నవజాత శిశువులకు భరోసా!
సాధారణంగా పుట్టుకతో చిన్నారులను పలు రుగ్మతలు సోకుతుంటాయి. ఇవి వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
పుట్టిన 48 గంటల్లో ఆరోగ్య పరీక్షలు
సంగారెడ్డిలో ప్రయోగాత్మక సేవల అమలు
శిశువుకు పాలు తాగిస్తూ..
న్యూస్టుడే, సంగారెడ్డి అర్బన్: సాధారణంగా పుట్టుకతో చిన్నారులను పలు రుగ్మతలు సోకుతుంటాయి. ఇవి వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇలాంటి వారికి మేమున్నాం అంటూ భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం ఉచితంగా వైద్య సేవలు అందించాలని సంకల్పించింది. పుట్టిన శిశువులకు 48 గంటల్లో ఐదు రకాల పరీక్షలు చేపట్టి, వైద్యసేవలు అందించాలని నిర్ణయించింది. ఈ సేవలు తొలుత హైదరాబాద్లోని నిలోఫర్లో అమలు అవుతున్నాయి. సంగారెడ్డిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రయోగాత్మకంగా ఎంపిక చేయడం విశేషం.
నెలకు 750కి పైగా కాన్పులు.. సంగారెడ్డిలోని జిల్లా ఆసుపత్రి ఆవరణలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో 150 పడకలు ఉన్నాయి. నవజాత శిశువుల కోసం పది పడకలతో పాటు అదనంగా 30 పడకలను చిన్నారులకు కేటాయించారు. నిత్యం 150 మంది 200 మంది వరకు గర్భిణులు, బాలింతలు ఆరోగ్య పరీక్షలకు తరలివస్తుంటారు. ఉమ్మడి జిల్లాతో పాటు వికారాబాద్, రంగారెడ్డి జిల్లావాసులు సైతం వస్తుంటారు. నెలకు 750 నుంచి 800 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. గర్భిణి సమయంలో వైద్యుల సలహాలు, సూచనలు పాటించకపోవడం, తదితర కారణాలతో పుట్టిన బిడ్డలను పలు రోగాలు వేధిస్తుంటాయి. ఇలాంటి శిశువులకు వైద్య సేవలు అందేవి కావు. ఇకనుంచి ఇక్కడ చికిత్స అందించనున్నారు.
రక్త నమూనాలు సేకరించి.. జన్యుపరంగా హైపోథైరాయిడ్ వ్యాధితో శిశువులు సతమతం అవుతుంటారు. 811 మంది పిల్లల్లో ఒకరికి ఇది వచ్చే అవకాశం ఉంది. అడ్రినల్ హైపర్ ప్లాసియా 2009 మందిలో ఒకరికి, జీ6 పీడీ లోపం 932 మందిలో ఒకరికి, బయోటిడీస్ లోపం 1475 మందిలో ఒకరు, గాలెక్టోసీమియా 1340 మందిలో ఒకరు వ్యాధి బారిన పడుతుంటారని వైద్యులు చెబుతున్నారు. వీటిని నిర్ధారించేందుకు పుట్టిన 48 గంటల్లో శిశువు రక్తనమూనాలు సేకరించి హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనిటిక్కు పంపిస్తారు. వ్యాధి నిర్ధారణ అయితే సంగారెడ్డి ఎంసీహెచ్కు ఫలితాలను పంపిస్తారు. దీని ఆధారంగా చికిత్స అందిస్తారు. అత్యవసరమైతే నిలోఫర్కు తరలిస్తారు. ఏ వ్యాధి లేకుంటే సంబంధిత కుటుంబీకులకు నివేదిక చేరవేరుస్తారు. సంగారెడ్డి ఎంసీహెచ్లో ప్రయోగాత్మకంగా శిశువులకు వైద్యసేవలు అందించడం పేదలకు ఊరటనిచ్చేదే. ఐదు రకాల పరీక్షలకు ప్రైవేటులో సుమారు రూ.40 వేల వరకు ఖర్చవుతుంది. దీనికితోడు చికిత్స సైతం ఉచితంగా అందించనుండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు సైతం తొలుగుతాయి.
శిశువు రక్త నమునా సేకరిస్తూ..
కార్యక్రమ అమలుకు ఎంసీహెచ్లో నవజాత శిశువుల స్క్రీనింగ్ కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. ఆర్బీఎస్కే జిల్లా సమన్వయకర్త శశాంక్ దేశ్పాండే ఆధ్వర్యంలో శిశువులకు రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు హైదరాబాద్కు తరలించారు. ఆసుపత్రి పర్యవేక్షకుడు అనిల్కుమార్, మహిళా వైద్య నిపుణురాలు రాధిక, చిన్నపిల్లల వైద్యుడు షబ్బీర్అలీ, ఆర్ఎంవో రామాంజనేయులు తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?