ఎన్నాళ్లో వేచిన ఉద్యోగార్థి హృదయం
ఉపాధ్యాయ కొలువును సాధించేందుకు తపిస్తున్న ఎంతోమంది యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
311 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మార్గం సుగమం
తరగతి గదిలో విద్యార్థులు
న్యూస్టుడే, సిద్దిపేట: ఉపాధ్యాయ కొలువును సాధించేందుకు తపిస్తున్న ఎంతోమంది యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ కావడంతో నిరుద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మరోవైపు జిల్లాల సర్కారు బడుల బలోపేతానికి మార్గం సుగమమైంది. ఉపాధ్యాయుల కొరత తీరనుంది. 2016 తరువాత ఇప్పటి వరకు డీఎస్సీ నిర్వహించలేదు. ఏళ్ల నిరీక్షణ తరువాత ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ముందడుగు పడటం ఊరటగా మారింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గత డిసెంబరు నుంచే నోటిఫికేషన్ వెలువరిస్తామంటూ పలు సందర్భాల్లో ప్రస్తావించడంతో ఇప్పటికే పలువురు శిక్షణ కేంద్రాల బాటపట్టడం గమనార్హం.
49 మూతపడ్డాయి.. జిల్లాలో ప్రాథమిక - 638, ప్రాథమికోన్నత - 115, ఉన్నత పాఠశాలలు - 227 కొనసాగుతున్నాయి. ఆయా వాటిల్లో 82,946 మంది విద్యార్థులు చదువుతున్నారు. కొన్నేళ్లుగా ఉపాధ్యాయ నియామకాలు లేకపోగా సర్కారు ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఇప్పటికే ఉన్న వారిపై ఒత్తిడి పెంచడంతో ఆ ప్రభావం విద్యార్థి చదువు, ఫలితాలపై చూపుతోంది. ఈ తరుణంలో అప్పటి ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరు 6న డీఎస్సీ ప్రకటన చేసినా.. ఎన్నికలు, ఇతరత్రా కారణాలతో ఫలితం లేకపోయింది. అప్పట్లో జిల్లాలో 141 పోస్టులు మాత్రమే భర్తీ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆ సంఖ్య రెట్టింపవడం విశేషం. మరోవైపు ప్రతి గ్రామంలో పాఠశాల ఉండాలని, మూతపడిన వాటిని తెరవాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. జిల్లాలో 49 మూతపడ్డాయి. విద్యార్థులు లేకపోవడం, ఇతరత్రావి అందుకు కారణమయ్యాయి. దీంతో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులను ఇతర ప్రాంతాలకు డిప్యుటేషన్ చేశారు. డీఎస్సీ నియామకాలు సకాలంలో పూర్తయితే మూతపడినవి తెరవడంతో పాటు ఇప్పటికే కొనసాగుతున్న చోట్ల గురువుల కొరత తీరనుంది.
పెరిగిన పోస్టులు.. పెద్దసంఖ్యలో డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం సుదీర్ఘంగా ఎదురుచూశారు. ఆ విభాగంలో 20 వేలకు పైగా ఉంటుందనేది ఒక అంచనా. వివిధ దశల్లో టెట్ను అర్హత సాధించిన వారు పెద్దసంఖ్యలో ఉన్నారు. ఈ తరుణంలో పోస్టుల సంఖ్య పెరగడంతో పలువురిలో ఆశలు చిగురించాయి. ఎస్జీటీలకు పదోన్నతి కల్పిస్తే ప్రస్తుతం ఉన్న ఖాళీల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.
విభాగాల వారీగా భర్తీ చేయనున్న పోస్టులు ఇలా.. ఎస్ఏ సాంఘికశాస్త్రం - 31, బయోసైన్స్ - 18, తెలుగు - 8, ఇంగ్లిషు - 6, గణితం - 5, హిందీ - 4, భౌతికశాస్త్రం - 3, ఫిజికల్ ఎడ్యుకేషన్-1, ఉర్దూ-1. ఎస్జీటీ తెలుగు మాధ్యమం - 157, ఉర్దూ మాధ్యమం - 10. పీఈటీలు - 8, భాషా పండితుల విభాగంలో హిందీ - 15, తెలుగు - 9. ఈసారి కొత్తగా భవిత కేంద్రాల్లోనూ ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టారు. స్పెషల్ ఎడ్యుకేషన్ కింద ఎస్ఏ హోదాలో 9, ఎస్టీజీ హోదాలో 26 పోస్టులు కేటాయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట