మోసపోతే గోసపడతాం..!
నల్గొండ అర్బన్, మిర్యాలగూడ, హాలియా, హుజూర్నగర్ : ఒకసారి కాంగ్రెస్ పార్టీ హామీలకు మోసపోయామని (గత ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేయడాన్ని ప్రస్తావిస్తూ)..
ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచార సభల్లో మాజీ మంత్రి కేటీఆర్
ఈనాడు, నల్గొండ - న్యూస్టుడే, నల్గొండ అర్బన్, మిర్యాలగూడ, హాలియా, హుజూర్నగర్ : ఒకసారి కాంగ్రెస్ పార్టీ హామీలకు మోసపోయామని (గత ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేయడాన్ని ప్రస్తావిస్తూ).. ఇప్పుడూ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే గోస పడుతామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఉన్నత విద్యావంతుడు అయిన భారాస అభ్యర్థి రాకేశ్రెడ్డిని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేరచరిత్ర గల వాడని, బ్లాక్మెయిల్, బూతులు తప్ప ఆయన నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడన్నారు. వరంగల్- ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కేటీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంగళవారం పర్యటన చేశారు. తొలుత నల్గొండ ప్రచార సభలో పాల్గొని అక్కడి నుంచి దేవరకొండకు వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ తండ్రి ఇటీవల మరణించడంతో ఆయనను పరామర్శించారు. అనంతరం హాలియా, మిర్యాలగూడ సభల్లో పాల్గొని చివరగా హుజూర్నగర్ చేరుకున్నారు.
భారాసలో విద్యావంతులకు ప్రత్యేక స్థానం ఉంటుందని.. సాగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన నోముల భగత్ను ఎందుకు గెలిపించలేదో ప్రజలకే తెలియాలన్నారు. గత పదేళ్ల భారాస ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లాలో జరిగిన అభివృద్ధిని వివరించారు. తనను గెలిపిస్తే ఒక్క రూపాయి జీతం తీసుకోకుండా పనిచేస్తానని, నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగు రాకేశ్రెడ్డి అన్నారు. ఎన్నికల్లో భాజపా అభ్యర్థి ఉన్నా లేనట్లేనని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేర చరిత్ర అందరికీ తెలిసిందేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పే మాయ మాటలకు మోసపోవద్దని, భారాస అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తీన్మార్ మల్లన్న నేర చరిత్ర, అక్రమ వసూళ్లు ఓటర్లు గమనించాలని భారాస రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ ఛైర్మన్ బండా నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిషోర్, భాస్కర్రావు, బూడిద భిక్షమయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జేబుదొంగల చేతివాటం
భారాస ప్రచార సభల్లో పలు చోట్ల జేబు దొంగలు చేతివాటం ప్రదర్శించారు. నల్గొండలో ఓ దొంగ కార్యకర్త జేబులో నుంచి డబ్బులు తీసుకుంటూ పట్టుబడటంతో దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మిర్యాలగూడ, హాలియాలోనూ పలువురి కార్యకర్తల డబ్బులు పోయినట్లు తెలిసింది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100/100
[ 27-07-2024]
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో భాగంగా జాబ్కార్డుదారులకు నూరు రోజుల పనిదినాలు కల్పించడంలో యాదాద్రి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
హద్దులు చెరిపి.. ఆక్రమించి..!
[ 27-07-2024]
నకిరేకల్ శివారులో 124 కి.మీ వద్ద ఏఎంఆర్పీ ప్రధాన కాల్వ భూమి హద్దురాళ్లను తొలగించి గట్టువెంట పడేశారు. భూమిని ఆక్రమించి సాగుచేసుకుంటున్నారు. -
చెత్తకుప్పలు.. రోగాలతో తిప్పలు
[ 27-07-2024]
పురపాలికల్లో రహదారుల పక్కనే చెత్తాచెదారం దర్శనమిస్తోంది. ఇంటింటా చెత్త సేకరణకు సిబ్బంది ప్రతి వీధిలో వాహనంతో పర్యటించి సేకరణ చేపట్టాల్సి ఉన్నా.. పూర్తిస్థాయిలో సేకరణ జరగడం లేదు. -
బంతే..భవిష్యత్తుగా..!
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్ క్రీడా సంగ్రామం మొదలైంది. ఈ పోటీల్లో మన దేశం నుంచి 117 మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు. -
నెలకో తీరు.. హుషారు
[ 27-07-2024]
చిన్నతనం నుంచే పిల్లల్లో మానసిక, శారీరక చురుకుదనం ఉండాలని తల్లిదండ్రులు తపన పడుతుంటారు. రకరకాల తినుబండారాలు, రంగుల బొమ్మలు చేతికిచ్చినా.. ఏదో తెలియని వెలితి వారి మనసును తొలిచేస్తుంటుంది. ఆ వెలితిని ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో పూడ్పించేసుకోవచ్చు. ఇక్కడ చిన్నారుల అభిరుచికి తగ్గట్టుగానే నిత్యం పోషకాహారం అందిస్తారు. ఆడిస్తారు. పాడిస్తారు. -
చేపా.. చేపా... చెరువుకు దూరమేనా..?
[ 27-07-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. మత్స్యకారుల జీవనోపాధి కోసం గత సర్కారు ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. -
బావిలోకి దిగి ఊపిరాడక మృతి
[ 27-07-2024]
బావిలోకి మోటారు మరమ్మతుల కోసం దిగిన రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో చోటు చేసుకుంది. -
స్వామి కల్యాణం.. అమ్మవారి ఊంజల్ సేవోత్సవం
[ 27-07-2024]
యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో ఆషాఢమాసం మూడో శుక్రవారం స్వామి, అమ్మవార్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఆచారంగా జరిగాయి. -
గోదావరి.. @ గోపీడాన్
[ 27-07-2024]
అమ్మాయిలు కేవలం వంటింటికే పరిమితమయ్యే రోజులు కావివి. అన్నింట్లో సగం, ఆకాశంలో..అవకాశాల్లో సగం అనే నినాదంతో ముందుకెళ్తున్న కాలం ఇది. -
వనాలపై దృష్టి.. సంపద సృష్టి
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రకృతి సంపద వనాలు లక్ష్యాలకు చేరువలో ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు సంపదను సృష్టించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయడానికి సంకల్పించారు. -
బస్తీ.. సైకిల్పై గస్తీ..!
[ 27-07-2024]
గతంలో పోలీస్ కానిస్టేబుళ్లు సైకిళ్లపైనే గస్తీ తిరిగే వారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా దశాబ్దాల నుంచి ద్విచక్రవాహనాలపై తిరుగుతున్నారు.. -
ఏ వీధి చూసినా.. భౌ..భౌ..
[ 27-07-2024]
నాలుగు నెలల క్రితం పహాడీనగర్లో ద్విచక్రవాహనంపై పిల్లలను స్కూల్కు దింపేందుకు వెళ్తున్న వ్యక్తిని కుక్కల గుంపు వెంబడించంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల