చుక్కల పల్లకిలో.. ముక్కలు పళ్లెంలో..!
రాజధానికి ఆనుకొని ఉండి వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన ఓ నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీలు ఓటుకు రూ. 2 వేలు చొప్పున సుమారు 1.50 లక్షల ఓట్లకు పంపిణీ పూర్తి చేశాయి. మరో ప్రధాన పార్టీ అభ్యర్థి రూ.వేయి చొప్పున లక్ష ఓట్లకు పంపిణీ చేశారు.
డబ్బు, మద్యంతో పాటూ ఇంటికి కిలో మాంసం పంపిణీ
రాజధానికి ఆనుకొని ఉండి వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన ఓ నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీలు ఓటుకు రూ. 2 వేలు చొప్పున సుమారు 1.50 లక్షల ఓట్లకు పంపిణీ పూర్తి చేశాయి. మరో ప్రధాన పార్టీ అభ్యర్థి రూ.వేయి చొప్పున లక్ష ఓట్లకు పంపిణీ చేశారు. ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లున్న పురపాలికకు ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఓ నాయకుడు తన స్వగ్రామంలో అభ్యర్థి ఇచ్చిన రూ.2 వేలతో పాటూ ఇంటికి కిలో కోడి మాంసాన్ని సొంత ఖర్చులతో మంగళవారం పంపిణీ చేసినట్లు సమాచారం. పోలింగ్ ముందు రోజు మరో దఫాలో ఓటుకు హీనపక్షం రూ.500 నుంచి రూ. వేయి పంచేందుకు ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి బూత్స్థాయికి డబ్బులను చేర్చినట్లు తెలిసింది.
ఈనాడు, నల్గొండ : ఎన్నికలకు అధికార యంత్రాంగాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన వేళ ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రలోభాలకు తెరతీశారు. ఉమ్మడి జిల్లాలోని మొత్తం పన్నెండు నియోజకవర్గాల్లో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఓటర్లకు డబ్బులు పంచేందుకు సిద్ధమయ్యారు. కొన్ని చోట్ల నగదుతో పాటూ మద్యం, మాంసం పంచడానికి సైతం క్యాడర్ను సమాయత్తం చేస్తున్నారు. ఇప్పటికే సామాజిక వర్గాల వారీగా హామీలు ఇస్తూ తొలి విడతగా కొంచెం నగదును ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇచ్చినట్లు తెలిసింది. గెలిచిన అనంతరం వారికి ఏం కావాలంటే అది చేస్తామని అభ్యర్థుల తరఫున స్థానిక నేతలు హామీలిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లలో అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఉన్నవారికి డబ్బులు, నగదుతో పాటూ వారికి అవసరమైన మౌలిక వసతులను సమకూరుస్తున్నారు. ప్రధానంగా పార్టీ క్యాడర్, తటస్థ ఓటర్లతో పాటూ ఎదుటి పార్టీలో ఉన్నా తమకు ఓటు వేస్తారని నమ్మకం ఉన్న వారికి అభ్యర్థులు నగదును పంపిణీ చేస్తున్నారు.
వలస ఓటర్లకు గాలం
ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో సగటున హీనపక్షం 30 వేల వరకు వలస ఓటర్లు ఉండటంతో వారిని రప్పించడానికి ప్రధాన పార్టీల నాయకులు తిప్పలు పడుతున్నారు. ఇప్పటికే దూరప్రాంతాల్లో ఉన్నవారిని గ్రామాల్లోకి రప్పించి వారికి రానుపోను ఖర్చులతో పాటూ ఓటుకు రూ. 3 వేల వరకు ముట్టజెబుతున్నారు. అయితే కొన్ని గ్రామాల్లో రప్పించిన పార్టీకి కాకుండా ఎదుటి పార్టీకే ఓటు వేస్తామని చెప్పడంతో వారూ ఓటుకు రూ. 2 వేల వరకు పంపిణీ చేసినట్లు తెలిసింది. తమకు కచ్చితంగా ఓట్లు పడుతాయని భావిస్తున్న చోట ఎంతకైనా ఖర్చుచేసేందుకు అభ్యర్థులు ముందుకు వస్తున్నారు. ఇతర పార్టీల్లోని ఓట్లలో నమ్మకమైన వారి ద్వారా డబ్బులు ఇచ్చి వారి ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో నగదు, మద్యం సరఫరాపై భారీగా నిఘా పెట్టినా.. కొన్ని చోట్ల వారిని తప్పించుకొని ప్రధాన పార్టీల నాయకులు అనుకున్న చోటుకి డబ్బులను చేరుస్తున్నారు.
రెండు, మూడు రోజుల ముందు నుంచే..
గతంలో ఎన్నికలకు ముందు రోజు రాత్రి మాత్రమే నగœదును పంపిణీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్థులు..ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో రెండు మూడు రోజుల ముందుగానే ఈ క్రతువును ప్రారంభించారు. చివరి రోజు పంపిణీ చేస్తే పోలీసులు, ఎదుటి పార్టీ కార్యకర్తలు నజర్ వేయడం, ఏవైనా అడ్డంకులు వస్తే అన్ని ప్రాంతాల్లో పంపిణీ సకాలంలో పూర్తి కాదనే అనుమానంతో మండలాల వారీగా రెండు మూడు రోజుల నుంచి డబ్బుల పంపిణీ కొనసాగుతోంది. తొలుత తాము అనుకున్నది ఇవ్వడం, ఎదుటి పార్టీ పంపిణీ పూర్తయ్యాక దాన్ని బేరీజు వేసుకొని మరో దఫా పంపిణీ చేయడం ప్రస్తుతం అభ్యర్థులు అనుసరిస్తున్న వ్యూహం. గతంలో ఎన్నడూ ఓటరుకు నగదు పంపిణీ చేయని ఓ ప్రధాన పార్టీ సీనియర్ నేత ఈ దఫా పోలింగ్కు నాలుగు రోజులు ముందుగానే సుమారు లక్ష ఓట్లకు ఓటుకు రూ. వేయి చొప్పున డబ్బులివ్వడం ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఉన్న పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మరోవైపు అన్ని నియోజకవర్గాలోల హోరాహోరీ పోరు నెలకొనడంతో ఇన్ని డబ్బులు పంచినా ఎన్నికల్లో ఓటరు కరుణిస్తారో లేదోనన్న ఆందోళన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100/100
[ 27-07-2024]
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో భాగంగా జాబ్కార్డుదారులకు నూరు రోజుల పనిదినాలు కల్పించడంలో యాదాద్రి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
హద్దులు చెరిపి.. ఆక్రమించి..!
[ 27-07-2024]
నకిరేకల్ శివారులో 124 కి.మీ వద్ద ఏఎంఆర్పీ ప్రధాన కాల్వ భూమి హద్దురాళ్లను తొలగించి గట్టువెంట పడేశారు. భూమిని ఆక్రమించి సాగుచేసుకుంటున్నారు. -
చెత్తకుప్పలు.. రోగాలతో తిప్పలు
[ 27-07-2024]
పురపాలికల్లో రహదారుల పక్కనే చెత్తాచెదారం దర్శనమిస్తోంది. ఇంటింటా చెత్త సేకరణకు సిబ్బంది ప్రతి వీధిలో వాహనంతో పర్యటించి సేకరణ చేపట్టాల్సి ఉన్నా.. పూర్తిస్థాయిలో సేకరణ జరగడం లేదు. -
బంతే..భవిష్యత్తుగా..!
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్ క్రీడా సంగ్రామం మొదలైంది. ఈ పోటీల్లో మన దేశం నుంచి 117 మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు. -
నెలకో తీరు.. హుషారు
[ 27-07-2024]
చిన్నతనం నుంచే పిల్లల్లో మానసిక, శారీరక చురుకుదనం ఉండాలని తల్లిదండ్రులు తపన పడుతుంటారు. రకరకాల తినుబండారాలు, రంగుల బొమ్మలు చేతికిచ్చినా.. ఏదో తెలియని వెలితి వారి మనసును తొలిచేస్తుంటుంది. ఆ వెలితిని ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో పూడ్పించేసుకోవచ్చు. ఇక్కడ చిన్నారుల అభిరుచికి తగ్గట్టుగానే నిత్యం పోషకాహారం అందిస్తారు. ఆడిస్తారు. పాడిస్తారు. -
చేపా.. చేపా... చెరువుకు దూరమేనా..?
[ 27-07-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. మత్స్యకారుల జీవనోపాధి కోసం గత సర్కారు ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. -
బావిలోకి దిగి ఊపిరాడక మృతి
[ 27-07-2024]
బావిలోకి మోటారు మరమ్మతుల కోసం దిగిన రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో చోటు చేసుకుంది. -
స్వామి కల్యాణం.. అమ్మవారి ఊంజల్ సేవోత్సవం
[ 27-07-2024]
యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో ఆషాఢమాసం మూడో శుక్రవారం స్వామి, అమ్మవార్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఆచారంగా జరిగాయి. -
గోదావరి.. @ గోపీడాన్
[ 27-07-2024]
అమ్మాయిలు కేవలం వంటింటికే పరిమితమయ్యే రోజులు కావివి. అన్నింట్లో సగం, ఆకాశంలో..అవకాశాల్లో సగం అనే నినాదంతో ముందుకెళ్తున్న కాలం ఇది. -
వనాలపై దృష్టి.. సంపద సృష్టి
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రకృతి సంపద వనాలు లక్ష్యాలకు చేరువలో ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు సంపదను సృష్టించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయడానికి సంకల్పించారు. -
బస్తీ.. సైకిల్పై గస్తీ..!
[ 27-07-2024]
గతంలో పోలీస్ కానిస్టేబుళ్లు సైకిళ్లపైనే గస్తీ తిరిగే వారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా దశాబ్దాల నుంచి ద్విచక్రవాహనాలపై తిరుగుతున్నారు.. -
ఏ వీధి చూసినా.. భౌ..భౌ..
[ 27-07-2024]
నాలుగు నెలల క్రితం పహాడీనగర్లో ద్విచక్రవాహనంపై పిల్లలను స్కూల్కు దింపేందుకు వెళ్తున్న వ్యక్తిని కుక్కల గుంపు వెంబడించంది.