Congress: కాంగ్రెస్లో రెండు టిక్కెట్ల రగడ.. ఉత్తమ్, జానా కుటుంబాల నుంచి ఇద్దరు పోటీ?
ఉమ్మడి జిల్లా కాంగ్రెస్లో రెండు టిక్కెట్ల రగడ రాజుకుంది. వచ్చే ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి తాను, కోదాడ నుంచి తన భార్య పద్మావతి పోటీ చేస్తామని ఎంపీ ఉత్తమ్ ఇప్పటికే ప్రకటించారు.
చర్చనీయాంశంగా మారిన కోమటిరెడ్డి వ్యాఖ్యలు
ఈనాడు, నల్గొండ :ఉమ్మడి జిల్లా కాంగ్రెస్లో రెండు టిక్కెట్ల రగడ రాజుకుంది. వచ్చే ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి తాను, కోదాడ నుంచి తన భార్య పద్మావతి పోటీ చేస్తామని ఎంపీ ఉత్తమ్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ఈ దఫా తాను పోటీ చేయడం లేదని గతంలోనే ప్రకటించిన సీనియర్ నేత జానారెడ్డి, తన ఇద్దరు కుమారులను బరిలో దింపేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ మేరకు ఇద్దరు కుమారులు మిర్యాలగూడ, నాగార్జునసాగర్లో టిక్కెట్ కోసం దరఖాస్తు చేశారు. గత రెండు ఎన్నికల్లోనూ ఉత్తమ్ దంపతులిద్దరూ రెండు స్థానాల్లో పోటీ చేయగా..జానారెడ్డి గత ఎన్నికల్లో తన కుమారుడు రఘువీర్ను మిర్యాలగూడ నుంచి బరిలో దింపాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఈ ఎన్నికల్లో స్వయంగా తానే తప్పుకొని కుమారులిద్దరినీ పోటీ చేయించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు దిల్లీ పెద్దలతో మాట్లాడారని, వారు సైతం పచ్చజెండా ఊపారని ఆయన సన్నిహితులు ‘ఈనాడు’కు వెల్లడించారు. దీంతో ప్రత్యేక పరిస్థితుల్లో అనివార్యం అయితే తప్ప ఉత్తమ్, జానారెడ్డి కుటుంబాల నుంచి ఇద్దరూ పోటీ చేయడం ఖాయంగా మారిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్లోని గాంధీభవన్లో మంగళవారం జరిగిన పీఏసీ సమావేశంలో రెండు టిక్కెట్లపై సీనియర్ నేతలిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుందన్న ప్రచారం నేపథ్యంలో త్వరలోనే దీనిపై స్పష్టత రానుందని మాజీ మంత్రి ఒకరు ‘ఈనాడు’కు వెల్లడించారు.
పైరవీలు షురూ..!
ఉమ్మడి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల నుంచి వచ్చిన దరఖాస్తుల్లోంచి మూడు పేర్లతో.. రాజకీయ ఎన్నికల కమిటీ (పీఏసీ) వచ్చే నెల 2న జరిగే సమావేశంలో తుది జాబితాను రూపొందించనుంది. దీంతో టిక్కెట్ కోసం దరఖాస్తు చేసిన ఆశావహులు తమకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉన్న పరిచయాలను ఉపయోగించి తుది జాబితాలో తమ పేరు ఉండేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు. మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్, భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని సీనియర్ నేతలు, రాష్ట్ర నేతల ఆశీస్సులు పొందాలని పలువురు ఆశావహులు ఇప్పటికే వారిని కలిసి తమకు ఈ ఎన్నికల్లో పార్టీ టిక్కెటివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సర్వేల నేపథ్యం, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి పార్టీకి చేసిన సేవలు, అంగ, అర్థబలాలను పరిగణనలోకి తీసుకునే ఈ దఫా టిక్కెట్ కేటాయింపులు ఉంటాయని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా సర్వేలే ప్రమాణికంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అధికార పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో వారికి ధీటైన అభ్యర్థులను రంగంలోకి దింపాలన్న వాదన క్యాడర్లో వ్యక్తమవుతోంది.
కోమటిరెడ్డి వ్యాఖ్యలపై చర్చ
‘అవసరం అయితే నల్గొండ స్థానాన్ని బీసీలకు ఇవ్వడానికి సిద్ధం’ అన్న కోమటిరెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రతి పార్లమెంటు పరిధిలో రెండు బీసీ స్థానాలు కేటాయించాలని ఇప్పటికే టీపీసీసీ విధాన నిర్ణయం తీసుకుంది. నల్గొండ పార్లమెంటు పరిధిలో హుజూర్నగర్, కోదాడ నుంచి ఉత్తమ్ దంపతులు పోటీ చేస్తామని ప్రకటించగా..మిర్యాలగూడ, సాగర్ టిక్కెట్లను జానారెడ్డి తన కుమారులకు కేటాయించాలని కోరుతున్నారు. దేవరకొండ ఎస్టీలకు రిజర్వు కాగా..సూర్యాపేట టిక్కెట్ కోసం దామోదర్రెడ్డి, పటేల్ రమేశ్రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక మిగిలింది నల్గొండ మాత్రమే. నల్గొండ నుంచి ఐదు సార్లు పోటీ చేసిన కోమటిరెడ్డి నాలుగు సార్లు విజయం సాధించి, 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ దఫా నల్గొండ నుంచే పోటీ చేస్తానని గతంలో చాలా సార్లు ఆయన బహిరంగంగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100/100
[ 27-07-2024]
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో భాగంగా జాబ్కార్డుదారులకు నూరు రోజుల పనిదినాలు కల్పించడంలో యాదాద్రి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
హద్దులు చెరిపి.. ఆక్రమించి..!
[ 27-07-2024]
నకిరేకల్ శివారులో 124 కి.మీ వద్ద ఏఎంఆర్పీ ప్రధాన కాల్వ భూమి హద్దురాళ్లను తొలగించి గట్టువెంట పడేశారు. భూమిని ఆక్రమించి సాగుచేసుకుంటున్నారు. -
చెత్తకుప్పలు.. రోగాలతో తిప్పలు
[ 27-07-2024]
పురపాలికల్లో రహదారుల పక్కనే చెత్తాచెదారం దర్శనమిస్తోంది. ఇంటింటా చెత్త సేకరణకు సిబ్బంది ప్రతి వీధిలో వాహనంతో పర్యటించి సేకరణ చేపట్టాల్సి ఉన్నా.. పూర్తిస్థాయిలో సేకరణ జరగడం లేదు. -
బంతే..భవిష్యత్తుగా..!
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్ క్రీడా సంగ్రామం మొదలైంది. ఈ పోటీల్లో మన దేశం నుంచి 117 మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు. -
నెలకో తీరు.. హుషారు
[ 27-07-2024]
చిన్నతనం నుంచే పిల్లల్లో మానసిక, శారీరక చురుకుదనం ఉండాలని తల్లిదండ్రులు తపన పడుతుంటారు. రకరకాల తినుబండారాలు, రంగుల బొమ్మలు చేతికిచ్చినా.. ఏదో తెలియని వెలితి వారి మనసును తొలిచేస్తుంటుంది. ఆ వెలితిని ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో పూడ్పించేసుకోవచ్చు. ఇక్కడ చిన్నారుల అభిరుచికి తగ్గట్టుగానే నిత్యం పోషకాహారం అందిస్తారు. ఆడిస్తారు. పాడిస్తారు. -
చేపా.. చేపా... చెరువుకు దూరమేనా..?
[ 27-07-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. మత్స్యకారుల జీవనోపాధి కోసం గత సర్కారు ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. -
బావిలోకి దిగి ఊపిరాడక మృతి
[ 27-07-2024]
బావిలోకి మోటారు మరమ్మతుల కోసం దిగిన రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో చోటు చేసుకుంది. -
స్వామి కల్యాణం.. అమ్మవారి ఊంజల్ సేవోత్సవం
[ 27-07-2024]
యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో ఆషాఢమాసం మూడో శుక్రవారం స్వామి, అమ్మవార్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఆచారంగా జరిగాయి. -
గోదావరి.. @ గోపీడాన్
[ 27-07-2024]
అమ్మాయిలు కేవలం వంటింటికే పరిమితమయ్యే రోజులు కావివి. అన్నింట్లో సగం, ఆకాశంలో..అవకాశాల్లో సగం అనే నినాదంతో ముందుకెళ్తున్న కాలం ఇది. -
వనాలపై దృష్టి.. సంపద సృష్టి
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రకృతి సంపద వనాలు లక్ష్యాలకు చేరువలో ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు సంపదను సృష్టించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయడానికి సంకల్పించారు. -
బస్తీ.. సైకిల్పై గస్తీ..!
[ 27-07-2024]
గతంలో పోలీస్ కానిస్టేబుళ్లు సైకిళ్లపైనే గస్తీ తిరిగే వారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా దశాబ్దాల నుంచి ద్విచక్రవాహనాలపై తిరుగుతున్నారు.. -
ఏ వీధి చూసినా.. భౌ..భౌ..
[ 27-07-2024]
నాలుగు నెలల క్రితం పహాడీనగర్లో ద్విచక్రవాహనంపై పిల్లలను స్కూల్కు దింపేందుకు వెళ్తున్న వ్యక్తిని కుక్కల గుంపు వెంబడించంది.
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?