పరీక్ష నెగ్గితే ఉపకార వేతనం
ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులు చదువును కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకు ఏటా నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పేరిట పరీక్ష నిర్వహిస్తూ అందులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఎంపిక చేసి ఐదేళ్ల పాటు ఉపకార వేతనం అందిస్తూ ప్రోత్సహిస్తోంది.
10న ఎన్ఎంఎంఎస్ పరీక్ష
సన్నద్ధమవుతున్న విద్యార్థులు
సూర్యాపేట పట్టణం, న్యూస్టుడే
ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులు చదువును కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకు ఏటా నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పేరిట పరీక్ష నిర్వహిస్తూ అందులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఎంపిక చేసి ఐదేళ్ల పాటు ఉపకార వేతనం అందిస్తూ ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. పరీక్షలో ఎంపికయిన ప్రతిభావంతులకు ఇంటర్ పూర్తయ్యే వరకు ఉపకార వేతనం అందిస్తారు. ఈ పరీక్ష రెండు దశల్లో మెంటల్ ఎబిలిటీ (ఎంఏటీ), స్కాలస్టిక్్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఎస్ఏటీ) నిర్వహిస్తున్నారు. వీటిల్లో మెరిట్ ఆధారంగా ఉపకార వేతనానికి ఎంపిక చేస్తారు.
ఆన్లైన్లో హాల్టికెట్లు
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షకు అర్హులు. ఈ సంవత్సరం పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 10వ తేదీన పరీక్ష నిర్వహించనుండటంతో దరఖాస్తుదారులు సన్నద్ధమవుతున్నారు. గత ఏడాది ఎంపికైన వారి సూచనలు, సలహాలు తీసుకుంటూ పట్టుదలతో సిద్ధమవుతున్నారు. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు యూసర్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా http//bse.telangana.gov.in వెబ్సైట్లో హాల్టికెట్లను పొందవచ్చు. పరీక్ష సమయానికి ఒక గంట ముందే హాజరు కావాలని అధికారులు సూచించారు.
పరీక్షకు హాజరుకానున్న 1,050 మంది విద్యార్థులు
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 1050 మంది విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ పరీక్ష రాయనున్నారు. గత సంవత్సరం 1,120 మంది పరీక్ష రాయగా వీరిలో 74 మంది ఉపకార వేతనానికి ఎంపికయ్యారు. వీరికి ఏటా రూ.12 వేల చొప్పున విడతల వారీగా అందిస్తున్నారు. విద్యార్థులకు నేరుగా ఆధార్ కార్డు ద్వారా తీయించిన బ్యాంకు ఖాతాలో జమయ్యేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎంపికైన అభ్యర్థులు సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా బ్యాంకు ఖాతా నంబర్ల పరిశీలన చేసుకుని అందించాల్సి ఉంటుంది. పరీక్ష రాయబోయే విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సూచనలు తీసుకుని సన్నద్ధమైతే ఎంపిక సులువు అవుతుందని విజేతలు చెబుతున్నారు.
సందేహాలు నివృత్తి చేసుకోవాలి
హేమ, తొమ్మిదో తరగతి, ఎన్ఎంఎంఎస్ విజేత, పాలవరం, అనంతగిరి
ఎన్ఎంఎంఎస్ పరీక్షకు సన్నద్ధమయ్యే విద్యార్థులు తప్పనిసరిగా ఉపాధ్యాయుల సలహాలు తీసుకోవాలి. ఈ పరీక్షకు ప్రత్యేకంగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. అదనంగా రోజుకు మూడు, నాలుగు గంటల పాటు చదవాలి. ఏ చిన్న సందేహం కలిగిన వెంటనే నివృత్తి చేసుకుంటే వెంటనే గుర్తుంటుంది.
