ధరావత్తు దక్కకపోయినా .. మళ్లీ పోటీ
ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఉన్న ఆర్థిక బలం వారికి ఉండదు. అయినా ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉంటున్నారు. కనీసం ధరావత్తు దక్కించుకునే ఓట్లు కూడా సాధించలేని పరిస్థితి వారిది.
కనగల్, న్యూస్టుడే: ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఉన్న ఆర్థిక బలం వారికి ఉండదు. అయినా ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉంటున్నారు. కనీసం ధరావత్తు దక్కించుకునే ఓట్లు కూడా సాధించలేని పరిస్థితి వారిది. స్వతంత్ర, చిన్న పార్టీల అభ్యర్థులు కొందరు చివరి వరకు బరిలో నిలుస్తారు. మరి కొందరు ప్రధాన పార్టీల అభ్యర్థులతో మంతనాలు సాగించి .. వారికి మద్దతుగా నామినేషన్ ఉపసంహరించుకున్న సందర్భాలున్నాయి. ఇంకొందరు కడవరకు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ.. ప్రధాన పార్టీ అభ్యర్థుల గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావం చూపుతున్నారు. నామపత్రాలు సమర్పించేటప్పుడు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5వేల చొప్పున, ఇతరులు రూ10 వేల చొప్పున ధరావత్తు (డిపాజిట్) చెల్లించాల్సి ఉంటుంది. దీనిని తిరిగి పొందాలంటే నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ధరావత్తు వాపస్ ఇవ్వరు. ధరావత్తు కోల్పోయినప్పటికీ పలువురు మళ్లీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉండటం గమనార్హం.
- 2014 ఎన్నికల్లో మొత్తం 2,21,903 మంది ఓట్లకు 1,94,455 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీ పడగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి 60,774, కంచర్ల భూపాల్ రెడ్డి 50,227, (స్వతంత్ర), భారాస నుంచి దుబ్బాక నర్సింహారెడ్డి 35606, భాజపా అభ్యర్థి కూతురు శ్రీనివాసరెడ్డికి 4,523, సీపీఎం అభ్యర్థి సయ్యద్ హషీంకు 10,332 ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో 11 మంది అభ్యర్థులు ధరావత్తు కోల్పోయారు.
- 2018 ఎన్నికల్లో 26 మంది నామపత్రాలను దాఖలు చేశారు. ఇందులో ఇద్దరివి తిరస్కరణకు గురికాగా.. మరో ఏడుగురు ఉపసంహరించుకున్నారు. 17 మంది బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో మొత్తం 2,16,807 మంది ఓటర్లకు గాను 1,82,389 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారాస అభ్యర్థి కంచర్ల భూపాల్రెడ్డి 98,792 ఓట్లు సాధించారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి 75,094 ఓట్లు వచ్చాయి. భాజపా అభ్యర్థి షన్ముఖచారితో సహా మొత్తం 15 మంది ధరావత్తు కోల్పోయారు.
- 2023 ఎన్నికల్లో 39 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఇందులో ముగ్గురివి తిరస్కరణకు గురికాగా.. ఆరుగురు అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకొన్నారు. మొత్తం 31 మంది బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో 2,44,460 మంది ఓటర్లకుగాను 2.04,137 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో గెలిచిన అభ్యర్థితో పాటు భారాస, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులకు మాత్రమే ధరావత్తు దక్కింది. మొత్తం 28 మంది డిపాజిట్ కోల్పోయారు. ఇందులో భాజపా, సీపీఎం, తదితర పార్టీల అభ్యర్థులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ జిల్లాలో పర్యటన
[ 27-07-2024]
తెలంగాణా రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల, తెగల కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటేశం శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. -
అటవీశాఖ అధికారులకు నెమలిని అప్పగించిన స్థానికులు
[ 27-07-2024]
పట్టణంలోని కిసాన్ నగర్ పార్కులో నెమలిని కోతులు వెంబడించి దాడి చేశాయి. -
వైకుంఠ రథాన్ని ప్రారంభించిన భాజపా నేత
[ 27-07-2024]
కౌన్సిలర్ కవిత నరసింహా చారి తన కూతురు జనగాం భావన జ్ఞాపకార్ధంగా వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేశారు. -
100/100
[ 27-07-2024]
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో భాగంగా జాబ్కార్డుదారులకు నూరు రోజుల పనిదినాలు కల్పించడంలో యాదాద్రి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
హద్దులు చెరిపి.. ఆక్రమించి..!
[ 27-07-2024]
నకిరేకల్ శివారులో 124 కి.మీ వద్ద ఏఎంఆర్పీ ప్రధాన కాల్వ భూమి హద్దురాళ్లను తొలగించి గట్టువెంట పడేశారు. భూమిని ఆక్రమించి సాగుచేసుకుంటున్నారు. -
చెత్తకుప్పలు.. రోగాలతో తిప్పలు
[ 27-07-2024]
పురపాలికల్లో రహదారుల పక్కనే చెత్తాచెదారం దర్శనమిస్తోంది. ఇంటింటా చెత్త సేకరణకు సిబ్బంది ప్రతి వీధిలో వాహనంతో పర్యటించి సేకరణ చేపట్టాల్సి ఉన్నా.. పూర్తిస్థాయిలో సేకరణ జరగడం లేదు. -
బంతే..భవిష్యత్తుగా..!
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్ క్రీడా సంగ్రామం మొదలైంది. ఈ పోటీల్లో మన దేశం నుంచి 117 మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు. -
నెలకో తీరు.. హుషారు
[ 27-07-2024]
చిన్నతనం నుంచే పిల్లల్లో మానసిక, శారీరక చురుకుదనం ఉండాలని తల్లిదండ్రులు తపన పడుతుంటారు. రకరకాల తినుబండారాలు, రంగుల బొమ్మలు చేతికిచ్చినా.. ఏదో తెలియని వెలితి వారి మనసును తొలిచేస్తుంటుంది. ఆ వెలితిని ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో పూడ్పించేసుకోవచ్చు. ఇక్కడ చిన్నారుల అభిరుచికి తగ్గట్టుగానే నిత్యం పోషకాహారం అందిస్తారు. ఆడిస్తారు. పాడిస్తారు. -
చేపా.. చేపా... చెరువుకు దూరమేనా..?
[ 27-07-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. మత్స్యకారుల జీవనోపాధి కోసం గత సర్కారు ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. -
బావిలోకి దిగి ఊపిరాడక మృతి
[ 27-07-2024]
బావిలోకి మోటారు మరమ్మతుల కోసం దిగిన రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో చోటు చేసుకుంది. -
స్వామి కల్యాణం.. అమ్మవారి ఊంజల్ సేవోత్సవం
[ 27-07-2024]
యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో ఆషాఢమాసం మూడో శుక్రవారం స్వామి, అమ్మవార్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఆచారంగా జరిగాయి. -
గోదావరి.. @ గోపీడాన్
[ 27-07-2024]
అమ్మాయిలు కేవలం వంటింటికే పరిమితమయ్యే రోజులు కావివి. అన్నింట్లో సగం, ఆకాశంలో..అవకాశాల్లో సగం అనే నినాదంతో ముందుకెళ్తున్న కాలం ఇది. -
వనాలపై దృష్టి.. సంపద సృష్టి
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రకృతి సంపద వనాలు లక్ష్యాలకు చేరువలో ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు సంపదను సృష్టించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయడానికి సంకల్పించారు. -
బస్తీ.. సైకిల్పై గస్తీ..!
[ 27-07-2024]
గతంలో పోలీస్ కానిస్టేబుళ్లు సైకిళ్లపైనే గస్తీ తిరిగే వారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా దశాబ్దాల నుంచి ద్విచక్రవాహనాలపై తిరుగుతున్నారు.. -
ఏ వీధి చూసినా.. భౌ..భౌ..
[ 27-07-2024]
నాలుగు నెలల క్రితం పహాడీనగర్లో ద్విచక్రవాహనంపై పిల్లలను స్కూల్కు దింపేందుకు వెళ్తున్న వ్యక్తిని కుక్కల గుంపు వెంబడించంది.
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్