ఆర్.అఖిల్కుమార్, పూజిత, కె.మౌనిక ‘కరెన్సీ నోట్ల ద్వారా బ్యాక్టీరియాల వ్యాప్తి’పై పరిశోధించారు. జీవసాంకేతిక శాస్త్ర సహాయ ఆచార్యులు, విభాగాధిపతి డా. జి.మదన్మోహన్ పర్యవేక్షణలో పరిశోధన సాగగా, ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
గతేడాది నవంబరు చివర్లో పరిశోధనను ప్రారంభించి జనవరిలో పూర్తిచేశారు. ఫలితాలు తాజాగా వెల్లడయ్యాయి. కళాశాలలో బోధనా సిబ్బంది, విద్యార్థులు, రైతుబజారులో రైతులు, వినియోగదారులు, ఆసుపత్రుల్లో రోగుల సహాయకులు, ప్రయాణ ప్రాంగణంలో కండక్టర్లు, బ్యాంకులు, హోటళ్లు, దుకాణా సముదాయాల్లో వినియోగదారుల కరెన్సీ నోట్ల నుంచి స్వాబ్ సేకరించారు. మొత్తం 96 నమూనాలు తీసుకొని యానకంలో ప్రవేశపెట్టి బ్యాక్టీరియాలను వెలికితీశారు. నమూనాల సేకరణకు 30 రోజులు, ఫలితాల నిర్ధారణకు 15 రోజులు పట్టింది. రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీల్లో ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు.
అత్యధికం ఇక్కడే.. ఆసుపత్రుల పరిసరాల్లో వినియోగించే కరెన్సీలో అత్యధికంగా, హోటల్ వద్ద వినియోగించే వాటిల్లో అత్యల్పంగా బ్యాక్టీరియాలు ఉన్నట్లు తేలింది. విభాగాల వారీగా.. ఆసుపత్రి-30 బ్యాక్టీరియాలు (సీఎఫ్యూ - కాలనీ ఫామింగ్ యూనిట్), ప్రయాణ ప్రాంగణం- 24, మార్కెట్- 18, దుకాణాలు- 15, బ్యాంకు- 13, విద్యార్థులు- 11, అధ్యాపకులు- 8, హోటల్లో వినియోగించే వాటిల్లో 7 మేర ఉన్నట్లు స్పష్టం చేశారు. మొత్తం ఏడు రకాలను గుర్తించారు. వాటి ద్వారా డయేరియా, గొంతు సంబంధిత వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి.
వ్యాప్తి ఇలా.. ప్రధానంగా కరెన్సీ నోట్లను లెక్కించే క్రమంలో నోటిలోని తడిని వాడటం కారణంగా బ్యాక్టీరియాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి.
- హోటళ్లలో టిఫిన్ చేసే ముందు చేతులు శుభ్రం చేసుకొని టోకెన్ తీసుకుంటారు. ఈ క్రమంలో డబ్బులు చేతులు మారుతుంది. ఆ తర్వాత నేరుగా అల్పాహారం తినడం వల్ల బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్తుంది.
- బ్యాంకులు లేదా ఏటీఎంల నుంచి డబ్బు తీసుకున్న తర్వాత నిర్జలీకరణ చేయాలి. అందుకు నగదుపై యూవీ కిరణాలు ప్రసరింపజేస్తే నశిస్తాయి.
- డబ్బు మారేపుడు లెక్కించిన తర్వాత చేతుల శుభ్రత తప్పనిసరి.
- నగదు రహిత (ఆన్లైన్) లావాదేవీలు చేయడం ఉత్తమం.
- వీటి స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీ వినియోగించడం వల్ల వీటి ప్రభావం తక్కువగా ఉంటుంది.
- నోట్ల ముద్రణ సమయంలో వాటిని నశింపజేసే రసాయనాలు వాడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం