ఇంకిన కన్నీళ్లు ఇంకెన్నో..!
యాదాద్రి జిల్లా గుండాల ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినితో పాటు మూడో తరగతి చదువుతున్న ఇద్దరు చిన్నారులతో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గత ఆరు నెలలుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.
యాదాద్రి జిల్లా గుండాల ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినితో పాటు మూడో తరగతి చదువుతున్న ఇద్దరు చిన్నారులతో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గత ఆరు నెలలుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. మనవరాలి వయసున్న ఆ విద్యార్థినులను తన కార్యాలయానికి పిలిపించుకొని అసభ్య చేష్టలతో ఇబ్బంది పెట్టడమే కాక ఎవరికీ చెప్పొద్దని బెదిరిస్తుండటంతో తమ గోడు తల్లిదండ్రులకు చెప్పుకున్నారు. విద్యార్థినుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రధానోపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
‘ఈ నెల 3న కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శట్పల్లి ఉన్నత పాఠశాలలో షీటీం బృందం బాల బాలికలకు సైబర్ నేరాలు, లైంగిక వేధింపులు, మంచి, చెడు స్పర్శ (గుడ్, బ్యాడ్ టచ్) గురించి అవగాహన కల్పించారు. ఆ సమయంలో ఓ బాధిత విద్యార్థిని ఉపాధ్యాయుడి అరాచకాలపై ఫిర్యాదు చేసింది. తెలుగు ఉపాధ్యాయుడు గత కొంత కాలంగా తనపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని గోడు వెల్లబోసుకుంది. పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు.
నాంపల్లి, న్యూస్టుడే: ఆప్యాయంగా పలకరిస్తే పొంగిపోయే పసితనం. పిలుపు వెనుక దాగిన వికృతాలను అర్థం చేసుకోలేని అమాయకత్వం. అభం శుభం తెలియని చిన్నారులు ప్రబుద్ధుల చేతిలో బలవుతున్నారు. తమపై జరుగుతున్న ఆకృత్యాలు బయటకు చెప్పేందుకు జంకుతున్నారు. విద్యార్థికి, ఉపాధ్యాయుడికి ఉన్న సంబంధం వేదాలకాలం నాటిది.. చాలా పవిత్రమైంది. ఉపాధ్యాయులంటే తరగతి గదిలో పాఠాలు బోధించే వారు మాత్రమే కాదు.. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపి, జ్ఞానాన్ని అందించి, పిల్లల ఆలోచనలను తీర్చిదిద్దే గొప్ప హోదా ఉపాధ్యాయులకు ఉంది. విద్యాబుద్ధులు చెప్పాల్సిన కొందరు ఉపాధ్యాయులు వికృత చేష్టలకు పాల్పడుతూ తమ హోదాను దుర్వినియోగం చేస్తున్న తీరు సమాజంలో చర్చనీయాంశంగా మారుతోంది.
విషపు నీడలో..
పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ చిన్నారులపై లైంగిక వేధింపులు ఏటా పెరుగుతున్నాయి. నిందితుల్లో బాధితులకు తెలిసిన వ్యక్తులే 70-80 శాతం వరకు ఉంటున్నారు. నిత్యం ఏదో ఒక రూపంలో వేధింపులు చవిచూస్తూ బయటకు చెప్పేందుకు వెనకాడుతున్నా బాలికలు ఉన్నారు. పేద వర్గాలు పిల్లలు నివసించే ప్రాంతాలు, వలస కుటుంబాల్లోని పిల్లలు ఎక్కువగా వేధింపులకు గురవుతున్నట్లు తాము గుర్తించామని ఓ స్వచ్ఛంద సంస్థ మహిళా ప్రతినిధి తెలిపారు. బాల కార్మికులుగా మారుతున్న వారిలో బాలికలు ఉన్నారు. వీరిలో 30-40 శాతం మంది లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు ఓ స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో గుర్తించారు. పట్టణాల్లోని మురికి వాడలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్వచ్ఛంద సంస్థలు, వైద్యులు, కౌన్సెలింగ్ సైకాలజిస్టుల ఆధ్వర్యంలో లైంగిక వేధింపులు, గృహ హింస వంటి సున్నితమైన అంశాలను బాలికలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100/100
[ 27-07-2024]
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో భాగంగా జాబ్కార్డుదారులకు నూరు రోజుల పనిదినాలు కల్పించడంలో యాదాద్రి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
హద్దులు చెరిపి.. ఆక్రమించి..!
