దుకాణాలు వదలరు.. ఆదాయం పెరగదు!
జిల్లాలోని పురపాలికల దుకాణ సముదాయాల నుంచి ఆదాయం ఆర్జించే అవకాశమున్నా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట, మేజర్ పంచాయతీల నుంచి పురాలుగా ఏర్పడిన నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేటల్లో టెండర్లు నిర్వహించకుండా పాతవారికే కట్టబెట్టారు.
పురపాలక కార్యాలయ దుకాణ సముదాయం
న్యూస్టుడే- నర్సాపూర్, మెదక్ టౌన్, తూప్రాన్, రామాయంపేట: జిల్లాలోని పురపాలికల దుకాణ సముదాయాల నుంచి ఆదాయం ఆర్జించే అవకాశమున్నా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట, మేజర్ పంచాయతీల నుంచి పురాలుగా ఏర్పడిన నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేటల్లో టెండర్లు నిర్వహించకుండా పాతవారికే కట్టబెట్టారు. ఎప్పుడో దుకాణాలు దక్కించుకున్న వ్యాపారుల రాజకీయ ఒత్తిళ్లతో ప్రక్రియ ముందుకు సాగడం లేదన్న విమర్శలున్నాయి.
మెదక్లో ఇదీ పరిస్థితి..
మెదక్ పురపాలిక పటేల్కుంటలోని దుకాణాలు శిథిలావస్థకు చేరడంతో కూల్చివేసేందుకు వ్యాపారులకు తాఖీదులిచ్చినా ఏడాదిగా వారు ఖాళీ చేయడం లేదు. కూరగాయల మార్కెట్లో 20 వరకు కూల్చివేశారు. మరికొన్నింటి నిర్వహణ సరిగా లేదు. వ్యాపారులు కొన్నేళ్లుగా పాతుకుపోయారు. అద్దెలు సైతం సక్రమంగా చెల్లించడం లేదన్న విమర్శలున్నాయి. బకాయిలు పేరుకుపోవడంతో పుర ఆదాయానికి గండి పడుతోంది. చాలా దుకాణాల్లో బినామీలు తిష్టవేశారు. మెదక్ పాత బస్టాండ్కు ఎదురుగా ఉన్న దుకాణాలకు ఇటీవల పుర అధికారులు కొత్తగా టెండరు ప్రక్రియను నిర్వహించగా.. 17 దుకాణాలకు 5.13 లక్షలు ఆదాయం సమకూరింది.
నర్సాపూర్లో ఏళ్లుగా పాతుకుపోయారు..
పుర దుకాణ సముదాయంలో కొన్నేళ్లుగా పాతుకుపోయారు. అద్దె సరిగా చెల్లించకున్నా వారిని ఖాళీ చేయించడం లేదు. కొన్నేళ్ల కిందట నిర్ణయించిన అద్దెలతోనే నెట్టుకొస్తున్నారు. ఆదాయం వచ్చే అవకాశమున్నా వదిలేస్తున్నారు. పట్టణంలోని మార్కెట్ రోడ్డులో పుర కార్యాలయం ఎదురుగా ఆరు, మరోచోట మూడు దుకాణాలున్నాయి. తొలినాళ్లలో దక్కించుకున్న వారే ఇప్పటికీ ఉన్నారు. 2018 ఆగస్టులో పురపాలికగా మారింది. అద్దెల వసూళ్లలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. వేర్వేరు అద్దెలు వసూలు చేస్తున్నారు. రూ.1500 నుంచి రూ.3వేలలోపే అద్దెలు ఉన్నాయి. పలువురు కౌన్సిలర్లు సాధారణ సమావేశాల్లోనూ విషయం లేవనెత్తినా చర్యలు మాత్రం తీసుకోలేదు. గతంలో పలుమార్లు అద్దెలు పెంచాలనే ప్రతిపాదన వచ్చినా రాజకీయ కారణాలతో అడుగు ముందుకు పడలేదు. కొన్ని దుకాణాలకు మరమ్మతులు చేసి అద్దెలు పెంచితే పురపాలికకు ఆదాయం వస్తుంది. ఇటీవల జరిగిన పుర బడ్జెట్ సమావేశంలో ఆదాయం పెంపునకు మార్గాలు అన్వేషించాలని పలువురు సూచించారు. కమిషనర్ జైత్రాంనాయక్ వద్ద ప్రస్తావించగా.. అద్దె బకాయిలు చెల్లించాలని దుకాణాదారులకు తాఖీదులు ఇచ్చామన్నారు. అద్దెలు పెంచడానికి టెండరు ప్రక్రియను చేపట్టనున్నామని తెలిపామన్నారు.
- తూప్రాన్లోనూ పురపాలికకు సంబంధించి పది దుకాణాలన్నాయి. మేజర్ పంచాయతీగా ఉన్నప్పుడు టెండరు వేసి కేటాయించారు. అప్పట్నుంచి పాతవారే కొనసాగుతున్నారు. ఏటా 13.5 శాతం అద్దెలు పెంచుతున్నారు. ప్రస్తుతం సుమారు రూ.5 లక్షల వరకూ బకాయిలున్నాయి.
- రామాయంపేటలోనూ 13 దుకాణాల సముదాయముంది. వాటి నుంచి పురపాలికకు రూ.52 వేల ఆదాయం వస్తోంది. మేజర్ పంచాయతీగా ఉన్నప్పుడు టెండర్లు నిర్వహించారు. పురపాలికగా మారాక అందులో ఉన్నవారికే మూడేళ్లపాటు పొడిగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత