logo

ఊహించని మరణం.. ఆరుగురి జీవితాల్లో వెలుగు

ఓ మహిళా ఊహించని ప్రమాదంతో ఆకస్మికంగా మృతి చెందినా, అవయవదానంతో ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపింది.

Updated : 22 May 2024 04:26 IST

నిమ్స్, ఆలేరు, న్యూస్‌టుడే: ఓ మహిళా ఊహించని ప్రమాదంతో ఆకస్మికంగా మృతి చెందినా, అవయవదానంతో ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. ఆలేరు మండలం బహదూర్‌పేట గ్రామానికి చెందిన జంపాల సుజాత(35) ఈనెల 18న ఇంట్లో అనుకోకుండా కిందపడిపోయారు. కుటుంబీకులు వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి బోడుప్పల్‌ పరిధి మేడిపల్లిలోని శ్రీకర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ మూడు రోజులు చికిత్స అందించిన వైద్యులు బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న జీవన్‌దాన్‌ బృందం ఆమె భర్త దశరథ్, కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆమె నుంచి కాలేయం, రెండు కిడ్నీలు, ఒక ఊపిరితిత్తి సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు, రెండు కంటి కార్నియాలను చూపులేని వారికి అమర్చినట్లు జీవన్‌దాన్‌ ఇన్‌ఛార్జి స్వర్ణలత తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని