ఓటు వేసే సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి: ఎన్నికల అధికారి
వరంగల్ -ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారి,నల్గొండ కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు.
నల్గొండ సంక్షేమం, న్యూస్టుడే: వరంగల్ -ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారి,నల్గొండ కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. బ్యాలెట్ పేపర్పై ఎన్నికల సంఘం ద్వారా సరఫరా చేసిన వాయిలెట్ స్కెచ్ పెన్ను మాత్రమే ఉపయోగించాలని ఓటర్లకు సూచించారు. ఓటు వేసేందుకు ఎంచుకున్న అభ్యర్థికి ఎదురుగా 1, లేదా 2, లేదా 3..4 ఇలా ప్రాధాన్యతా క్రమంలో అంకెల రూపంలో మాత్రమే పేర్కొనాల్సి ఉంటుందని తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఓటు కింద 1వ అంకెను ఒక అభ్యర్థికి ఎదురుగా ఉన్న స్థలంలో మాత్రమే మార్క్ చేయాలని పేర్కొన్నారు. ఎంత మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ బ్యాలెట్ పేపర్లో పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లకు ఎదురుగా 1, 2, 3.. వంటి అంకెల రూపంలో మాత్రమే ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేయాలని వివరించారు. ఓటు వేసేటప్పుడు భారతీయ సంఖ్యలైన 1, 2, 3 లేదా రోమన్ తరహాలో మార్క్ చేయవచ్చన్నారు.
ఇవి చేయకూడదు..
శాసనమండలి ఉప ఎన్నికల్లో ఓటర్లు బ్యాలెట్ పేపర్పై ఇద్దరు అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యతా ఓటు 1వ సంఖ్య ఇవ్వకూడదని హరిచందన తెలిపారు. బ్యాలెట్ పేపర్పై సంతకం చేయొద్దని, ఇనీషియల్ వేయడం, పేర్లు, అక్షరాలు రాయకూడదని పేర్కొన్నారు. బ్యాలెట్పై 1, 2, 3, 4, 5... ఇలా సంఖ్యల రూపంలో మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని, పదాల రూపంలో వన్, టూ, త్రీ అని రాయకూడదని సూచించారు. బ్యాలెట్పై మార్క్ టిక్ వేయడం, లేదా ఇంటు గుర్తు పెట్టడం చేయకూడదన్నారు. ఒక అభ్యర్థికి రెండు ప్రాధాన్యతలు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులకు వచ్చేలా నెంబర్ మార్క్ చేయకూడదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100/100
[ 27-07-2024]
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో భాగంగా జాబ్కార్డుదారులకు నూరు రోజుల పనిదినాలు కల్పించడంలో యాదాద్రి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
హద్దులు చెరిపి.. ఆక్రమించి..!
[ 27-07-2024]
నకిరేకల్ శివారులో 124 కి.మీ వద్ద ఏఎంఆర్పీ ప్రధాన కాల్వ భూమి హద్దురాళ్లను తొలగించి గట్టువెంట పడేశారు. భూమిని ఆక్రమించి సాగుచేసుకుంటున్నారు. -
చెత్తకుప్పలు.. రోగాలతో తిప్పలు
[ 27-07-2024]
పురపాలికల్లో రహదారుల పక్కనే చెత్తాచెదారం దర్శనమిస్తోంది. ఇంటింటా చెత్త సేకరణకు సిబ్బంది ప్రతి వీధిలో వాహనంతో పర్యటించి సేకరణ చేపట్టాల్సి ఉన్నా.. పూర్తిస్థాయిలో సేకరణ జరగడం లేదు. -
బంతే..భవిష్యత్తుగా..!
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్ క్రీడా సంగ్రామం మొదలైంది. ఈ పోటీల్లో మన దేశం నుంచి 117 మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు. -
నెలకో తీరు.. హుషారు
[ 27-07-2024]
చిన్నతనం నుంచే పిల్లల్లో మానసిక, శారీరక చురుకుదనం ఉండాలని తల్లిదండ్రులు తపన పడుతుంటారు. రకరకాల తినుబండారాలు, రంగుల బొమ్మలు చేతికిచ్చినా.. ఏదో తెలియని వెలితి వారి మనసును తొలిచేస్తుంటుంది. ఆ వెలితిని ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో పూడ్పించేసుకోవచ్చు. ఇక్కడ చిన్నారుల అభిరుచికి తగ్గట్టుగానే నిత్యం పోషకాహారం అందిస్తారు. ఆడిస్తారు. పాడిస్తారు. -
చేపా.. చేపా... చెరువుకు దూరమేనా..?
[ 27-07-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. మత్స్యకారుల జీవనోపాధి కోసం గత సర్కారు ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. -
బావిలోకి దిగి ఊపిరాడక మృతి
[ 27-07-2024]
బావిలోకి మోటారు మరమ్మతుల కోసం దిగిన రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో చోటు చేసుకుంది. -
స్వామి కల్యాణం.. అమ్మవారి ఊంజల్ సేవోత్సవం
[ 27-07-2024]
యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో ఆషాఢమాసం మూడో శుక్రవారం స్వామి, అమ్మవార్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఆచారంగా జరిగాయి. -
గోదావరి.. @ గోపీడాన్
[ 27-07-2024]
అమ్మాయిలు కేవలం వంటింటికే పరిమితమయ్యే రోజులు కావివి. అన్నింట్లో సగం, ఆకాశంలో..అవకాశాల్లో సగం అనే నినాదంతో ముందుకెళ్తున్న కాలం ఇది. -
వనాలపై దృష్టి.. సంపద సృష్టి
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రకృతి సంపద వనాలు లక్ష్యాలకు చేరువలో ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు సంపదను సృష్టించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయడానికి సంకల్పించారు. -
బస్తీ.. సైకిల్పై గస్తీ..!
[ 27-07-2024]
గతంలో పోలీస్ కానిస్టేబుళ్లు సైకిళ్లపైనే గస్తీ తిరిగే వారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా దశాబ్దాల నుంచి ద్విచక్రవాహనాలపై తిరుగుతున్నారు.. -
ఏ వీధి చూసినా.. భౌ..భౌ..
[ 27-07-2024]
నాలుగు నెలల క్రితం పహాడీనగర్లో ద్విచక్రవాహనంపై పిల్లలను స్కూల్కు దింపేందుకు వెళ్తున్న వ్యక్తిని కుక్కల గుంపు వెంబడించంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం