అతివేగమే కారు ప్రమాదానికి కారణం
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పైవంతెనపై గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు నిర్ధారించారు.
‘పేట’లో ముగ్గురు యువకుల అంత్యక్రియలు పూర్తి
సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మృతదేహానికి నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి, తదితరులు
సూర్యాపేట నేరవిభాగం, న్యూస్టుడే: జిల్లా కేంద్రంలోని హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పైవంతెనపై గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు నిర్ధారించారు. పట్టణంలోని ఖమ్మం క్రాస్రోడ్డు వద్ద పైవంతెనపై హైదరాబాద్ నుంచి విజయవాడకు వాటర్ బాటిళ్ల లోడుతో మెల్లగా వెళ్తున్న డీసీఎం వాహనాన్ని కారు వెనుక నుంచి అతివేగంగా ఢీకొట్టడంతోనే సూర్యాపేటకు చెందిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారని చెబుతున్నారు. కారు నడుపుతున్న మహమ్మద్ నవీద్, వెన్న నిఖిల్రెడ్డి, బొమ్మగాని రాకేశ్గౌడ్ మృతిచెందారు. మరో యువకుడు సోమగాని ఆదిత్య అలియాస్ చందు గాయాలతో బయటపడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సూర్యాపేట ఇన్స్పెక్టర్ రాజశేఖర్ తెలిపారు.
మృతులంతా స్నేహితులే.. సూర్యాపేటలోని హైమానగర్కు చెందిన వెన్న సతీశ్రెడ్డి, మాధవి చిన్నకుమారుడు నిఖిల్రెడ్డి ఇంటీరియర్ గార్డెనింగ్ పూర్తి చేశారు. తండ్రికి బంగారు ఆభరణాల వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉంటున్నారు. నిఖిల్రెడ్డి, రాకేశ్గౌడ్ పాఠశాల స్థాయి నుంచి ప్రాణ స్నేహితులు. జాకీర్ హుస్సేన్నగర్కు చెందిన లారీ డ్రైవర్ సోమనర్సయ్య కుమారుడు రాకేశ్గౌడ్ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్నారు. ఈయనకు ఒక సోదరి ఉన్నారు. పొట్టిశ్రీరాములు సెంటర్కు చెందిన వాహనాల బ్యాటరీ దుకాణంలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న మొహినొద్దీన్ కుమారుడు మహమ్మద్ నవీద్తోపాటు కుమార్తె ఉన్నారు. నవీద్ స్థానికంగా ఒక మొబైల్ షోరూంలో మేనేజర్గా కొద్దికాలం పనిచేశారు. పదేళ్ల క్రితం వీరితో స్నేహం ఏర్పడింది. రంజాన్ సందర్భంగా స్నేహితులంతా కలిసి విందులో పాల్గొని తిరిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ఎమ్మెల్యే పరామర్శ..
సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని శవాగారం వద్ద ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి మృతుల కుటుంబాలను శుక్రవారం పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకొని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్ తదితరులు ఉన్నారు. నిఖిల్రెడ్డి అంత్యక్రియలు కాసరబాద సమీపంలోని సొంత వ్యవసాయ క్షేత్రంలో, నవీద్ అంత్యక్రియలు స్థానిక ఖబరస్థాన్లో, రాకేశ్గౌడ్ అంత్యక్రియలు రాజీవ్నగర్లోని శ్మశానవాటికలో అశ్రునయనాల మధ్య పూర్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100/100
[ 27-07-2024]
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో భాగంగా జాబ్కార్డుదారులకు నూరు రోజుల పనిదినాలు కల్పించడంలో యాదాద్రి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
హద్దులు చెరిపి.. ఆక్రమించి..!
[ 27-07-2024]
నకిరేకల్ శివారులో 124 కి.మీ వద్ద ఏఎంఆర్పీ ప్రధాన కాల్వ భూమి హద్దురాళ్లను తొలగించి గట్టువెంట పడేశారు. భూమిని ఆక్రమించి సాగుచేసుకుంటున్నారు. -
చెత్తకుప్పలు.. రోగాలతో తిప్పలు
[ 27-07-2024]
పురపాలికల్లో రహదారుల పక్కనే చెత్తాచెదారం దర్శనమిస్తోంది. ఇంటింటా చెత్త సేకరణకు సిబ్బంది ప్రతి వీధిలో వాహనంతో పర్యటించి సేకరణ చేపట్టాల్సి ఉన్నా.. పూర్తిస్థాయిలో సేకరణ జరగడం లేదు. -
బంతే..భవిష్యత్తుగా..!
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్ క్రీడా సంగ్రామం మొదలైంది. ఈ పోటీల్లో మన దేశం నుంచి 117 మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు. -
నెలకో తీరు.. హుషారు
[ 27-07-2024]
చిన్నతనం నుంచే పిల్లల్లో మానసిక, శారీరక చురుకుదనం ఉండాలని తల్లిదండ్రులు తపన పడుతుంటారు. రకరకాల తినుబండారాలు, రంగుల బొమ్మలు చేతికిచ్చినా.. ఏదో తెలియని వెలితి వారి మనసును తొలిచేస్తుంటుంది. ఆ వెలితిని ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో పూడ్పించేసుకోవచ్చు. ఇక్కడ చిన్నారుల అభిరుచికి తగ్గట్టుగానే నిత్యం పోషకాహారం అందిస్తారు. ఆడిస్తారు. పాడిస్తారు. -
చేపా.. చేపా... చెరువుకు దూరమేనా..?
[ 27-07-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. మత్స్యకారుల జీవనోపాధి కోసం గత సర్కారు ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. -
బావిలోకి దిగి ఊపిరాడక మృతి
[ 27-07-2024]
బావిలోకి మోటారు మరమ్మతుల కోసం దిగిన రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో చోటు చేసుకుంది. -
స్వామి కల్యాణం.. అమ్మవారి ఊంజల్ సేవోత్సవం
[ 27-07-2024]
యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో ఆషాఢమాసం మూడో శుక్రవారం స్వామి, అమ్మవార్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఆచారంగా జరిగాయి. -
గోదావరి.. @ గోపీడాన్
[ 27-07-2024]
అమ్మాయిలు కేవలం వంటింటికే పరిమితమయ్యే రోజులు కావివి. అన్నింట్లో సగం, ఆకాశంలో..అవకాశాల్లో సగం అనే నినాదంతో ముందుకెళ్తున్న కాలం ఇది. -
వనాలపై దృష్టి.. సంపద సృష్టి
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రకృతి సంపద వనాలు లక్ష్యాలకు చేరువలో ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు సంపదను సృష్టించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయడానికి సంకల్పించారు. -
బస్తీ.. సైకిల్పై గస్తీ..!
[ 27-07-2024]
గతంలో పోలీస్ కానిస్టేబుళ్లు సైకిళ్లపైనే గస్తీ తిరిగే వారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా దశాబ్దాల నుంచి ద్విచక్రవాహనాలపై తిరుగుతున్నారు.. -
ఏ వీధి చూసినా.. భౌ..భౌ..
[ 27-07-2024]
నాలుగు నెలల క్రితం పహాడీనగర్లో ద్విచక్రవాహనంపై పిల్లలను స్కూల్కు దింపేందుకు వెళ్తున్న వ్యక్తిని కుక్కల గుంపు వెంబడించంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే