పారిశ్రామిక ఊతం.. ప్రగతికి దోహదం
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక పారిశ్రామిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది.
‘ఐలా’ కార్యవర్గాల ఎన్నికలకు కసరత్తు
పారిశ్రామికవాడ
పటాన్చెరు అర్బన్, న్యూస్టుడే: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక పారిశ్రామిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. పారిశ్రామికవాడల్లో అభివృద్ధికి దోహదం చేసే ఐలా కార్యవర్గాలు ప్రస్తుతం అన్నిచోట్ల లేకపోవడంతో అభివృద్ధి ఇంతకాలం కుంటుపడింది. పారిశ్రామికవాడల్లో మౌలిక వసతులు మెరుగుపరిచి, ప్రగతి పరుగులెత్తించేందుకు ఐలా ఎన్నికలు నిర్వహించి కొత్త కార్యవర్గాలు ఏర్పాటుచేయాలని ఓ సర్క్యులర్ విడుదలైంది.
పటాన్చెరు పరిధిలో..
పటాన్చెరు నియోజవర్గంలో పటాన్చెరు, పాశమైలారం, రామచంద్రాపురం, ఐడీఏ బొల్లారం, గడ్డపోతారం, బొంతపల్లి ఆరు పారిశ్రామికవాడలున్నాయి. పటాన్చెరు ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండో పారిశ్రామికవాడగా పేరొందింది. ఇందులో పటాన్చెరు, పాశమైలారం, రామచంద్రాపురం, సుల్తాన్పూర్, టీఎస్ఐఐసీ ఏర్పాటుచేసిన పారిశ్రామికవాడలు కాగా ఐడీఏ బొల్లారం, గడ్డపోతారం, బొంతపల్లి ప్రైవేటుగా ఏర్పాటుచేసిన పారిశ్రామికవాడలు. టీఎస్ఐఐసీ పరిధిలో కొత్తగా ఈ మధ్య సుల్తాన్పూర్ పారిశ్రామికవాడ ఏర్పాటుచేయగా కాలుష్యంలేని పరిశ్రమలు కొన్ని ఏర్పాటుచేశారు. ఇక శివానగర్, ఐనోల్, చిట్కుల్ పరిధిలో పారిశ్రామికవాడలు ఏర్పాటైనా ఇంకా అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలేదు.
ప్రయోజనాలు ఇలా..: పటాన్చెరు పారిశ్రామికవాడలో ఐలా కార్యవర్గ గడువు 2022 సెప్టెంబరు 17తో ముగిసినా కొత్త కార్యవర్గం ఏర్పాటు కాలేదు. దీంతో పారిశ్రామికవాడలో తాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ, ఆక్రమణలు, అభివృద్ధికి నిధుల కొరతతో పారిశ్రామికవాడ అభివృద్ధి కుంటుపడుతోంది.
- నిబంధనల ప్రకారం ఐలా ఎన్నికలు నిర్వహించాలంటే దాదాపు 65శాతం సభ్యత్వ రుసుము వసూలు చేసి వారందరూ ఎన్నికల్లో పాల్గొని ఐలా ఛైర్మన్తోపాటు కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది.
- దీనిపై పారిశ్రామికవేత్తలు ఇప్పటికే ఒక తాటిపైకి వచ్చి కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటుచేసుకోవాలని కసరత్తు చేస్తున్నారు. ః ఇక పాశమైలారం పారిశ్రామికవాడలో గతంలో ఎన్నుకున్న కార్యవర్గానికి మార్చి వరకూ గడువు ఉన్నా.. వివాదాల మూలంగా పారిశ్రామికవేత్తలు సమావేశం నిర్వహించుకుని కొత్త కార్యవర్గం ఏర్పాటుచేసుకునే యోచనలో ఉన్నారు.
- రామచంద్రాపురం పారిశ్రామికవాడలో ఇప్పటికే ఐలా కార్యవర్గం ఉంది. ఇక సుల్తాన్పూర్లో పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో 65శాతం ఆస్తిపన్ను వసూలైతే అక్కడా ఎన్నికలు జరిగే అవకాశముంది.
నిబంధనల ప్రకారమే ఎన్నికలు
రామచంద్రాపురంలో ఐలా కార్యవర్గం ఉంది. పాశమైలారంలో ఐలా కార్యవర్గ ఎన్నిక చేసుకుంటున్నామని ఎటువంటి నివేదిక ఇవ్వలేదు. పటాన్చెరులో మాత్రం ఐలా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే పారిశ్రామికవేత్తలు తెలిపారు. ఎక్కడ జరిపినా నిబంధనల ప్రకారమే ఐలా ఎన్నికలు నిర్వహిస్తాం.
అనూరాధ, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం