Congress: కాంగ్రెస్లో రెండు టిక్కెట్ల రగడ.. ఉత్తమ్, జానా కుటుంబాల నుంచి ఇద్దరు పోటీ?
ఉమ్మడి జిల్లా కాంగ్రెస్లో రెండు టిక్కెట్ల రగడ రాజుకుంది. వచ్చే ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి తాను, కోదాడ నుంచి తన భార్య పద్మావతి పోటీ చేస్తామని ఎంపీ ఉత్తమ్ ఇప్పటికే ప్రకటించారు.
చర్చనీయాంశంగా మారిన కోమటిరెడ్డి వ్యాఖ్యలు
ఈనాడు, నల్గొండ :ఉమ్మడి జిల్లా కాంగ్రెస్లో రెండు టిక్కెట్ల రగడ రాజుకుంది. వచ్చే ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి తాను, కోదాడ నుంచి తన భార్య పద్మావతి పోటీ చేస్తామని ఎంపీ ఉత్తమ్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ఈ దఫా తాను పోటీ చేయడం లేదని గతంలోనే ప్రకటించిన సీనియర్ నేత జానారెడ్డి, తన ఇద్దరు కుమారులను బరిలో దింపేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ మేరకు ఇద్దరు కుమారులు మిర్యాలగూడ, నాగార్జునసాగర్లో టిక్కెట్ కోసం దరఖాస్తు చేశారు. గత రెండు ఎన్నికల్లోనూ ఉత్తమ్ దంపతులిద్దరూ రెండు స్థానాల్లో పోటీ చేయగా..జానారెడ్డి గత ఎన్నికల్లో తన కుమారుడు రఘువీర్ను మిర్యాలగూడ నుంచి బరిలో దింపాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఈ ఎన్నికల్లో స్వయంగా తానే తప్పుకొని కుమారులిద్దరినీ పోటీ చేయించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు దిల్లీ పెద్దలతో మాట్లాడారని, వారు సైతం పచ్చజెండా ఊపారని ఆయన సన్నిహితులు ‘ఈనాడు’కు వెల్లడించారు. దీంతో ప్రత్యేక పరిస్థితుల్లో అనివార్యం అయితే తప్ప ఉత్తమ్, జానారెడ్డి కుటుంబాల నుంచి ఇద్దరూ పోటీ చేయడం ఖాయంగా మారిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్లోని గాంధీభవన్లో మంగళవారం జరిగిన పీఏసీ సమావేశంలో రెండు టిక్కెట్లపై సీనియర్ నేతలిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుందన్న ప్రచారం నేపథ్యంలో త్వరలోనే దీనిపై స్పష్టత రానుందని మాజీ మంత్రి ఒకరు ‘ఈనాడు’కు వెల్లడించారు.
పైరవీలు షురూ..!
ఉమ్మడి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల నుంచి వచ్చిన దరఖాస్తుల్లోంచి మూడు పేర్లతో.. రాజకీయ ఎన్నికల కమిటీ (పీఏసీ) వచ్చే నెల 2న జరిగే సమావేశంలో తుది జాబితాను రూపొందించనుంది. దీంతో టిక్కెట్ కోసం దరఖాస్తు చేసిన ఆశావహులు తమకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉన్న పరిచయాలను ఉపయోగించి తుది జాబితాలో తమ పేరు ఉండేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు. మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్, భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని సీనియర్ నేతలు, రాష్ట్ర నేతల ఆశీస్సులు పొందాలని పలువురు ఆశావహులు ఇప్పటికే వారిని కలిసి తమకు ఈ ఎన్నికల్లో పార్టీ టిక్కెటివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సర్వేల నేపథ్యం, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి పార్టీకి చేసిన సేవలు, అంగ, అర్థబలాలను పరిగణనలోకి తీసుకునే ఈ దఫా టిక్కెట్ కేటాయింపులు ఉంటాయని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా సర్వేలే ప్రమాణికంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అధికార పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో వారికి ధీటైన అభ్యర్థులను రంగంలోకి దింపాలన్న వాదన క్యాడర్లో వ్యక్తమవుతోంది.
కోమటిరెడ్డి వ్యాఖ్యలపై చర్చ
‘అవసరం అయితే నల్గొండ స్థానాన్ని బీసీలకు ఇవ్వడానికి సిద్ధం’ అన్న కోమటిరెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రతి పార్లమెంటు పరిధిలో రెండు బీసీ స్థానాలు కేటాయించాలని ఇప్పటికే టీపీసీసీ విధాన నిర్ణయం తీసుకుంది. నల్గొండ పార్లమెంటు పరిధిలో హుజూర్నగర్, కోదాడ నుంచి ఉత్తమ్ దంపతులు పోటీ చేస్తామని ప్రకటించగా..మిర్యాలగూడ, సాగర్ టిక్కెట్లను జానారెడ్డి తన కుమారులకు కేటాయించాలని కోరుతున్నారు. దేవరకొండ ఎస్టీలకు రిజర్వు కాగా..సూర్యాపేట టిక్కెట్ కోసం దామోదర్రెడ్డి, పటేల్ రమేశ్రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక మిగిలింది నల్గొండ మాత్రమే. నల్గొండ నుంచి ఐదు సార్లు పోటీ చేసిన కోమటిరెడ్డి నాలుగు సార్లు విజయం సాధించి, 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ దఫా నల్గొండ నుంచే పోటీ చేస్తానని గతంలో చాలా సార్లు ఆయన బహిరంగంగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 04-05-2024]
భువనగిరి పట్టణంలో జిల్లా భారాస పార్టీ కార్యాలయంలో పట్టణ బూత్ కమిటీల సమావేశం ఏర్పాటు చేశారు. -
పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం యంత్రాల కేటాయింపు
[ 04-05-2024]
రెండో విడత ర్యాండమైజేషన్ ద్వారా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 2,141 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం యంత్రాలను కేటాయించారు. -
చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలి
[ 04-05-2024]
కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కొరకు బస్టాండ్ ఏరియాలో ప్రచారం చేపట్టారు. -
అభివృద్ధి వివరిస్తూ.. నాయకులను విమర్శిస్తూ..!
[ 04-05-2024]
మునుగోడు నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయిన చండూరును రెవెన్యూ డివిజన్ చేసింది కేసీఆరేనని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. -
టెయిల్పాండ్ మట్టిపై అక్రమార్కుల కన్ను!
[ 04-05-2024]
మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో నుంచి ఇటుక బట్టీలు, పలు ప్రైవేట్ భూముల్లో నింపేందుకు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. -
నేత..ఆత్మీయత
[ 04-05-2024]
అభ్యర్థులు ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోలింగ్ తేదీ మరో పదిరోజుల గడువు మాత్రమే ఉండటంతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. -
మరో సందడి షురూ..!
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికలు మరో వారం రోజులుండగానే.. ఇటీవల ఖాళీ అయిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నిక సందడి మొదలైంది. -
పరిశ్రమల స్థాపనతో యువత, మహిళలకు ఉపాధి
[ 04-05-2024]
‘ లోక్సభ నియోజకవర్గ వ్యాప్తంగా ఆహారశుద్ధి పరిశ్రమలు, ఆటోమొబైల్ పరిశ్రమల స్థాపనకు అవకాశాలున్నా.. గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించిన ఎంపీలు పట్టించుకోలేదు. -
హృదయాన్ని తాకిన అక్షరం
[ 04-05-2024]
మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన ఐతగోని రవి, మమత దంపతుల కుమార్తె ఆరుషి (18 నెలలు). వీరిది నిరుపేద కుటుంబం. -
కూటమి గెలుపునకు కృషి చేయాలి
[ 04-05-2024]
దేశంలో ఇండియా కూటమి గెలుపు కోసం మిత్రపక్షాలన్నీ కృషి చేయాలని సీపీఐ జాతీయ సమితి కార్యవర్గ సభ్యుడు పల్లా వెంకటరెడ్డి అన్నారు. -
భాజపాకు చోటివ్వొద్దు: బీవీ రాఘవులు
[ 04-05-2024]
లౌకికవాదానికి, అభివృద్ధి మార్గానికి పేరుగాంచిన తెలంగాణ రాష్ట్రంలో భాజపాకు చొటివ్వొద్దని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రజలను కోరారు. -
పుస్తకాలు వస్తున్నాయ్..!
[ 04-05-2024]
పాఠశాలలు తిరిగి తెరిచే నాటికి పాఠ్యపుస్తకాలు, సారూప్య దుస్తులు అందించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. -
తప్పుడు ప్రచారం మానుకోవాలి: చామల
[ 04-05-2024]
ప్రత్యర్థులు తనపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు మానుకోవాలని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. పట్టణ శివారులో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
నారసింహుడి సన్నిధిలో ఊంజల్ సేవోత్సవం
[ 04-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో స్వయంభువులైన పంచనారసింహులకు శుక్రవారం నిత్యపూజలతో పాటు అమ్మవారిని ఆరాధిస్తూ ప్రత్యేక క్రతువులను ఆలయ ఆచారంగా నిర్వహించారు. -
దేశ విచ్ఛిన్నానికి మోదీ ప్రభుత్వ ప్రయత్నం: మంత్రి ఉత్తమ్
[ 04-05-2024]
దేశ విచ్ఛిన్నానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మేళ్లచెరువు, దొండపాడు, చిలుకూరులో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు.
తాజా వార్తలు (Latest News)
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!