ఊపందుకున్న ప్రచారం
నల్గొండ- వరంగల్-ఖమ్మం పట్టుభద్రుల స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు ప్రచారం ఊపందుకుంది. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ప్రచార గడువు ఈ నెల 25వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకే ముగుస్తుంది.
భువనగిరి, న్యూస్టుడే: నల్గొండ- వరంగల్-ఖమ్మం పట్టుభద్రుల స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు ప్రచారం ఊపందుకుంది. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ప్రచార గడువు ఈ నెల 25వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకే ముగుస్తుంది. ఇంకా నాలుగు రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరంగా చేశాయి. మొత్తం 52 మంది రంగంలో ఉండగా.. ప్రధాన పార్టీలు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, భాజపా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిల మధ్య పోటీ ఉంది. నియోజకవర్గ కేంద్రాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రేమేందర్రెడ్డి, తీన్మార్ మల్లన్న, రాకేశ్రెడ్డి స్వయంగా ఓటర్లను కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ మూడు పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. వారి గెలుపు కోసం ఆయా పార్టీల కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఓటరుగా నమోదు చేసుకున్న పట్టభద్రుల ఇంటికి వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. తమ అభ్యర్థుల గుణగణాలు చెబుతూ ఓటును అభ్యర్థిస్తున్నారు. కాగా ప్రభుత్వ, పట్టణ కార్యాలయాలు, బ్యాంకులు, కోర్టులకు వెళ్లి న్యాయవాదులను కలిసి ఓటడుగుతున్నారు. ఇప్పటికే మూడు పార్టీలు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాయి. భాజపా అభ్యర్థి తరపున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, భారాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రాకేశ్రెడ్డికి మద్దతుగా నిర్వహించిన పట్టభద్రుల సమావేశాల్లో పాల్గొన్నారు. మూడు జిల్లాల పరిధిలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, అభ్యర్థి అంతటా స్వయంగా తిరిగి ప్రచారం చేయడం సాధ్యం కాదని, నాయకులు, కార్యకర్తలే అభ్యర్థులుగా భావించి ప్రచారం చేయాలని ఆ ఇద్దరు నాయకులు తమ పార్టీల శ్రేణులకు ఉద్భోదించారు. భాజపా అభ్యర్థికి మద్దతుగా బుధవారం పట్టణంలో భాజపా ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రసంగించనున్నారు. ఇక తీన్మార్ మల్లన్న గెలుపును కాంక్షిస్తూ భువనగిరి ఎమ్మెల్యే పట్టణంలో నియోజకవర్గ స్థాయి పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రచారం ముమ్మరం చేయాలని ఆదేశించారు. జిల్లాలో 34,080 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. ప్రతి ఓటరును కలిసేందుకు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దూర ప్రాంతంలో ఉంటున్న వారిని ఓటేసేందుకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మొదటి ప్రాధాన్యతగా ఓటు పైనే దృష్టి పెట్టారు. 52 మంది రంగంలో ఉండటంతో మొదటి ప్రాధాన్యత ఓటు ఒక్కటే తమ అభ్యర్థులకు వేయించేందుకు ఎవరికి వారుగా వ్యూహాలు రూపొందిస్తున్నారు. ద్వితీయ ప్రాధాన్యతగా ఓటు వేయకుండా ఒకే ఓటు పడేలా రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. వీలైన ఎక్కువ ఓట్లు సింగిల్గా వేయించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు ఈ స్థానాన్ని కైవసం చేసుకున్న భారాస ఉప ఎన్నికల్లో కూడా గులాబీ జెండా ఎగరవేయాలని, గతంలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన తీన్మార్ మల్లన్నను గెలిపించుకోవాలని అధికార పార్టీ, మోదీ హవాతో గెలిచి తీరాలన్న పట్టుదలతో భాజపా పార్టీలు వ్యూహ ప్రతిప్యూహాలు చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100/100
[ 27-07-2024]
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో భాగంగా జాబ్కార్డుదారులకు నూరు రోజుల పనిదినాలు కల్పించడంలో యాదాద్రి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
హద్దులు చెరిపి.. ఆక్రమించి..!
[ 27-07-2024]
నకిరేకల్ శివారులో 124 కి.మీ వద్ద ఏఎంఆర్పీ ప్రధాన కాల్వ భూమి హద్దురాళ్లను తొలగించి గట్టువెంట పడేశారు. భూమిని ఆక్రమించి సాగుచేసుకుంటున్నారు. -
చెత్తకుప్పలు.. రోగాలతో తిప్పలు
[ 27-07-2024]
పురపాలికల్లో రహదారుల పక్కనే చెత్తాచెదారం దర్శనమిస్తోంది. ఇంటింటా చెత్త సేకరణకు సిబ్బంది ప్రతి వీధిలో వాహనంతో పర్యటించి సేకరణ చేపట్టాల్సి ఉన్నా.. పూర్తిస్థాయిలో సేకరణ జరగడం లేదు. -
బంతే..భవిష్యత్తుగా..!
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్ క్రీడా సంగ్రామం మొదలైంది. ఈ పోటీల్లో మన దేశం నుంచి 117 మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు. -
నెలకో తీరు.. హుషారు
[ 27-07-2024]
చిన్నతనం నుంచే పిల్లల్లో మానసిక, శారీరక చురుకుదనం ఉండాలని తల్లిదండ్రులు తపన పడుతుంటారు. రకరకాల తినుబండారాలు, రంగుల బొమ్మలు చేతికిచ్చినా.. ఏదో తెలియని వెలితి వారి మనసును తొలిచేస్తుంటుంది. ఆ వెలితిని ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో పూడ్పించేసుకోవచ్చు. ఇక్కడ చిన్నారుల అభిరుచికి తగ్గట్టుగానే నిత్యం పోషకాహారం అందిస్తారు. ఆడిస్తారు. పాడిస్తారు. -
చేపా.. చేపా... చెరువుకు దూరమేనా..?
[ 27-07-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. మత్స్యకారుల జీవనోపాధి కోసం గత సర్కారు ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. -
బావిలోకి దిగి ఊపిరాడక మృతి
[ 27-07-2024]
బావిలోకి మోటారు మరమ్మతుల కోసం దిగిన రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో చోటు చేసుకుంది. -
స్వామి కల్యాణం.. అమ్మవారి ఊంజల్ సేవోత్సవం
[ 27-07-2024]
యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో ఆషాఢమాసం మూడో శుక్రవారం స్వామి, అమ్మవార్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఆచారంగా జరిగాయి. -
గోదావరి.. @ గోపీడాన్
[ 27-07-2024]
అమ్మాయిలు కేవలం వంటింటికే పరిమితమయ్యే రోజులు కావివి. అన్నింట్లో సగం, ఆకాశంలో..అవకాశాల్లో సగం అనే నినాదంతో ముందుకెళ్తున్న కాలం ఇది. -
వనాలపై దృష్టి.. సంపద సృష్టి
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రకృతి సంపద వనాలు లక్ష్యాలకు చేరువలో ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు సంపదను సృష్టించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయడానికి సంకల్పించారు. -
బస్తీ.. సైకిల్పై గస్తీ..!
[ 27-07-2024]
గతంలో పోలీస్ కానిస్టేబుళ్లు సైకిళ్లపైనే గస్తీ తిరిగే వారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా దశాబ్దాల నుంచి ద్విచక్రవాహనాలపై తిరుగుతున్నారు.. -
ఏ వీధి చూసినా.. భౌ..భౌ..
[ 27-07-2024]
నాలుగు నెలల క్రితం పహాడీనగర్లో ద్విచక్రవాహనంపై పిల్లలను స్కూల్కు దింపేందుకు వెళ్తున్న వ్యక్తిని కుక్కల గుంపు వెంబడించంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్