బోరున విలాపం..!
వేసవిలో భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు ఎండిపోతున్నాయి. బత్తాయి, నిమ్మ తోటలను రక్షించుకొనేందుకు రైతులు చేస్తున్న భగీరథ ప్రయత్నాలు విఫలమవుతున్నాయి.
ఎండుతున్న తోటలు..
3 నెలల్లో 26 బోర్లు వేసిన రైతు
ఎండుతున్న బత్తాయి తోట
తిప్పర్తి, న్యూస్టుడే: వేసవిలో భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు ఎండిపోతున్నాయి. బత్తాయి, నిమ్మ తోటలను రక్షించుకొనేందుకు రైతులు చేస్తున్న భగీరథ ప్రయత్నాలు విఫలమవుతున్నాయి.రూ.లక్షలు ఖర్చు చేసి కొత్తగా బోర్లు వేస్తున్నా నీటి జాడలేక ఆర్థికంగా నష్టపోతున్నారు. అనేక గ్రామాల్లో తోటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. వడబడుతున్న తోటలను కాపాడుకునేందుకు సుమారుగా 5 నుంచి 10 బోర్ల వరకు వేశారు. జొన్నగడ్డలగూడకు చెందిన రైతు కుందూరు రాఘవరెడ్డి ఏకంగా 26 బోర్ల వరకు వేసినా ప్రయోజనంలేకుండా పోయింది. జిల్లాలో బత్తాయి 60 వేల ఎకరాలు, నిమ్మ 12 వేల ఎకరాలకు పైగా సాగవుతోంది. తిప్పర్తి మండలంలోనే బత్తాయి 2,200 ఎకరాలు, నిమ్మ 450 ఎకరాల్లో ఉంది. రాజుపేట, జొన్నగడ్డలగూడ, ఇండ్లూరు, మామిడాల, ఎర్రగడ్డలగూడ, పజ్జూరు, మర్రిగూడ, సిలార్మియాగూడ, తిప్పర్తి, గడ్డికొండారం, అనిశెట్టిదుప్పలపల్లి, అంతయ్యగూడ తదితర గ్రామాల్లో రైతులు ఎక్కువగా బత్తాయి, నిమ్మ, మామిడి తోటలు సాగుచేస్తున్నారు. ఒక్కో రైతు 10 నుంచి 20 సంవత్సరాల తోటలను కలిగి ఉండటంతో వాటిని రక్షించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. నెల రోజుల్లోనే మండలంలో రైతులు సుమారు 300లకు పైగా బోర్లు వేసినట్లు అధికారులు తెలిపారు. కొందరు రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి తోటలను రక్షించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఎర్రగడ్డలగూడ గ్రామంలో కన్నెకంటి జానయ్య, ఎల్లయ్య, రవి, రాములు, పెద్ద జానయ్య తదితరులు ఒక్కొక్కరూ ఆరు బోర్ల వరకూ వేసినా చుక్కనీరు పడలేదు. దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
రూ. 20 లక్షలతో 26 బోర్లు
కుందూరు రాఘవరెడ్డి, రైతు జొన్నలగడ్డ
నేను 20 ఎకరాల్లో బత్తాయి, నిమ్మ తోటలను సాగుచేస్తున్నా. గత 15 ఏళ్లుగా కంటికి రెప్పలా తోటలను కాపాడుకుంటూ వచ్చా. 10 ఏళ్లుగా తోట దిగుబడులను అందిస్తోంది. భూగర్భ జలాలు అడుగంటడంతో వేసిన 6 బోర్లలో 3 పూర్తిగా ఎండిపోయాయి. మరో 3 బోర్లు సన్నటి ధార పోస్తుండటంతో తోట మొత్తానికి నీటి సరఫరా సరిపోవడంలేదు. తోటను ఎలాగైనా రక్షించాలన్న ఆశతో 3 నెలల వ్యవధిలో రూ.20 లక్షలు ఖర్చుచేసి ఒక్కొక్కటిగా వేస్తూ మొత్తం 26 బోర్లు కొత్తగా వేశా. ఈ 26 బోర్లలో కేవలం 3 బోర్లు సన్నటి ధారతో ఆగి ఆగి పోస్తున్నాయి. అధికారుల సూచన మేరకు నేను వ్యవసాయక్షేత్రంలో రూ.75 వేల ఖర్చుతో ఫాంపాండ్ను ఏర్పాటు చేసుకున్నా. బోర్లు పోస్తున్న సన్నటి ధారను పైపు ద్వారా ఫాంపాండ్లోకి నింపుకొని.. అక్కడి నుంచి మరో మోటార్ ద్వారా ప్రత్యేక పైపులైన్ను ఏర్పాటు చేసుకొని తోటను బతికించుకుంటున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పంటల పరిశీలన
[ 26-07-2024]
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఏరువాక కేంద్రం వారు జిల్లాలోని పలు ప్రాంతాలలో ప్రత్తి, కంది, వరి పంటలను పరిశీలించారు. -
బడ్జెట్ కేటాయింపులపై విద్యార్థుల నిరసన
[ 26-07-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు నిధులు కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు. -
విద్యా రంగానికి తీవ్ర అన్యాయం
[ 26-07-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో విద్యా రంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు చింతల శివ అన్నారు. -
కలెక్టర్ కార్యాలయంలో గిరిజనుల డిమాండ్లపై వినతిపత్రం అందజేత
[ 26-07-2024]
కలెక్టర్ కార్యాలయంలో భాజపా గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు అజ్మీర కిషన్ నాయక్ ఆధ్వర్యంలో గిరిజనుల డిమాండ్లపై వినతి పత్రం అందజేశారు. -
నిధులన్నీ నీళ్లకే..!
[ 26-07-2024]
ఏళ్లుగా నిర్మాణం కొనసాగుతున్న ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఏఎమ్మార్ - ఎస్ఎల్బీసీ)కి మహర్దశ పట్టనుంది. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి హామీ ఇచ్చినట్లుగానే ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ఈ ఆర్థిక సంవత్సరానికి (2024-2025) ప్రవేశపెట్టిన -
కాల్వలపై నిర్లక్ష్యం.. కనుమరుగైన లక్ష్యం
[ 26-07-2024]
ఏఎమ్మార్పీ కాల్వలు నిర్మించి దశాబ్దన్నర దాటిపోయింది. అప్పటి నుంచి కాల్వలకు మరమ్మతులు మరిచిపోయారు. దీంతో కాల్వలు పొదలతో నిండిపోయి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. -
సరిహద్దులో సైనికుడు.. భారత్కు రక్షకుడు
[ 26-07-2024]
భారత సైన్యం సాధించిన విజయాల్లో కార్గిల్ యుద్ధం అతి ముఖ్యమైనది. కశ్మీర్ను ఆక్రమించుకునేందుకు పాకిస్థాన్పై 1999 మే 3న ప్రారంభమైన యుద్ధం 73 రోజుల పాటు సాగింది. -
బడ్జెట్పై ఎవరేమన్నారంటే..!
[ 26-07-2024]
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని తాజా బడ్జెట్తో తేలిపోయింది. ఇది తిరోగమన బడ్జెట్. ఆరు గ్యారంటీలను అటకెక్కించేలా ఉంది. -
పల్లె నుంచే సాగాలి.. పతకాల వేట
[ 26-07-2024]
విశ్వ క్రీడా సంబరాలు శుక్రవారం నుంచి ఆరంభమవుతున్నాయి. పారిస్ వేదికగా జరగనున్న ఈ క్రీడా పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా 206 దేశాల నుంచి దాదాపు 10 వేల మంది క్రీడా దిగ్గజాలు పాల్గొంటున్నారు. -
నీటికుంటలో పడి బాలుడి మృతి
[ 26-07-2024]
నీటికుంటలో పడి బాలుడు మృతి చెందిన ఘటన నూతనకల్ మండలంలోని బిక్కుమళ్లలో గురువారం జరిగింది. గ్రామస్థులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. -
గృహ జ్యోతికి ఇంకా ఎన్ని రోజులో..!
[ 26-07-2024]
గృహజ్యోతి పథకానికి కొంత మంది లబ్ధిదారుల దూరంగా ఉంటున్నారు. కొన్ని సమస్యల కారణంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును పొందలేక అష్టకష్టాలు పడుతున్నారు. -
గంజాయిపై ఉక్కుపాదం..!
[ 26-07-2024]
సూర్యాపేట జిల్లాలో గంజాయి వినియోగం, రవాణా చేస్తున్న సుమారు 250 మందిపై పోలీసులు హిస్టరీ షీటర్ (నేర చరిత్ర కలిగిన వ్యక్తిగా) రికార్డుల్లో పేర్లు నమోదు చేసే ప్రక్రియ ప్రారంభించారు. -
ఈ ఏడాదే వైద్య కళాశాల ఏర్పాటు
[ 26-07-2024]
యాదాద్రి ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుకు జాతీయ వైద్యమండలి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఎన్ఎంసీ బృందం పరోక్ష తనిఖీ సందర్భంగా లేవనెత్తిన అభ్యంతరాలు -
కదులుతున్న దస్త్రాలు.. ఆపేందుకు పైరవీలు
[ 26-07-2024]
రాష్ట్రంలో ఆర్జేసీ హోదా కలిగిన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి, వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయాలకు చెందిన ఉద్యోగులతో పాటు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేరు: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్