అరచేతిలో మేఘ సందేశం
వాతావరణంలో మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్లు రూపొందించింది. ప్రధానంగా వర్షకాలంలో వీటి ఉపయోగం ఎక్కువగా ఉండనుంది.
రైతులకు బహుళ ప్రయోజనకరంగా ‘యాప్’లు
రాజపేట, ఆలేరు, న్యూస్టుడే: వాతావరణంలో మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్లు రూపొందించింది. ప్రధానంగా వర్షకాలంలో వీటి ఉపయోగం ఎక్కువగా ఉండనుంది. మెరుపులు, ఉరుముల నుంచి రక్షించుకోవడం, వర్షం ఎప్పుడు ఎక్కువగా కురిసే అవకాశముందో తెలుసుకుని దాని ప్రకారంగా నడుచుకునేందుకు వీలుగా భారత భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ రూపొందించిన ఈ యాప్లు రైతులకు ఎంతగానో దోహదపడతాయని చెప్పవచ్చు. ఆండ్రాయిడ్ మొబైల్లో ప్లేస్టోర్లోకి వెళ్లి ఆయా యాప్లను డౌన్లోడ్ చేసుకుంటే చాలు ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం మీ అరచేతిలో ఉన్నట్లే.
మెరుపు హెచ్చరిక ‘దామిని’
ఎప్పటికప్పుడు మెరుపు హెచ్చరికలను తెలియజేసేందుకు ‘దామిని’ యాప్ ఉపయోగపడుతుంది. మెరుపు ఎందుకు వస్తుంది. మెరుపు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ యాప్లో సవివరంగా వివరించారు. లొకేషన్ ఆధారంగా ఎక్కడెక్కడ మెరుపులు వచ్చే అవకాశముందో సూచిస్తుంది. పిడుగు పడినప్పుడు తోటివారికి అందించాల్సిన వైద్య సహాయం, శ్వాస ఆగిపోతే నోటి నుంచి శ్వాసను అందించడం, గుండె చప్పుడు ఆగిపోతే సీపీఆర్ చేయడం తదితర వివరాలతో పాటు పిడుగు పడినప్పుడు ప్రాథమికంగా చేయకూడనివి, చేయాల్సిన పనులను ఇందులో పేర్కొంటుంది.
వర్ష సూచనల ఎయిర్ ఈ అలారమ్..
ఎప్పటికప్పుడు వర్ష సూచనను ఈ యాప్ మీకు అందుబాటులో తెస్తుంది. నివసిస్తున్న ప్రాంతంలో వాతావరణం, వర్ష సూచనలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయో తెలియజేస్తుంది. వాతావరణంలోని ఉష్ణోగ్రత, మేఘావృతం తదితర అంశాలను నిలువరిస్తుంది.
సమగ్ర వివరాలతో ‘మేఘదూత్’
మేఘదూత్ యాప్లో సమగ్ర సమాచారం అందుబాటులోకి వస్తుంది. వర్షపాతం, గాలిలో తేమ, వేగం, గాలి వచ్చే దిక్కు, ఉష్ణోగ్రత తదితర అంశాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది. వారం రోజుల ముందు రానున్న నాలుగు రోజుల వాతావరణం విశేషాలను సైతం ఈ యాప్లో తెలుసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అటవీశాఖ అధికారులకు నెమలిని అప్పగించిన స్థానికులు
[ 27-07-2024]
పట్టణంలోని కిసాన్ నగర్ పార్కులో నెమలిని కోతులు వెంబడించి దాడి చేశాయి. -
వైకుంఠ రథాన్ని ప్రారంభించిన భాజపా నేత
[ 27-07-2024]
కౌన్సిలర్ కవిత నరసింహా చారి తన కూతురు జనగాం భావన జ్ఞాపకార్ధంగా వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేశారు. -
100/100
[ 27-07-2024]
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో భాగంగా జాబ్కార్డుదారులకు నూరు రోజుల పనిదినాలు కల్పించడంలో యాదాద్రి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
హద్దులు చెరిపి.. ఆక్రమించి..!
[ 27-07-2024]
నకిరేకల్ శివారులో 124 కి.మీ వద్ద ఏఎంఆర్పీ ప్రధాన కాల్వ భూమి హద్దురాళ్లను తొలగించి గట్టువెంట పడేశారు. భూమిని ఆక్రమించి సాగుచేసుకుంటున్నారు. -
చెత్తకుప్పలు.. రోగాలతో తిప్పలు
[ 27-07-2024]
పురపాలికల్లో రహదారుల పక్కనే చెత్తాచెదారం దర్శనమిస్తోంది. ఇంటింటా చెత్త సేకరణకు సిబ్బంది ప్రతి వీధిలో వాహనంతో పర్యటించి సేకరణ చేపట్టాల్సి ఉన్నా.. పూర్తిస్థాయిలో సేకరణ జరగడం లేదు. -
బంతే..భవిష్యత్తుగా..!
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్ క్రీడా సంగ్రామం మొదలైంది. ఈ పోటీల్లో మన దేశం నుంచి 117 మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు. -
నెలకో తీరు.. హుషారు
[ 27-07-2024]
చిన్నతనం నుంచే పిల్లల్లో మానసిక, శారీరక చురుకుదనం ఉండాలని తల్లిదండ్రులు తపన పడుతుంటారు. రకరకాల తినుబండారాలు, రంగుల బొమ్మలు చేతికిచ్చినా.. ఏదో తెలియని వెలితి వారి మనసును తొలిచేస్తుంటుంది. ఆ వెలితిని ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో పూడ్పించేసుకోవచ్చు. ఇక్కడ చిన్నారుల అభిరుచికి తగ్గట్టుగానే నిత్యం పోషకాహారం అందిస్తారు. ఆడిస్తారు. పాడిస్తారు. -
చేపా.. చేపా... చెరువుకు దూరమేనా..?
[ 27-07-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. మత్స్యకారుల జీవనోపాధి కోసం గత సర్కారు ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. -
బావిలోకి దిగి ఊపిరాడక మృతి
[ 27-07-2024]
బావిలోకి మోటారు మరమ్మతుల కోసం దిగిన రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో చోటు చేసుకుంది. -
స్వామి కల్యాణం.. అమ్మవారి ఊంజల్ సేవోత్సవం
[ 27-07-2024]
యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో ఆషాఢమాసం మూడో శుక్రవారం స్వామి, అమ్మవార్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఆచారంగా జరిగాయి. -
గోదావరి.. @ గోపీడాన్
[ 27-07-2024]
అమ్మాయిలు కేవలం వంటింటికే పరిమితమయ్యే రోజులు కావివి. అన్నింట్లో సగం, ఆకాశంలో..అవకాశాల్లో సగం అనే నినాదంతో ముందుకెళ్తున్న కాలం ఇది. -
వనాలపై దృష్టి.. సంపద సృష్టి
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రకృతి సంపద వనాలు లక్ష్యాలకు చేరువలో ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు సంపదను సృష్టించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయడానికి సంకల్పించారు. -
బస్తీ.. సైకిల్పై గస్తీ..!
[ 27-07-2024]
గతంలో పోలీస్ కానిస్టేబుళ్లు సైకిళ్లపైనే గస్తీ తిరిగే వారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా దశాబ్దాల నుంచి ద్విచక్రవాహనాలపై తిరుగుతున్నారు.. -
ఏ వీధి చూసినా.. భౌ..భౌ..
[ 27-07-2024]
నాలుగు నెలల క్రితం పహాడీనగర్లో ద్విచక్రవాహనంపై పిల్లలను స్కూల్కు దింపేందుకు వెళ్తున్న వ్యక్తిని కుక్కల గుంపు వెంబడించంది.
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి