తడి పొడి.. తడబడి
చెత్తను వృథాగా పడవేయొద్దు.. చక్కగా వినియోగించుకుంటే ఆదాయం సమకూర్చుకోవచ్చని ప్రభుత్వం పంచాయతీలకు నిర్దేశించింది
నిరుపయోగంగా ఉన్న సెగ్రిగేషన్ షెడ్డు
ఆలేరు, న్యూస్టుడే: చెత్తను వృథాగా పడవేయొద్దు.. చక్కగా వినియోగించుకుంటే ఆదాయం సమకూర్చుకోవచ్చని ప్రభుత్వం పంచాయతీలకు నిర్దేశించింది. ఇందులో భాగంగా ప్రతీ పంచాయతీలో డంపింగ్ యార్డులు, సెగ్రిగేషన్ షెడ్లను ఏర్పాటు చేయించింది. తడి, పొడి చెత్త విభాగాలను నెలకొల్పారు. పొడి చెత్తలోని గాజు సీసాలు, కాగితాలు, అట్టముక్కలు, ఇనుప వ్యర్థాలను వేరు చేయాలి. తడి చెత్తను ప్రత్యేక పద్ధతిలో నిల్వచేసి కంపోస్ట్ ఎరువుగా మార్చాలి. దీనిని విక్రయించి ఆదాయం గడించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ ప్రక్రియ జిల్లాలో అంతంత మాత్రంగానే అమలవుతోంది.
ఆకతాయిలకు అడ్డాలుగా...
యాదాద్రి జిల్లాలో 421 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతీ పంచాయతీలో రూ.2.5 లక్షలతో కంపోస్ట్ షెడ్లను నిర్మించారు. ఇందుకోసం సుమారు రూ.10 కోట్లను ఖర్చు చేశారు. చెత్త సేకరణకు ట్రాక్టర్లు, కొన్ని పంచాయతీలకు రిక్షాలను కొనుగోలు చేశారు. తడి, పొడి చెత్త సేకరణకు ఇంటింటికి ప్రత్యేక బుట్టలు అందించారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ...షెడ్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో షెడ్లు వినియోగంలేక కొన్నిచోట్ల ఆకతాయిలకు, పేకాట రాయుళ్లకు, మందు బాబులకు అడ్డాగా మారుతున్నాయి.
గ్రామాల్లో ఏం జరుగుతోందంటే..
* కంపోస్ట్ షెడ్ల నిర్మాణం, వాటి వినియోగంపై పంచాయతీ అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నిర్వహణ భారం కావడంతో సుమారు ఐదు శాతం గ్రామాల్లో మాత్రమే ఎరువు తయారీ ప్రక్రియ కొనసాగుతోంది. మిగతా గ్రామాలు లక్ష్యానికి దూరంగా ఉన్నాయి.
* చాలా గ్రామాల్లో తడి, పొడి చెత్త సేకరణ వేర్వేరుగా కొనసాగడం లేదు. కొన్నిచోట్ల గ్రామస్థులు చెత్తను వేర్వేరు డబ్బాలలో వేసినప్పటికీ పంచాయతీల కార్మికులు మాత్రం ఒకే రిక్షాలో వేయడం వల్ల అవి కలిసి పోతున్నాయి. కొన్నిచోట్ల రహదారి పక్కన పేరుకుపోయిన చెత్తతో కలిపి అక్కడే కాల్చి వేస్తున్నారు.
* మరికొన్ని గ్రామాల్లో సేకరించిన చెత్తను కంపోస్ట్ షెడ్ల వద్దకు తీసుకెళ్లి నిల్వ చేస్తున్నారు. తడి చెత్తను, ఆహార వ్యర్థాలను నాడెపు కంపోస్ట్ షెడ్లలో వేసినప్పటికీ పేడ, మట్టిని వేయకపోవడం, నిత్యం నీటిని పట్టకపోవడంతో ఎండిపోయి వృథాగా మారుతున్నాయి.
ఎరువుల తయారీకి చర్యలు: ఎం.డి.సలీం, ఎంపీవో ఆలేరు
ఆలేరు మండలంలో కంపోస్ట్ షెడ్లలో ఎరువుల తయారీపై దృష్టి సారించాం. పంచాయతీ కార్యదర్శులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలు చేపట్టాం. ఎరువులు తయారు చేసేలా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100/100
[ 27-07-2024]
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో భాగంగా జాబ్కార్డుదారులకు నూరు రోజుల పనిదినాలు కల్పించడంలో యాదాద్రి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
హద్దులు చెరిపి.. ఆక్రమించి..!
[ 27-07-2024]
నకిరేకల్ శివారులో 124 కి.మీ వద్ద ఏఎంఆర్పీ ప్రధాన కాల్వ భూమి హద్దురాళ్లను తొలగించి గట్టువెంట పడేశారు. భూమిని ఆక్రమించి సాగుచేసుకుంటున్నారు. -
చెత్తకుప్పలు.. రోగాలతో తిప్పలు
[ 27-07-2024]
పురపాలికల్లో రహదారుల పక్కనే చెత్తాచెదారం దర్శనమిస్తోంది. ఇంటింటా చెత్త సేకరణకు సిబ్బంది ప్రతి వీధిలో వాహనంతో పర్యటించి సేకరణ చేపట్టాల్సి ఉన్నా.. పూర్తిస్థాయిలో సేకరణ జరగడం లేదు. -
బంతే..భవిష్యత్తుగా..!
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్ క్రీడా సంగ్రామం మొదలైంది. ఈ పోటీల్లో మన దేశం నుంచి 117 మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు. -
నెలకో తీరు.. హుషారు
[ 27-07-2024]
చిన్నతనం నుంచే పిల్లల్లో మానసిక, శారీరక చురుకుదనం ఉండాలని తల్లిదండ్రులు తపన పడుతుంటారు. రకరకాల తినుబండారాలు, రంగుల బొమ్మలు చేతికిచ్చినా.. ఏదో తెలియని వెలితి వారి మనసును తొలిచేస్తుంటుంది. ఆ వెలితిని ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో పూడ్పించేసుకోవచ్చు. ఇక్కడ చిన్నారుల అభిరుచికి తగ్గట్టుగానే నిత్యం పోషకాహారం అందిస్తారు. ఆడిస్తారు. పాడిస్తారు. -
చేపా.. చేపా... చెరువుకు దూరమేనా..?
[ 27-07-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. మత్స్యకారుల జీవనోపాధి కోసం గత సర్కారు ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. -
బావిలోకి దిగి ఊపిరాడక మృతి
[ 27-07-2024]
బావిలోకి మోటారు మరమ్మతుల కోసం దిగిన రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో చోటు చేసుకుంది. -
స్వామి కల్యాణం.. అమ్మవారి ఊంజల్ సేవోత్సవం
[ 27-07-2024]
యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో ఆషాఢమాసం మూడో శుక్రవారం స్వామి, అమ్మవార్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఆచారంగా జరిగాయి. -
గోదావరి.. @ గోపీడాన్
[ 27-07-2024]
అమ్మాయిలు కేవలం వంటింటికే పరిమితమయ్యే రోజులు కావివి. అన్నింట్లో సగం, ఆకాశంలో..అవకాశాల్లో సగం అనే నినాదంతో ముందుకెళ్తున్న కాలం ఇది. -
వనాలపై దృష్టి.. సంపద సృష్టి
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రకృతి సంపద వనాలు లక్ష్యాలకు చేరువలో ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు సంపదను సృష్టించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయడానికి సంకల్పించారు. -
బస్తీ.. సైకిల్పై గస్తీ..!
[ 27-07-2024]
గతంలో పోలీస్ కానిస్టేబుళ్లు సైకిళ్లపైనే గస్తీ తిరిగే వారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా దశాబ్దాల నుంచి ద్విచక్రవాహనాలపై తిరుగుతున్నారు.. -
ఏ వీధి చూసినా.. భౌ..భౌ..
[ 27-07-2024]
నాలుగు నెలల క్రితం పహాడీనగర్లో ద్విచక్రవాహనంపై పిల్లలను స్కూల్కు దింపేందుకు వెళ్తున్న వ్యక్తిని కుక్కల గుంపు వెంబడించంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం