నెరవేరనున్న నిరుద్యోగుల కల
ఎట్టకేలకు ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయుల కొరత తీరే అవకాశముంది. ఏళ్లుగా పోస్టులు భర్తీ చేయకపోవడం.. మరో వైపు వాలంటీర్లను నియమించకపోవడంతో విద్యార్థుల బోధనకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
జిల్లాలో భర్తీకానున్న 551 ఉపాధ్యాయ పోస్టులు
న్యూస్టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ: ఎట్టకేలకు ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయుల కొరత తీరే అవకాశముంది. ఏళ్లుగా పోస్టులు భర్తీ చేయకపోవడం.. మరో వైపు వాలంటీర్లను నియమించకపోవడంతో విద్యార్థుల బోధనకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల ఉపాధ్యాయులను డిప్యుటేషన్పై నియమించి బోధన చేయించేవారు. ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
బడుల్లో భారీగా ఖాళీలు: జిల్లాలో 1,248 పాఠశాలల్లో 1.30 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అన్నిచోట్లా కలిపి మొత్తం 1,322 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ గతంలో నివేదికలు తయారు చేసింది. తాజాగా ప్రభుత్వం వివిధ కేటగిరీల కింద జిల్లాలో 551 పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుత డీఎస్సీ ద్వారా సగం ఖాళీ పోస్టులు మాత్రమే భర్తీ కానున్నాయి. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులకు సరిపడా టీచర్లు లేకపోవడంతో ఐదు తరతులకు ఒక్కరే బోధించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రాథమిక తరగతుల విద్యార్థులు చదువులో వెనుకబడినట్లు అనేక సర్వేల్లో వెల్లడైంది. విద్యార్థులు చదవడం, రాయడం లాంటి సామర్థ్యాల్లో కనీస ప్రమాణాలు అందుకోవడం లేదు. బడుల్లో పోస్టులు ఖాళీగా ఉండటంతో బోధనకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదని ఉపాధ్యాయులు తెలిపారు. పదో తరగతి బోధనకు సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో రెండు సంవత్సరాలుగా వాలంటీర్లతో నెట్టుకొస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ల నియామకం వల్ల ఈ పాఠశాలల్లో కొంతమేరకు సమస్య తీరనుంది.
ప్రత్యేక విభాగంలోనూ..: పాఠశాలల్లో ఈ సారి ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. వీరు దివ్యాంగులు, ప్రత్యేక అవసరాల పిల్లలకు బోధన చేయనున్నారు. ప్రత్యేక బీఈడీ, డీఈడీ చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఈ కేటగిరీ కింద 44 పోస్టులు కేటాయించారు. మొదటి సారి ఈ పోస్టులు భర్తీ చేయడంతో దివ్యాంగ విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!