పట్టభద్రులకు ఆనందమే
వరంగల్- నల్గొండ- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ వచ్చే నెల చివరి వారంలో ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు
ఈనాడు, నల్గొండ : వరంగల్- నల్గొండ- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ వచ్చే నెల చివరి వారంలో ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికను జూన్ 9లోపు పూర్తి చేయాల్సి ఉన్నందునా.. ఈ నెల 20 లోపే షెడ్యూల్ వచ్చే అవకాశముందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఓటరు తుది జాబితా ప్రకటన పూర్తి అయింది. ఎన్నికల ఏర్పాట్లు సైతం తుది దశకు చేరాయి. సుమారు నాలుగు నెలల పాటూ సాగిన ఓటరు నమోదు ప్రక్రియలో అన్ని పార్టీలు చురుగ్గా పాల్గొన్నాయి. గడువు ముగిసే నాటికి మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. 2021 మార్చిలో జరిగిన ఈ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలపొందారు. దీంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికలకు నల్గొండ కలెక్టర్ దాసరి హరిచందన రిటర్నింగ్ అధికారి (ఆర్వో)గా వ్యవహరించనున్నారు. నియోజకవర్గ పరిధిలోని సిద్ధిపేట, సూర్యాపేట, యాదాద్రి, జనగామ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి, ఖమ్మం, ములుగు జిల్లాల కలెక్టర్లు అసిస్టెంట్ ఆర్వోలుగా వ్యవహరిస్తారు.
అభ్యర్థుల వేటలో ప్రధాన పార్టీలు
ప్రస్తుతం లోక్సభ ఎన్నికలకు ప్రధాన పార్టీలు ముమ్మర ప్రచారానికి కసరత్తు చేస్తుండగా..పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సైతం ఎవరిని బరిలోకి దింపితే విజయావకాశాలుంటాయనే దానిపై వివిధ వర్గాల ద్వారా సమాచార సేకరణ చేస్తున్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసి ద్వితీయ స్థానంలో నిలిచిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్కుమార్ మరోసారి బరిలోకి దిగడం ఖాయంగా మారింది. ప్రస్తుతం కరీంనగర్ నుంచి అధికార కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్న మల్లన్నకు అది దక్కకుంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ మద్దతిచ్చే అవకాశముందని తెలిసింది. ప్రతిపక్ష భారాస నుంచి సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన ఒంటెద్దు నర్సింహారెడ్డితో పాటూ వరంగల్ జిల్లాకు చెందిన రాకేశ్రెడ్డి సైతం బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. భాజపా నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి పోటీ చేస్తారా లేదంటే కొత్త అభ్యర్థి రంగంలోకి వస్తారన్నది ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత స్పష్టం కానుంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు భారాస ఇప్పటి నుంచి గెలుపుగుర్రాన్ని అన్వేషిస్తుండగా...ఈ దఫా ఎలాగైనా ఈ నియోజకవర్గంలో పాగా వేసేందుకు రెండు ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. తొలి ప్రాధాన్యంగా లోక్సభ ఎన్నికలు ఉండటంతో షెడ్యూల్ విడుదలైనా వచ్చే నెల 13న లోక్సభ పోలింగ్ తర్వాతే ఈ ఎన్నికలపై అన్ని పార్టీలు దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100/100
[ 27-07-2024]
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో భాగంగా జాబ్కార్డుదారులకు నూరు రోజుల పనిదినాలు కల్పించడంలో యాదాద్రి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
హద్దులు చెరిపి.. ఆక్రమించి..!
[ 27-07-2024]
నకిరేకల్ శివారులో 124 కి.మీ వద్ద ఏఎంఆర్పీ ప్రధాన కాల్వ భూమి హద్దురాళ్లను తొలగించి గట్టువెంట పడేశారు. భూమిని ఆక్రమించి సాగుచేసుకుంటున్నారు. -
చెత్తకుప్పలు.. రోగాలతో తిప్పలు
[ 27-07-2024]
పురపాలికల్లో రహదారుల పక్కనే చెత్తాచెదారం దర్శనమిస్తోంది. ఇంటింటా చెత్త సేకరణకు సిబ్బంది ప్రతి వీధిలో వాహనంతో పర్యటించి సేకరణ చేపట్టాల్సి ఉన్నా.. పూర్తిస్థాయిలో సేకరణ జరగడం లేదు. -
బంతే..భవిష్యత్తుగా..!
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్ క్రీడా సంగ్రామం మొదలైంది. ఈ పోటీల్లో మన దేశం నుంచి 117 మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు. -
నెలకో తీరు.. హుషారు
[ 27-07-2024]
చిన్నతనం నుంచే పిల్లల్లో మానసిక, శారీరక చురుకుదనం ఉండాలని తల్లిదండ్రులు తపన పడుతుంటారు. రకరకాల తినుబండారాలు, రంగుల బొమ్మలు చేతికిచ్చినా.. ఏదో తెలియని వెలితి వారి మనసును తొలిచేస్తుంటుంది. ఆ వెలితిని ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో పూడ్పించేసుకోవచ్చు. ఇక్కడ చిన్నారుల అభిరుచికి తగ్గట్టుగానే నిత్యం పోషకాహారం అందిస్తారు. ఆడిస్తారు. పాడిస్తారు. -
చేపా.. చేపా... చెరువుకు దూరమేనా..?
[ 27-07-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. మత్స్యకారుల జీవనోపాధి కోసం గత సర్కారు ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. -
బావిలోకి దిగి ఊపిరాడక మృతి
[ 27-07-2024]
బావిలోకి మోటారు మరమ్మతుల కోసం దిగిన రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో చోటు చేసుకుంది. -
స్వామి కల్యాణం.. అమ్మవారి ఊంజల్ సేవోత్సవం
[ 27-07-2024]
యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో ఆషాఢమాసం మూడో శుక్రవారం స్వామి, అమ్మవార్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఆచారంగా జరిగాయి. -
గోదావరి.. @ గోపీడాన్
[ 27-07-2024]
అమ్మాయిలు కేవలం వంటింటికే పరిమితమయ్యే రోజులు కావివి. అన్నింట్లో సగం, ఆకాశంలో..అవకాశాల్లో సగం అనే నినాదంతో ముందుకెళ్తున్న కాలం ఇది. -
వనాలపై దృష్టి.. సంపద సృష్టి
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రకృతి సంపద వనాలు లక్ష్యాలకు చేరువలో ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు సంపదను సృష్టించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయడానికి సంకల్పించారు. -
బస్తీ.. సైకిల్పై గస్తీ..!
[ 27-07-2024]
గతంలో పోలీస్ కానిస్టేబుళ్లు సైకిళ్లపైనే గస్తీ తిరిగే వారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా దశాబ్దాల నుంచి ద్విచక్రవాహనాలపై తిరుగుతున్నారు.. -
ఏ వీధి చూసినా.. భౌ..భౌ..
[ 27-07-2024]
నాలుగు నెలల క్రితం పహాడీనగర్లో ద్విచక్రవాహనంపై పిల్లలను స్కూల్కు దింపేందుకు వెళ్తున్న వ్యక్తిని కుక్కల గుంపు వెంబడించంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్