నిరుద్యోగుల కల.. నెరవేరనున్న వేళ
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అడుగులు పడడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి.
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు
పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడు
న్యూస్టుడే, మెదక్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అడుగులు పడడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. కొన్నేళ్లుగా పోస్టులు ఖాళీగా ఉండడంతో విద్యావ్యవస్థలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా విద్యారంగం బలోపేతం దిశగా సర్కారు అడుగులు వేస్తోంది.
ఎస్జీటీ ఖాళీలే ఎక్కువ... జిల్లాలో సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ), స్కూల్ అసిస్టెంట్, భాషా పండితులు, వ్యాయామ విద్య పోస్టులను భర్తీ చేయనున్నారు. అన్ని కేటగిరీలు కలిపి 310 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుత డీఎస్సీ నోటిఫికేషన్తో ఇవి భర్తీ కానున్నాయి. ఈసారి ప్రభుత్వం ప్రత్యేక కేటగిరీ ఉపాధ్యాయ పోస్టులను సైతం భర్తీ చేస్తోంది. ఖాళీల్లో ఎక్కువగా ఎస్జీటీ పోస్టులే ఉన్నాయి. భాషాపండితులు, ప్రత్యేక కేటగిరీతో కలిపి 209, స్కూల్ అసిస్టెంట్లో ఆయా సబ్జెక్టులు కలిపి 101 పోస్టులున్నాయి. గతేడాది సెప్టెంబర్లో జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ ఆధారంగా జిల్లాలో 147 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేక కేటగిరీ పోస్టుల భర్తీతోపాటు మరికొన్ని ఖాళీలు చూపడంతో ఆ సంఖ్య 310కి చేరింది. డీఎస్సీ పరీక్ష రాయాలంటే టెట్లో అర్హత సాధించాలి.
తొలగనున్న ఇబ్బందులు...ఉపాధ్యాయ పోస్టుల భర్తీతో ప్రభుత్వ బడుల్లో నెలకొన్న ఇబ్బందులు తీరనున్నాయి. ఇటీవల ఆయా కేటగిరీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించారు. కోర్టు కేసుల కారణంగా అవి నిలిచిపోయాయి. ఒకవేళ పదోన్నతుల ప్రక్రియకు ముందడుగు పడితే.. ఆయా పోస్టుల్లో నూతన డీఎస్సీ ద్వారా ఎంపికైన వారిని భర్తీ చేసే అవకాశముంది. ఒకవేళ పదోన్నతులు కల్పించకున్నా... ఖాళీలున్న చోట కొత్త వారిని నియమించే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో పోస్టుల భర్తీతో బోధన సక్రమంగా సాగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే