మెదక్ నుంచి ఇందిర.. ఎందుకు పోటీ చేశారంటే?
అది 1977 సంవత్సరం.. అంతకుముందే దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేశారు. ఆ తర్వాతి సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఉత్తరప్రదేశ్లోనూ ఇందిర ఓడిపోయారు.
సర్పంచుల సదస్సులో పాల్గొన్న ఇందిరాగాంధీ
న్యూస్టుడే, మెదక్: అది 1977 సంవత్సరం.. అంతకుముందే దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేశారు. ఆ తర్వాతి సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఉత్తరప్రదేశ్లోనూ ఇందిర ఓడిపోయారు. కేంద్రంలో జనతా పార్టీ కొలువుదీరింది. ఏపీ, కర్ణాటకలోనే కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఆ పార్టీ నాయకులు ఇందిరను లోక్సభకు పంపించాలని కంకణం కట్టుకున్నారు. దీంతో 1978లో కర్ణాటకలోని అప్పటి చిక్మగ్ళూరు ఎంపీ వీరేంద్రపాటిల్ రాజీనామా చేయగా, ఆమె పోటీ చేశారు. రెండేళ్లకే జనతా ప్రభుత్వం పడిపోయింది. 1980లో మధ్యంతర ఎన్నికలు రాగా, ఇందిరాగాంధీ ఉత్తరప్రదేశ్ రాయ్బరేలీ, మెదక్ నుంచి బరిలో దిగారు. పార్టీ పరిస్థితిపై సర్వే చేయించి విజయావకాశాలు గుర్తించి మెదక్ను ఎంచుకున్నారు.
ప్రత్యర్థి జైపాల్రెడ్డి.. మధ్యంతర ఎన్నికల్లో మెదక్ నుంచి ఇందిరాగాంధీ కాంగ్రెస్(ఐ), జనతా పార్టీ నుంచి సూదిని జైపాల్రెడ్డితో పాటు జనతా (ఎస్) పార్టీ నుంచి కేశవరావ్జాదవ్ స్వతంత్రులుగా గంటాబాబు, శకుంతలాదేవి పోటీ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన కాంగ్రెస్ నేత బాగారెడ్డి తమ అధినేత్రికి ఎన్నికల ఏజెంట్గా వ్యవహరించారు. ఆమె విజయంలో కీలకపాత్ర పోషించారు. మొత్తం 4,45,289 ఓట్లు పోలవగా.. అందులో 3,15,077 (67.9) శాతం ఇందిరాగాంధీకే లభించడం విశేషం. సమీప ప్రత్యర్థి జైపాల్రెడ్డికి 82,453 ఓట్లు వచ్చాయి. 2,32,624 ఓట్ల ఆధిక్యంతో ఆమె విజయం సాధించారు. విజయంలో కీలకంగా వ్యవహరించిన బాగారెడ్డికి ఆ తర్వాతి ఎన్నికల్లో టికెట్ లభించింది.
మెదక్ ఎంపీగానే.. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లను గెలుచుకోగా ఇందిరాగాంధీ నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరింది. రాయ్బరేలీలోనూ గెలవగా, ఆ స్థానాన్ని వదులుకొని మెదక్ ఎంపీగా ప్రధానమంత్రి పదవిలో కొనసాగారు. ప్రధాని హోదాలో ఆమె పలుమార్లు జిల్లాకు వచ్చారు. సంగారెడ్డిలో జడ్పీ సమావేశానికి హాజరయ్యారు. 1984 జులై 19న మెదక్లో జరిగిన సర్పంచుల సదస్సులోనూ పాల్గొన్నారు. మెదక్లో పలు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. 1984 అక్టోబరు 31న హత్యకు గురయ్యే నాటికి మెదక్ ఎంపీగానే కొనసాగారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలి ఓటు వేశారోచ్
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తొలి సారిగా చేపట్టిన ఇంటి నుంచి ఓటు ప్రక్రియ సాఫీగా కొనసాగింది. -
ఈ రోజు ఇలా.. రేపు అలా..
[ 03-05-2024]
పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఓటూ ప్రాధాన్యమే. బూత్ స్థాయి నుంచి అన్ని పార్టీలు శ్రేణులను సిద్ధం చేస్తున్నాయి. -
ఆరు నూరైనా మెతుకు సీమలో గెలవాలి
[ 03-05-2024]
సిద్దిపేటలో నిర్వహించిన కాంగ్రెస్ రోడ్షో శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. -
ఒకేలా కన్పిస్తూ.. గెలుపోటములు శాసిస్తూ..
[ 03-05-2024]
ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులెవరనేది తేలిపోయింది. పోలింగ్కు తక్కువ రోజులే ఉండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. -
కాంగ్రెస్కు ఓటేస్తే.. సీఎం అబద్ధాల్ని ఆమోదించినట్లే
[ 03-05-2024]
‘అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. గద్దెనెక్కాక ప్రజల్ని మోసం చేసింది. -
లోక్సభ పోరు.. మరింత హోరు
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
భాజపాతోనే దేశాభివృద్ధి
[ 03-05-2024]
భాజపాతోనే దేశాభివృద్ధి సాధ్యమని మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. -
ఓటరు చైతన్యంపై ఆడియో ఆవిష్కరణ
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్శాతం పెంచేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ మనుచౌదరి పిలుపునిచ్చారు. -
కల నెరవేరిస్తేనే.. విద్యాప్రగతి
[ 03-05-2024]
విద్యతోనే ప్రగతి సాధ్యం.. పేదరిక నిర్మూలనకు ఎంతో దోహదపడుతుంది.. డిగ్రీ వరకు విద్యాభ్యాసానికి ప్రభుత్వపరంగా వసతులు ఉన్నా ఆపై చదువులకు ఇబ్బందులు తప్పడం లేదు.. ఎన్నికల సమయంలో విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పే నేతలు ఆ తర్వాత వదిలేస్తున్నారు. -
రెండు కళ్లూ చాలవులే..
[ 03-05-2024]
కల్యాణ వేదికపై ఆసీనులైన శ్రీరామచంద్రమూర్తిని సీతమ్మవారు ఓరకంట చూసి చిరుమందహాసం చేస్తోంది.. పక్కనే మరో వేదికపై వరుడి అలంకరణలో ఉన్న పరమేశ్వరుడిని చూసిన పార్వతిదేవి సిగ్గులొలికిస్తోంది. -
విద్వేషాలు రెచ్చగొడుతున్న భాజపా
[ 03-05-2024]
ప్రజా సంక్షేమాన్ని విస్మరించి విద్వేషాలను రెచ్చగొడుతూ అప్రజాస్వామిక రాజకీయాలు సాగిస్తున్న భాజపాను ఓడించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. -
లక్ష్యం.. సాకారం చేసుకొని..
[ 03-05-2024]
సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఎంతోమంది ఈ కలల ప్రపంచంలోకి అడుగుపెట్టాలని కలలు కంటుంటారు. -
కాంగ్రెస్ సర్కారుతోనే సంక్షేమం: మంత్రి పొన్నం
[ 03-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ప్రజల సంక్షేమం, అభివృద్ధి జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరతకుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
-
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
-
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
-
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత
-
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
-
జగనాసురుడి రాజ్యం.. ఐసీయూలో ఆరోగ్యశ్రీ