గణితం సాధన చేస్తే మేలు
-నందిని, తొమ్మిదో తరగతి, ఎన్ఎంఎంఎస్ విజేత, పాలవరం, అనంతగిరి
గణితంలోని సమస్యలను ఎక్కువగా సాధన చేయాలి. మిగతావి చదివితే గుర్తుంటుంది. ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుల సలహాలు, సూచనలు పాటించాలి. గత పరీక్ష పేపర్ను ఒకటికి రెండు సార్లు చదవాలి. దాని ప్రకారం ప్రశ్నలను తయారు చేసుకుని చదివితే చాలా మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100/100
[ 27-07-2024]
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో భాగంగా జాబ్కార్డుదారులకు నూరు రోజుల పనిదినాలు కల్పించడంలో యాదాద్రి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
హద్దులు చెరిపి.. ఆక్రమించి..!
[ 27-07-2024]
నకిరేకల్ శివారులో 124 కి.మీ వద్ద ఏఎంఆర్పీ ప్రధాన కాల్వ భూమి హద్దురాళ్లను తొలగించి గట్టువెంట పడేశారు. భూమిని ఆక్రమించి సాగుచేసుకుంటున్నారు. -
చెత్తకుప్పలు.. రోగాలతో తిప్పలు
[ 27-07-2024]
పురపాలికల్లో రహదారుల పక్కనే చెత్తాచెదారం దర్శనమిస్తోంది. ఇంటింటా చెత్త సేకరణకు సిబ్బంది ప్రతి వీధిలో వాహనంతో పర్యటించి సేకరణ చేపట్టాల్సి ఉన్నా.. పూర్తిస్థాయిలో సేకరణ జరగడం లేదు. -
బంతే..భవిష్యత్తుగా..!
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్ క్రీడా సంగ్రామం మొదలైంది. ఈ పోటీల్లో మన దేశం నుంచి 117 మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు. -
నెలకో తీరు.. హుషారు
[ 27-07-2024]
చిన్నతనం నుంచే పిల్లల్లో మానసిక, శారీరక చురుకుదనం ఉండాలని తల్లిదండ్రులు తపన పడుతుంటారు. రకరకాల తినుబండారాలు, రంగుల బొమ్మలు చేతికిచ్చినా.. ఏదో తెలియని వెలితి వారి మనసును తొలిచేస్తుంటుంది. ఆ వెలితిని ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో పూడ్పించేసుకోవచ్చు. ఇక్కడ చిన్నారుల అభిరుచికి తగ్గట్టుగానే నిత్యం పోషకాహారం అందిస్తారు. ఆడిస్తారు. పాడిస్తారు. -
చేపా.. చేపా... చెరువుకు దూరమేనా..?
[ 27-07-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. మత్స్యకారుల జీవనోపాధి కోసం గత సర్కారు ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. -
బావిలోకి దిగి ఊపిరాడక మృతి
[ 27-07-2024]
బావిలోకి మోటారు మరమ్మతుల కోసం దిగిన రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో చోటు చేసుకుంది. -
స్వామి కల్యాణం.. అమ్మవారి ఊంజల్ సేవోత్సవం
[ 27-07-2024]
యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో ఆషాఢమాసం మూడో శుక్రవారం స్వామి, అమ్మవార్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఆచారంగా జరిగాయి. -
గోదావరి.. @ గోపీడాన్
[ 27-07-2024]
అమ్మాయిలు కేవలం వంటింటికే పరిమితమయ్యే రోజులు కావివి. అన్నింట్లో సగం, ఆకాశంలో..అవకాశాల్లో సగం అనే నినాదంతో ముందుకెళ్తున్న కాలం ఇది. -
వనాలపై దృష్టి.. సంపద సృష్టి
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రకృతి సంపద వనాలు లక్ష్యాలకు చేరువలో ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు సంపదను సృష్టించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయడానికి సంకల్పించారు. -
బస్తీ.. సైకిల్పై గస్తీ..!
[ 27-07-2024]
గతంలో పోలీస్ కానిస్టేబుళ్లు సైకిళ్లపైనే గస్తీ తిరిగే వారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా దశాబ్దాల నుంచి ద్విచక్రవాహనాలపై తిరుగుతున్నారు.. -
ఏ వీధి చూసినా.. భౌ..భౌ..
[ 27-07-2024]
నాలుగు నెలల క్రితం పహాడీనగర్లో ద్విచక్రవాహనంపై పిల్లలను స్కూల్కు దింపేందుకు వెళ్తున్న వ్యక్తిని కుక్కల గుంపు వెంబడించంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?