పట్టభద్రులూ.. ఓటు వేయాలి ఇలా..!
నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 27న జరగనుంది. మొత్తం 4,61,806 మంది ఓటర్లు ఉన్నారు.
ఆలేరు, న్యూస్టుడే: నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 27న జరగనుంది. మొత్తం 4,61,806 మంది ఓటర్లు ఉన్నారు. అయితే సాధారణ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటింగ్ విధానంలో తేడాలున్నాయి. చాలా మందికి ఓటు వేసే విధానం తెలియక చేసే పొరపాట్లతో ఓటు చెల్లకుండా పోయే పరిస్థితి ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీ ప్యాట్లు ఉండవు. బ్యాలెట్ పత్రం మాత్రమే ఉంటుంది. బ్యాలెట్ పత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఓటు వేయాలి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటును వేసే విధానంపై వివరాలు మీ కోసం..
ఓటింగ్ విధానం..
- ఓటు వేయడానికి ఓటరు స్లిప్, ఎన్నికల సంఘం సూచించిన ఏదైనా ఒక ఓటరు గుర్తింపు పత్రం వెంట తీసుకువెళ్లాలి.
- పోలింగ్ అధికారి బ్యాలెట్ పేపర్, పెన్ను ఇస్తారు. వాటినే ఉపయోగించాలి.
- బ్యాలెట్ పత్రంలో పోటీలో ఉన్న అభ్యర్థుల పేరు, పార్టీ, పక్కన బాక్స్ ఉంటాయి.
- ఎన్నికల బరిలో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు ఉంటాయి.
- పోలింగ్ అధికారి ఇచ్చిన పెన్నుతో 1,2,3,4...ఇలా ప్రాధాన్య క్రమంలో కేటాయించాలి.
- మొదటి ప్రాధాన్య ఓటు(1) మాత్రం తప్పక వేయాలి. వేయకుంటే ఓటు చెల్లదు.
- ఒక ఓటరు ఒక్కరికే ఓటు వేయవచ్చు.. లేదా కొంత మందికి లేదా అందరికీ ఓటు వేయవచ్చు. అది మన ఇష్టం. ప్రాధాన్య క్రమాన్ని మాత్రం తప్పవద్దు.
ప్రాధాన్య క్రమం ఇలా..
ఉదాహరణకు పోటీలో 52 మంది ఉన్నారని అనుకుందాం. కేవలం ఆరుగురికి మాత్రమే ఓటు వేయాలని భావిస్తే.. బ్యాలెట్ పత్రాన్ని పరిశీలించి అందులో మొదటి ప్రాధాన్య ఓటు వేయాలనుకునే వారి పేరు, ఫొటో ఎదురుగా ఉన్న బాక్స్లో 1 నెంబరు రాయాలి. మిగతా ఎంచుకున్న ఐదుగురు ఫొటోల ఎదురుగా ఉన్న బాక్సులలో 2, 3, 4, 5, 6 నెంబర్లు రాయాల్సి ఉంటుంది. ఒకవేళ 1, 2, 3 నెంబర్లు వేసిన తర్వాత 4 నెంబరు రాయకుండా 5వ నెంబరు వేస్తే ఆ ఓటు చెల్లదు. 1 నెంబరు వదిలేసి 2, 3, 4, 5 ,6 నెంబర్లు వేసినా ఆ ఓటు చెల్లుబాటు కాదు. బ్యాలెట్ పత్రంపై రోమన్ అంకెలు రాయకూడదు. ఒకటి, రెండు.. అని తెలుగులోనూ రాయవద్దు. రైట్ మార్క్ లాగా టిక్ చేయవద్దు. బ్యాలెట్ పత్రంలో ఎక్కడా సంతకం పెట్టవద్దు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100/100
[ 27-07-2024]
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో భాగంగా జాబ్కార్డుదారులకు నూరు రోజుల పనిదినాలు కల్పించడంలో యాదాద్రి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
హద్దులు చెరిపి.. ఆక్రమించి..!
[ 27-07-2024]
నకిరేకల్ శివారులో 124 కి.మీ వద్ద ఏఎంఆర్పీ ప్రధాన కాల్వ భూమి హద్దురాళ్లను తొలగించి గట్టువెంట పడేశారు. భూమిని ఆక్రమించి సాగుచేసుకుంటున్నారు. -
చెత్తకుప్పలు.. రోగాలతో తిప్పలు
[ 27-07-2024]
పురపాలికల్లో రహదారుల పక్కనే చెత్తాచెదారం దర్శనమిస్తోంది. ఇంటింటా చెత్త సేకరణకు సిబ్బంది ప్రతి వీధిలో వాహనంతో పర్యటించి సేకరణ చేపట్టాల్సి ఉన్నా.. పూర్తిస్థాయిలో సేకరణ జరగడం లేదు. -
బంతే..భవిష్యత్తుగా..!
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్ క్రీడా సంగ్రామం మొదలైంది. ఈ పోటీల్లో మన దేశం నుంచి 117 మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు. -
నెలకో తీరు.. హుషారు
[ 27-07-2024]
చిన్నతనం నుంచే పిల్లల్లో మానసిక, శారీరక చురుకుదనం ఉండాలని తల్లిదండ్రులు తపన పడుతుంటారు. రకరకాల తినుబండారాలు, రంగుల బొమ్మలు చేతికిచ్చినా.. ఏదో తెలియని వెలితి వారి మనసును తొలిచేస్తుంటుంది. ఆ వెలితిని ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో పూడ్పించేసుకోవచ్చు. ఇక్కడ చిన్నారుల అభిరుచికి తగ్గట్టుగానే నిత్యం పోషకాహారం అందిస్తారు. ఆడిస్తారు. పాడిస్తారు. -
చేపా.. చేపా... చెరువుకు దూరమేనా..?
[ 27-07-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. మత్స్యకారుల జీవనోపాధి కోసం గత సర్కారు ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. -
బావిలోకి దిగి ఊపిరాడక మృతి
[ 27-07-2024]
బావిలోకి మోటారు మరమ్మతుల కోసం దిగిన రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో చోటు చేసుకుంది. -
స్వామి కల్యాణం.. అమ్మవారి ఊంజల్ సేవోత్సవం
[ 27-07-2024]
యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో ఆషాఢమాసం మూడో శుక్రవారం స్వామి, అమ్మవార్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఆచారంగా జరిగాయి. -
గోదావరి.. @ గోపీడాన్
[ 27-07-2024]
అమ్మాయిలు కేవలం వంటింటికే పరిమితమయ్యే రోజులు కావివి. అన్నింట్లో సగం, ఆకాశంలో..అవకాశాల్లో సగం అనే నినాదంతో ముందుకెళ్తున్న కాలం ఇది. -
వనాలపై దృష్టి.. సంపద సృష్టి
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రకృతి సంపద వనాలు లక్ష్యాలకు చేరువలో ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు సంపదను సృష్టించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయడానికి సంకల్పించారు. -
బస్తీ.. సైకిల్పై గస్తీ..!
[ 27-07-2024]
గతంలో పోలీస్ కానిస్టేబుళ్లు సైకిళ్లపైనే గస్తీ తిరిగే వారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా దశాబ్దాల నుంచి ద్విచక్రవాహనాలపై తిరుగుతున్నారు.. -
ఏ వీధి చూసినా.. భౌ..భౌ..
[ 27-07-2024]
నాలుగు నెలల క్రితం పహాడీనగర్లో ద్విచక్రవాహనంపై పిల్లలను స్కూల్కు దింపేందుకు వెళ్తున్న వ్యక్తిని కుక్కల గుంపు వెంబడించంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు