మెదక్ నుంచి ఇందిర.. ఎందుకు పోటీ చేశారంటే?
అది 1977 సంవత్సరం.. అంతకుముందే దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేశారు. ఆ తర్వాతి సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఉత్తరప్రదేశ్లోనూ ఇందిర ఓడిపోయారు.
సర్పంచుల సదస్సులో పాల్గొన్న ఇందిరాగాంధీ
న్యూస్టుడే, మెదక్: అది 1977 సంవత్సరం.. అంతకుముందే దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేశారు. ఆ తర్వాతి సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఉత్తరప్రదేశ్లోనూ ఇందిర ఓడిపోయారు. కేంద్రంలో జనతా పార్టీ కొలువుదీరింది. ఏపీ, కర్ణాటకలోనే కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఆ పార్టీ నాయకులు ఇందిరను లోక్సభకు పంపించాలని కంకణం కట్టుకున్నారు. దీంతో 1978లో కర్ణాటకలోని అప్పటి చిక్మగ్ళూరు ఎంపీ వీరేంద్రపాటిల్ రాజీనామా చేయగా, ఆమె పోటీ చేశారు. రెండేళ్లకే జనతా ప్రభుత్వం పడిపోయింది. 1980లో మధ్యంతర ఎన్నికలు రాగా, ఇందిరాగాంధీ ఉత్తరప్రదేశ్ రాయ్బరేలీ, మెదక్ నుంచి బరిలో దిగారు. పార్టీ పరిస్థితిపై సర్వే చేయించి విజయావకాశాలు గుర్తించి మెదక్ను ఎంచుకున్నారు.
ప్రత్యర్థి జైపాల్రెడ్డి.. మధ్యంతర ఎన్నికల్లో మెదక్ నుంచి ఇందిరాగాంధీ కాంగ్రెస్(ఐ), జనతా పార్టీ నుంచి సూదిని జైపాల్రెడ్డితో పాటు జనతా (ఎస్) పార్టీ నుంచి కేశవరావ్జాదవ్ స్వతంత్రులుగా గంటాబాబు, శకుంతలాదేవి పోటీ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన కాంగ్రెస్ నేత బాగారెడ్డి తమ అధినేత్రికి ఎన్నికల ఏజెంట్గా వ్యవహరించారు. ఆమె విజయంలో కీలకపాత్ర పోషించారు. మొత్తం 4,45,289 ఓట్లు పోలవగా.. అందులో 3,15,077 (67.9) శాతం ఇందిరాగాంధీకే లభించడం విశేషం. సమీప ప్రత్యర్థి జైపాల్రెడ్డికి 82,453 ఓట్లు వచ్చాయి. 2,32,624 ఓట్ల ఆధిక్యంతో ఆమె విజయం సాధించారు. విజయంలో కీలకంగా వ్యవహరించిన బాగారెడ్డికి ఆ తర్వాతి ఎన్నికల్లో టికెట్ లభించింది.
మెదక్ ఎంపీగానే.. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లను గెలుచుకోగా ఇందిరాగాంధీ నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరింది. రాయ్బరేలీలోనూ గెలవగా, ఆ స్థానాన్ని వదులుకొని మెదక్ ఎంపీగా ప్రధానమంత్రి పదవిలో కొనసాగారు. ప్రధాని హోదాలో ఆమె పలుమార్లు జిల్లాకు వచ్చారు. సంగారెడ్డిలో జడ్పీ సమావేశానికి హాజరయ్యారు. 1984 జులై 19న మెదక్లో జరిగిన సర్పంచుల సదస్సులోనూ పాల్గొన్నారు. మెదక్లో పలు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. 1984 అక్టోబరు 31న హత్యకు గురయ్యే నాటికి మెదక్ ఎంపీగానే కొనసాగారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి