డ్రైవింగ్ స్కూళ్ల దందా..!
ఉమ్మడి నల్గొండ జిల్లాలో డ్రైవింగ్ స్కూళ్ల దందా..మూడు పువ్వులు.. ఆరుకాయలుగా నడుస్తోంది. కరోనా తర్వాత ప్రజలు సొంత వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.
నీలగిరిలో పాత వాహనంతో శిక్షణ ఇస్తున్న డ్రైవింగ్ స్కూల్ వాహనం
నల్గొండ జిల్లా పరిషత్తు, న్యూస్టుడే: ఉమ్మడి నల్గొండ జిల్లాలో డ్రైవింగ్ స్కూళ్ల దందా..మూడు పువ్వులు.. ఆరుకాయలుగా నడుస్తోంది. కరోనా తర్వాత ప్రజలు సొంత వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, యువత, గృహిణులు డ్రైవింగ్ నేర్చుకునేందుకు మక్కువ చూపిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో డ్రైవింగ్ స్కూల్స్ పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వం నుంచి కేవలం 16 డ్రైవింగ్ స్కూల్స్ అనుమతి పొందగా.. క్షేత్రస్థాయిలో అంతకంటే ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి.
శిక్షణ లేకుండానే ఫాం-5 జారీ
ఉమ్మడి జిల్లాలో ఉన్న 9 హెవీ డ్రైవింగ్ స్కూళ్లల్లో ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే అభ్యర్థుల నుంచి రూ.20-25వేల వరకు డబ్బులు తీసుకొని ఫాం-5 జారీ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డ్రైవింగ్ స్కూలు నెలకు 16 మందికి శిక్షణ ఇచ్చేలా అధికారులు అనుమతి ఇచ్చారు. స్కూళ్ల యాజమాన్యాలు అభ్యర్థులకు నెలలో 25 రోజుల పాటు శిక్షణ ఇచ్చినట్లు హాజరు పత్రాలను ఆర్టీవో అధికారులకు చూపించాలి. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఫాం-5 ఇస్తున్నారు. దీంతో హెవీ లైసెన్స్లు జారీ చేస్తున్నారు.
పాత వాహనాలతోనే..
పాత వాహనాలకు మరమ్మతులు చేసి వాటిని శిక్షణకు ఉపయోగిస్తున్నారు. ప్రత్యేక శిక్షణ ఇచ్చే డ్రైవర్కు మెకానికల్ డిప్లొమా అర్హత ఉండాలి. వాహనం నేర్చుకునే వారికి ప్రత్యేకంగా తరగతులు నిర్వహించాలి. రేడియేటర్, ఇంజిను, టైర్లు చెక్ చేసుకోవడం, తదితర అంశాలపై శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ట్రాఫిక్ నిబంధనలుపై అవగాహన కల్పించాల్సి ఉంది. అనుభవం లేని డ్రైవింగ్తో నిత్యం వందల సంఖ్యలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం శిక్షణ వాహనాలు, అనుభవం కలిగిన డ్రైవర్లను ఏర్పాటు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
చర్యలు తీసుకుంటాం
- సురేందర్రెడ్డి, జిల్లా రవాణాశాఖాధికారి నల్గొండ
డ్రైవింగ్ స్కూళ్ల శిక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. అనుమతికి విరుద్ధంగా వాహనాలు ఉపయోగించిన, నిబంధనల మేరకు శిక్షణ తరగతులు నిర్వహించకుండా ఫాం-5 జారీ చేసినా.. తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ అనుమతి పొందిన వాహనాల ద్వారా కాకుండా ఇతర వాహనాలను ఉపయోగించి శిక్షణ ఇచ్చిన కేసులు నమోదు చేయడంతోపాటు స్కూళ్ల అనుమతి రద్దు చేస్తాం.
చండూరు మండలవాసి హెవీ వెహికల్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పెద్ద వాహనాలు నడిపినట్లు ధ్రువీకరణ పత్రం ఉంటేనే లైసెన్స్ జారీ చేస్తామని చెప్పడంతో ఏజెంటు ద్వారా డ్రైవింగ్ స్కూల్ను సంప్రదించాడు. డ్రైవింగ్ స్కూల్ ధ్రువపత్రానికి రూ.20000, లైసెన్స్ ఇతరత్రా ఖర్చులకు మరో రూ.8000 మొత్తం రూ.28000 సమర్పించుకున్నాడు.
నల్గొండ పట్టణానికి చెందిన లవకుమార్ కారు డ్రైవింగ్ నేర్చుకునేందుకు పట్టణంలోని ఓ డ్రైవింగ్ స్కూల్ను ఆశ్రయించగా.. రూ.6500 ఫీజు వసూలు చేశారు. పూర్తి స్థాయిలో డ్రైవింగ్ నేర్పించాలంటే మరో 15 రోజుల ఫీజు చెల్లిస్తే నేర్పుతామని చెప్పడంతో విధి లేక మరో రూ.4500 చెల్లించాడు. ఇలా వేలాది మంది నుంచి డ్రైవింగ్ నేర్పిస్తామని, అనుభవ పత్రాలు, లైసెన్స్ ఇప్పిస్తామని డ్రైవింగ్ స్కూల్స్ యాజమాన్యాలు రూ.లక్షల్లో దోపిడీ చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100/100
[ 27-07-2024]
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో భాగంగా జాబ్కార్డుదారులకు నూరు రోజుల పనిదినాలు కల్పించడంలో యాదాద్రి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
హద్దులు చెరిపి.. ఆక్రమించి..!
[ 27-07-2024]
నకిరేకల్ శివారులో 124 కి.మీ వద్ద ఏఎంఆర్పీ ప్రధాన కాల్వ భూమి హద్దురాళ్లను తొలగించి గట్టువెంట పడేశారు. భూమిని ఆక్రమించి సాగుచేసుకుంటున్నారు. -
చెత్తకుప్పలు.. రోగాలతో తిప్పలు
[ 27-07-2024]
పురపాలికల్లో రహదారుల పక్కనే చెత్తాచెదారం దర్శనమిస్తోంది. ఇంటింటా చెత్త సేకరణకు సిబ్బంది ప్రతి వీధిలో వాహనంతో పర్యటించి సేకరణ చేపట్టాల్సి ఉన్నా.. పూర్తిస్థాయిలో సేకరణ జరగడం లేదు. -
బంతే..భవిష్యత్తుగా..!
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్ క్రీడా సంగ్రామం మొదలైంది. ఈ పోటీల్లో మన దేశం నుంచి 117 మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు. -
నెలకో తీరు.. హుషారు
[ 27-07-2024]
చిన్నతనం నుంచే పిల్లల్లో మానసిక, శారీరక చురుకుదనం ఉండాలని తల్లిదండ్రులు తపన పడుతుంటారు. రకరకాల తినుబండారాలు, రంగుల బొమ్మలు చేతికిచ్చినా.. ఏదో తెలియని వెలితి వారి మనసును తొలిచేస్తుంటుంది. ఆ వెలితిని ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో పూడ్పించేసుకోవచ్చు. ఇక్కడ చిన్నారుల అభిరుచికి తగ్గట్టుగానే నిత్యం పోషకాహారం అందిస్తారు. ఆడిస్తారు. పాడిస్తారు. -
చేపా.. చేపా... చెరువుకు దూరమేనా..?
[ 27-07-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. మత్స్యకారుల జీవనోపాధి కోసం గత సర్కారు ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. -
బావిలోకి దిగి ఊపిరాడక మృతి
[ 27-07-2024]
బావిలోకి మోటారు మరమ్మతుల కోసం దిగిన రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో చోటు చేసుకుంది. -
స్వామి కల్యాణం.. అమ్మవారి ఊంజల్ సేవోత్సవం
[ 27-07-2024]
యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో ఆషాఢమాసం మూడో శుక్రవారం స్వామి, అమ్మవార్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఆచారంగా జరిగాయి. -
గోదావరి.. @ గోపీడాన్
[ 27-07-2024]
అమ్మాయిలు కేవలం వంటింటికే పరిమితమయ్యే రోజులు కావివి. అన్నింట్లో సగం, ఆకాశంలో..అవకాశాల్లో సగం అనే నినాదంతో ముందుకెళ్తున్న కాలం ఇది. -
వనాలపై దృష్టి.. సంపద సృష్టి
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రకృతి సంపద వనాలు లక్ష్యాలకు చేరువలో ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు సంపదను సృష్టించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయడానికి సంకల్పించారు. -
బస్తీ.. సైకిల్పై గస్తీ..!
[ 27-07-2024]
గతంలో పోలీస్ కానిస్టేబుళ్లు సైకిళ్లపైనే గస్తీ తిరిగే వారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా దశాబ్దాల నుంచి ద్విచక్రవాహనాలపై తిరుగుతున్నారు.. -
ఏ వీధి చూసినా.. భౌ..భౌ..
[ 27-07-2024]
నాలుగు నెలల క్రితం పహాడీనగర్లో ద్విచక్రవాహనంపై పిల్లలను స్కూల్కు దింపేందుకు వెళ్తున్న వ్యక్తిని కుక్కల గుంపు వెంబడించంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