[ 27-07-2024]
నకిరేకల్ శివారులో 124 కి.మీ వద్ద ఏఎంఆర్పీ ప్రధాన కాల్వ భూమి హద్దురాళ్లను తొలగించి గట్టువెంట పడేశారు. భూమిని ఆక్రమించి సాగుచేసుకుంటున్నారు. -
చెత్తకుప్పలు.. రోగాలతో తిప్పలు
[ 27-07-2024]
పురపాలికల్లో రహదారుల పక్కనే చెత్తాచెదారం దర్శనమిస్తోంది. ఇంటింటా చెత్త సేకరణకు సిబ్బంది ప్రతి వీధిలో వాహనంతో పర్యటించి సేకరణ చేపట్టాల్సి ఉన్నా.. పూర్తిస్థాయిలో సేకరణ జరగడం లేదు. -
బంతే..భవిష్యత్తుగా..!
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్ క్రీడా సంగ్రామం మొదలైంది. ఈ పోటీల్లో మన దేశం నుంచి 117 మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు. -
నెలకో తీరు.. హుషారు
[ 27-07-2024]
చిన్నతనం నుంచే పిల్లల్లో మానసిక, శారీరక చురుకుదనం ఉండాలని తల్లిదండ్రులు తపన పడుతుంటారు. రకరకాల తినుబండారాలు, రంగుల బొమ్మలు చేతికిచ్చినా.. ఏదో తెలియని వెలితి వారి మనసును తొలిచేస్తుంటుంది. ఆ వెలితిని ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో పూడ్పించేసుకోవచ్చు. ఇక్కడ చిన్నారుల అభిరుచికి తగ్గట్టుగానే నిత్యం పోషకాహారం అందిస్తారు. ఆడిస్తారు. పాడిస్తారు. -
చేపా.. చేపా... చెరువుకు దూరమేనా..?
[ 27-07-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. మత్స్యకారుల జీవనోపాధి కోసం గత సర్కారు ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. -
బావిలోకి దిగి ఊపిరాడక మృతి
[ 27-07-2024]
బావిలోకి మోటారు మరమ్మతుల కోసం దిగిన రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో చోటు చేసుకుంది. -
స్వామి కల్యాణం.. అమ్మవారి ఊంజల్ సేవోత్సవం
[ 27-07-2024]
యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో ఆషాఢమాసం మూడో శుక్రవారం స్వామి, అమ్మవార్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఆచారంగా జరిగాయి. -
గోదావరి.. @ గోపీడాన్
[ 27-07-2024]
అమ్మాయిలు కేవలం వంటింటికే పరిమితమయ్యే రోజులు కావివి. అన్నింట్లో సగం, ఆకాశంలో..అవకాశాల్లో సగం అనే నినాదంతో ముందుకెళ్తున్న కాలం ఇది. -
వనాలపై దృష్టి.. సంపద సృష్టి
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రకృతి సంపద వనాలు లక్ష్యాలకు చేరువలో ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు సంపదను సృష్టించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయడానికి సంకల్పించారు. -
బస్తీ.. సైకిల్పై గస్తీ..!
[ 27-07-2024]
గతంలో పోలీస్ కానిస్టేబుళ్లు సైకిళ్లపైనే గస్తీ తిరిగే వారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా దశాబ్దాల నుంచి ద్విచక్రవాహనాలపై తిరుగుతున్నారు.. -
ఏ వీధి చూసినా.. భౌ..భౌ..
[ 27-07-2024]
నాలుగు నెలల క్రితం పహాడీనగర్లో ద్విచక్రవాహనంపై పిల్లలను స్కూల్కు దింపేందుకు వెళ్తున్న వ్యక్తిని కుక్కల గుంపు వెంబడించంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట