నీతి పాఠాల ఊసేది..?
జీవిత కాలంలో బాల్యదశ ఎంతో ముఖ్యమైంది. ఆ వయసులో క్రమశిక్షణతో కూడిన చదువు ఎవరికి అలవడుతుందో వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. కానీ, పాఠశాలల్లో ఎక్కడ చూసినా నీతి పాఠాలు ఊసే లేకుండా పోతోంది.
విద్యార్థుల్లో కొరవడుతున్న వ్యక్తిత్వ వికాసం
సూర్యాపేట: సత్రం బజారులోని పాఠశాలలో నిజాయతీ పెట్టెలో పెన్ను వేస్తున్న విద్యార్థిని
ఈనాడు డిజిటల్, సూర్యాపేట: జీవిత కాలంలో బాల్యదశ ఎంతో ముఖ్యమైంది. ఆ వయసులో క్రమశిక్షణతో కూడిన చదువు ఎవరికి అలవడుతుందో వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. కానీ, పాఠశాలల్లో ఎక్కడ చూసినా నీతి పాఠాలు ఊసే లేకుండా పోతోంది. విద్యార్థులు కేవలం పాఠాలకే పరిమితమవుతుండటంతో వారిలో వ్యక్తిత్వ వికాసం కొరవడుతోంది.
పొదుపు మాట మరిచారు..
ప్రస్తుతం స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఏవిధంగా నగదు భద్రం చేసుకుంటున్నారో అదే తరహాలో ఈ బాలసంఘాలు కొనసాగాలన్నది ఉద్దేశం. విద్యార్థి దశ నుంచి పొదుపు అలవాటు చేసేందుకు రూపకల్పన చేసినదే సంచాయక పథకం. విద్యార్థులు సొమ్మును పొదుపు చేస్తే ప్రోత్సాహం అందించే కార్యక్రమాలు ప్రస్తుతం ఏ పాఠశాలలోనూ జరగడం లేదు. దీంతో విద్యార్థుల్లో పొదుపు చేసే గుణం కొరవడుతోంది.
నిజాయతీ పెట్టె జాడేది..?
విద్యార్థులకు చిన్నతనం నుంచి మంచి లక్షణాలు అలవాటు చేస్తే భవిష్యత్తులో మంచి వ్యక్తులుగా నిలుస్తారు. పాఠశాలల్లో దొరికిన వస్తువులను అక్కడి నిజాయతీ పెట్టెలో వేసేందుకు వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంది. విద్యార్థులకు నిజాయతీ అలవర్చుకోవడానికి ఏర్పాటు చేయాల్సిన పెట్టెలు జాడ విద్యాలయాల్లో కనిపించడం లేదు.
బాలల సంఘాలు లేవు..
బాలల హక్కులు, పత్రికల నుంచి సమాచార సేకరణ, పచ్చదనం పరిశుభ్రత, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, గ్రంథాలయాల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు బాలల సంఘాలు ఏర్పాటు చేసేవారు. ఈ సంఘాల ద్వారా వారిలో చక్కని నాయకత్వ లక్షణాలు బలపడతాయి. అయితే ప్రస్తుతం ఏ పాఠశాలలోనూ వీటి ఊసే లేదు.
కానరాని తపాలా పెట్టె
తరగతి గదిలో జరిగే ఘటనలు, బోధన తీరు మధ్యాహ్న భోజనం నాణ్యత, వింతలు, విశేషాలపై రాసిన ఉత్తరాలను విద్యార్థులు పాఠశాలలో ఏర్పాటు చేసిన తపాలా పెట్టెలో వేసేవారు. ప్రస్తుతం వాటి వినియోగం ఎక్కడా కనిపించడం లేదు. ఫలితంగా ఉత్తరాలు రాసే నైపుణ్యం విద్యార్థుల్లో కొరవడుతోంది.
అన్ని పాఠశాలల్లో అమలు చేస్తాం
- అశోక్, జిల్లా విద్యాశాఖ అధికారి, సూర్యాపేట
సహపాఠ్యాంశాలు అన్ని పాఠశాలల్లో బోధించాలి. కొన్ని బడుల్లోనే ఇవి అమలవుతున్నాయి. వీటి అమలుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. మండలాల విద్యాశాఖ అధికారులకు సూచనలిస్తాం. అన్ని పాఠశాలల్లో అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100/100
[ 27-07-2024]
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో భాగంగా జాబ్కార్డుదారులకు నూరు రోజుల పనిదినాలు కల్పించడంలో యాదాద్రి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
హద్దులు చెరిపి.. ఆక్రమించి..!
[ 27-07-2024]
నకిరేకల్ శివారులో 124 కి.మీ వద్ద ఏఎంఆర్పీ ప్రధాన కాల్వ భూమి హద్దురాళ్లను తొలగించి గట్టువెంట పడేశారు. భూమిని ఆక్రమించి సాగుచేసుకుంటున్నారు. -
చెత్తకుప్పలు.. రోగాలతో తిప్పలు
[ 27-07-2024]
పురపాలికల్లో రహదారుల పక్కనే చెత్తాచెదారం దర్శనమిస్తోంది. ఇంటింటా చెత్త సేకరణకు సిబ్బంది ప్రతి వీధిలో వాహనంతో పర్యటించి సేకరణ చేపట్టాల్సి ఉన్నా.. పూర్తిస్థాయిలో సేకరణ జరగడం లేదు. -
బంతే..భవిష్యత్తుగా..!
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్ క్రీడా సంగ్రామం మొదలైంది. ఈ పోటీల్లో మన దేశం నుంచి 117 మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు. -
నెలకో తీరు.. హుషారు
[ 27-07-2024]
చిన్నతనం నుంచే పిల్లల్లో మానసిక, శారీరక చురుకుదనం ఉండాలని తల్లిదండ్రులు తపన పడుతుంటారు. రకరకాల తినుబండారాలు, రంగుల బొమ్మలు చేతికిచ్చినా.. ఏదో తెలియని వెలితి వారి మనసును తొలిచేస్తుంటుంది. ఆ వెలితిని ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో పూడ్పించేసుకోవచ్చు. ఇక్కడ చిన్నారుల అభిరుచికి తగ్గట్టుగానే నిత్యం పోషకాహారం అందిస్తారు. ఆడిస్తారు. పాడిస్తారు. -
చేపా.. చేపా... చెరువుకు దూరమేనా..?
[ 27-07-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. మత్స్యకారుల జీవనోపాధి కోసం గత సర్కారు ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. -
బావిలోకి దిగి ఊపిరాడక మృతి
[ 27-07-2024]
బావిలోకి మోటారు మరమ్మతుల కోసం దిగిన రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో చోటు చేసుకుంది. -
స్వామి కల్యాణం.. అమ్మవారి ఊంజల్ సేవోత్సవం
[ 27-07-2024]
యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో ఆషాఢమాసం మూడో శుక్రవారం స్వామి, అమ్మవార్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఆచారంగా జరిగాయి. -
గోదావరి.. @ గోపీడాన్
[ 27-07-2024]
అమ్మాయిలు కేవలం వంటింటికే పరిమితమయ్యే రోజులు కావివి. అన్నింట్లో సగం, ఆకాశంలో..అవకాశాల్లో సగం అనే నినాదంతో ముందుకెళ్తున్న కాలం ఇది. -
వనాలపై దృష్టి.. సంపద సృష్టి
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రకృతి సంపద వనాలు లక్ష్యాలకు చేరువలో ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు సంపదను సృష్టించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయడానికి సంకల్పించారు. -
బస్తీ.. సైకిల్పై గస్తీ..!
[ 27-07-2024]
గతంలో పోలీస్ కానిస్టేబుళ్లు సైకిళ్లపైనే గస్తీ తిరిగే వారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా దశాబ్దాల నుంచి ద్విచక్రవాహనాలపై తిరుగుతున్నారు.. -
ఏ వీధి చూసినా.. భౌ..భౌ..
[ 27-07-2024]
నాలుగు నెలల క్రితం పహాడీనగర్లో ద్విచక్రవాహనంపై పిల్లలను స్కూల్కు దింపేందుకు వెళ్తున్న వ్యక్తిని కుక్కల గుంపు వెంబడించంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి